అన్వేషించండి

11 రాష్ట్రాల్లో సెరో టైప్-2 డెంగ్యూ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం.. జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా..

సెరో టైప్-2 డెంగ్యూ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇతర వ్యాధులతో పోల్చి చూస్తే సెరో టైప్-2 డెంగ్యూ కేసుల సమస్య ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

 

ప్రస్తుతం కొవిడ్-19 పరిస్థితి, టీకాల కార్యక్రమంపై  కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన  ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు పాల్గొన్నారు. కొవిడ్ తాజా పరిస్థితిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను సమగ్రంగా చర్చించారు.    

కొవిడ్ పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించొద్దని కేబినెట్ కార్యదర్శి సూచించారు. కొవిడ్ నియంత్రించేందుకు మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని చెప్పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించడం పట్ల  కేబినెట్ కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు.  

ఆ రాష్ట్రాల్లో సమస్య ఎక్కువగాఉంది

డెంగ్యూ విజృంభనపైనా ఈ సమావేశంలో చర్చించారు. సెరో టైప్-2 డెంగ్యూ కేసుల పట్ల 11 రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి చెప్పారు. ఇతర వ్యాధులతో పోల్చి చూస్తే ఈ రాష్ట్రాల్లో సెరో టైప్-2 డెంగ్యూ కేసుల సమస్య ఎక్కువగా ఉందన్నారు. సెరో టైప్-2 డెంగ్యూ కేసులను ముందుగానే గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని సూచించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష సదుపాయాలను మెరుగు పరచడానికి, అవసరమైన ఔషధాలను సమీకరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. 

జాగ్రత్తలపై వివరించాలి

వ్యాధిని గుర్తించడానికి సర్వే నిర్వహించి, వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించాలని చెప్పారు  రక్తం  ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ తగినంత నిల్వలను నిల్వ చేయాలని బ్లడ్ బ్యాంక్‌లకు సూచనలు జారీ చేయాలని ఆయన అన్నారు. వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అమలు చేస్తున్న నివారణా చర్యలను ప్రజలకు వివరించడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. డెంగ్యూ వ్యాపించ కుండా ఇళ్లలో తీసుకోవలసి జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. 

సెరో టైప్-2 డెంగ్యూ కేసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్,కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.

70 జిల్లాల్లో పరిస్థితి అధికం

కరోనాతో 15 రాష్ట్రాలలోని 70 జిల్లాలో పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉందని  ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ఈ 70 జిల్లాల్లోని 34 జిల్లాలు పాజిటివిటీ శాతం 10కి మించి ఉందని, మిగిలిన జిల్లాల్లో ఇది 5 నుంచి 10 శాతం వరకు ఉందని అన్నారు.  పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.   అన్ని జిల్లాల్లో  పరిస్థితిని గమనిస్తూ వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడడానికి అవసరమైన ఆంక్షలను నిబంధనలకు అనుగుణంగా విధించాలని అన్నారు. 

Also Read: Gold-Silver Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలివే..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget