అన్వేషించండి

High Alert In Punjab, Rajasthan: పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హై అలర్ట్, పోలీసుల సెలవులు రద్దు.. యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్

Operation Sindoor | పాకిస్తాన్ నుంచి డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్ చేశారు. పంజాబ్, రాజస్తాన్ లో పోలీసుల సెలవులు సైతం రద్దు చేశారు.

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. నియంత్రణ రేఖ, సరిహద్దుల వెంట పాక్ ఆర్మీ అమాయక పౌరులపై కాల్పులు జరిపింది. దాంతో పాక్‌తో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. బహిరంగ సహావేశాలపై నిషేధం విధించడంతో పాటు.. పాక్‌తో సరిహద్దు ప్రాంతాల మార్గాలను మూసివేశారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత రోజు (గురువారం) పాకిస్థాన్‌తో పంచుకుంటున్న 1,037 కి.మీ పొడవైన సరిహద్దును రాజస్థాన్ లో మూసివేశారు. దాంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న పరిస్థితుల్లో సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF) మరింత అప్రమత్తం అయ్చాయి. సరిహద్దు ప్రాంతాల వెంట, నిరంతరం నిఘా, పర్యవేక్షిస్తున్నారు. 

రాజస్తాన్‌లోని జోధ్‌పూర్, జైసల్మేర్, నాల్, ఫలోడి, ఉత్తర్లైలతో సహా అన్ని పశ్చిమ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలు అప్రమత్తంగా ఉన్నాయి. అధునాతన ఆయుధాలతో ఉన్న సుఖోయ్ సు-30 ఎం.కె.ఐ.లతో సహా యుద్ధ విమానాలు శ్రీ గంగనగర్ నుంచి కచ్ రణ్ వరకు ఆకాశంలో పహారా కాస్తున్నాయి. 

గగనతలంలో బీఎస్‌ఎఫ్ నియంత్రణ రేఖకు దగ్గరగా గస్తీని తీవ్రతరం చేసింది. అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే వేంటనే చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. సున్నితమైన ప్రాంతాలకు అదనపు దళాలను తరలిస్తున్నారు. 

యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్

యాంటీ-డ్రోన్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. సరిహద్దు దాటి ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్ దాడిని అడ్డుకునేందుకు 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నారు. సైన్యం భారీగా మోహరించినప్పటికీ, రాజస్థాన్ సరిహద్దులోని గ్రామాలను ఇంకా ఖాళీ చేయలేదు. బీఎస్‌ఎఫ్ రాజస్థాన్ ఫ్రంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఎం.ఎల్. గర్గ్ ఆ ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయడం కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదనపు సిబ్బందిని రప్పించి, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం చేస్తున్నారు. 

శత్రు విమానాలు ఏవైనా భారత గగనతంలోకి ప్రవేశించగానే కూల్చివేసేందుకు మన బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత సైన్యం కూడా పాక్ నుంచి ఏమైనా దాడులు జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై, పీఓకేలోని స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తరువాత బికనీర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 

బికనీర్‌లోని అన్ని పెట్రోల్ పంపులు 2,000 లీటర్ల పెట్రోల్, 5,000 లీటర్ల డీజిల్‌ను రిజర్వ్ చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర ఇంధన నిల్వను అందుబాటులో ఉంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏమైనా జరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఖాజువాల్ నుంచి శ్రీ గంగనగర్ వరకు ఉన్న ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న రాజస్థాన్ ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం కదలికలపై భారత బలగాలు నిఘా పెట్టాయి. సరిహద్దులోని పలు ప్రంతాలలో ఖారా తోబా, సాదికాబాద్, ఖాన్‌పూర్, సిర్దఖ్లి, బిజ్నోత్, జహురివాల్, రాహిమ్యార్ ఖాన్, లియాక్వత్‌పూర్, ముజ్‌గర్ ఫోర్ట్, ఫకిర్వాలి, యజ్‌మాన్ మండి, ఫోర్ట్ అబ్బాస్, బహావల్‌నగర్, బహావల్‌పూర్, కె.కె. టిబ్బా, లాల్ సహరణా నేషనల్ పార్క్ వంటి ప్రాంతాలలో భారత సైన్యం గస్తీ పెంచింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Embed widget