అన్వేషించండి

High Alert In Punjab, Rajasthan: పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హై అలర్ట్, పోలీసుల సెలవులు రద్దు.. యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్

Operation Sindoor | పాకిస్తాన్ నుంచి డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్ చేశారు. పంజాబ్, రాజస్తాన్ లో పోలీసుల సెలవులు సైతం రద్దు చేశారు.

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. నియంత్రణ రేఖ, సరిహద్దుల వెంట పాక్ ఆర్మీ అమాయక పౌరులపై కాల్పులు జరిపింది. దాంతో పాక్‌తో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. బహిరంగ సహావేశాలపై నిషేధం విధించడంతో పాటు.. పాక్‌తో సరిహద్దు ప్రాంతాల మార్గాలను మూసివేశారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత రోజు (గురువారం) పాకిస్థాన్‌తో పంచుకుంటున్న 1,037 కి.మీ పొడవైన సరిహద్దును రాజస్థాన్ లో మూసివేశారు. దాంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న పరిస్థితుల్లో సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF) మరింత అప్రమత్తం అయ్చాయి. సరిహద్దు ప్రాంతాల వెంట, నిరంతరం నిఘా, పర్యవేక్షిస్తున్నారు. 

రాజస్తాన్‌లోని జోధ్‌పూర్, జైసల్మేర్, నాల్, ఫలోడి, ఉత్తర్లైలతో సహా అన్ని పశ్చిమ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలు అప్రమత్తంగా ఉన్నాయి. అధునాతన ఆయుధాలతో ఉన్న సుఖోయ్ సు-30 ఎం.కె.ఐ.లతో సహా యుద్ధ విమానాలు శ్రీ గంగనగర్ నుంచి కచ్ రణ్ వరకు ఆకాశంలో పహారా కాస్తున్నాయి. 

గగనతలంలో బీఎస్‌ఎఫ్ నియంత్రణ రేఖకు దగ్గరగా గస్తీని తీవ్రతరం చేసింది. అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే వేంటనే చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. సున్నితమైన ప్రాంతాలకు అదనపు దళాలను తరలిస్తున్నారు. 

యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్

యాంటీ-డ్రోన్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. సరిహద్దు దాటి ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్ దాడిని అడ్డుకునేందుకు 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నారు. సైన్యం భారీగా మోహరించినప్పటికీ, రాజస్థాన్ సరిహద్దులోని గ్రామాలను ఇంకా ఖాళీ చేయలేదు. బీఎస్‌ఎఫ్ రాజస్థాన్ ఫ్రంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఎం.ఎల్. గర్గ్ ఆ ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయడం కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదనపు సిబ్బందిని రప్పించి, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం చేస్తున్నారు. 

శత్రు విమానాలు ఏవైనా భారత గగనతంలోకి ప్రవేశించగానే కూల్చివేసేందుకు మన బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత సైన్యం కూడా పాక్ నుంచి ఏమైనా దాడులు జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై, పీఓకేలోని స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తరువాత బికనీర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 

బికనీర్‌లోని అన్ని పెట్రోల్ పంపులు 2,000 లీటర్ల పెట్రోల్, 5,000 లీటర్ల డీజిల్‌ను రిజర్వ్ చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర ఇంధన నిల్వను అందుబాటులో ఉంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏమైనా జరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఖాజువాల్ నుంచి శ్రీ గంగనగర్ వరకు ఉన్న ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న రాజస్థాన్ ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం కదలికలపై భారత బలగాలు నిఘా పెట్టాయి. సరిహద్దులోని పలు ప్రంతాలలో ఖారా తోబా, సాదికాబాద్, ఖాన్‌పూర్, సిర్దఖ్లి, బిజ్నోత్, జహురివాల్, రాహిమ్యార్ ఖాన్, లియాక్వత్‌పూర్, ముజ్‌గర్ ఫోర్ట్, ఫకిర్వాలి, యజ్‌మాన్ మండి, ఫోర్ట్ అబ్బాస్, బహావల్‌నగర్, బహావల్‌పూర్, కె.కె. టిబ్బా, లాల్ సహరణా నేషనల్ పార్క్ వంటి ప్రాంతాలలో భారత సైన్యం గస్తీ పెంచింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
Viral Brother Story: 10 మంది అక్కల ఓ తమ్ముడి కథ - ఇతని కష్టాలు వింటే మీ కష్టాలు చాలా చిన్నవని అనుకుంటారు!
10 మంది అక్కల ఓ తమ్ముడి కథ - ఇతని కష్టాలు వింటే మీ కష్టాలు చాలా చిన్నవని అనుకుంటారు!
Maintenance for wife: భార్యలు ఇంట్లో పనిమనుషులు కాదు - విడాకులు కోరిన భర్తకు షాక్ - ముంబై హైకోర్టు సంచలన తీర్పు.
భార్యలు ఇంట్లో పనిమనుషులు కాదు - విడాకులు కోరిన భర్తకు షాక్ - ముంబై హైకోర్టు సంచలన తీర్పు.
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
Embed widget