అన్వేషించండి

ఈ డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ

Loksabha Election 2024: ఈ డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశముందని మమతా బెనర్జీ అన్నారు.

 Loksabha Election 2024: 

డిసెంబర్‌లోనే ఎన్నికలు..? 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశముందని అన్నారు. బీజేపీ ఇందుకోసం ముందుగానే కసరత్తు చేసిందని వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ అన్ని చాపర్స్‌ని బుక్ చేసుకుందని, దేశవ్యాప్తంగా ప్రచారానికి సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ యూత్ ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ కామెంట్స్ చేశారు. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలన తప్పదని హెచ్చరించారు. ఇటీవల బరాసత్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటన గురించీ ప్రస్తావించారు దీదీ. కొందరు కుట్రపూరితంగా ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వీళ్లకు కొందరు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని మండి పడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీపైనా ఆరోపణలు చేశారు. 

"కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలన తప్పదు. నాకున్న సమాచారం మేరకు ఈ ఏడాది డిసెంబర్‌లోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం అన్ని చాపర్స్‌ని బుక్ చేసుకుంటోంది. ముందస్తుగానే బుకింగ్స్ చేసుకుని వేరే పార్టీకి ప్రచారం చేసుకునే అవకాశమే లేకుండా చేస్తోంది. ఇప్పటికే బీజేపీ దేశంలో మతాల పేరిట చిచ్చు పెడుతోంది. మళ్లీ ఆ పార్టీయే అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా విద్వేషాలు పెరిగిపోతాయి"

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 

మూడు దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలదే హవా. ఆ కంచుకోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చింది TMC.ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ దీదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వామపక్షాలను ఓడించానని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనీ తప్పకుండా ఓడిస్తానని తేల్చి చెప్పారు. గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌తో ఉన్న విభేదాలనూ ప్రస్తావించారు. రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని మండి పడ్డారు. ఆ పదవికి గౌరవిస్తానని, కానీ రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోవడాన్ని సహించేదే లేదని వెల్లడించారు. మమతా బెనర్జీ కన్నా ముందే పలువురు కీలక నేతలు లోక్‌సభ ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశముందని అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్‌కే స్టాలిన్ కూడా గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Chandrayaan 3 Rover Pragyan: మూన్ వాక్ లో చంద్రయాన్ రోవర్ కు తప్పిన పెను ప్రమాదం, ISRO అలర్ట్

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget