అన్వేషించండి

Maharashtra: గడ్చిరోలి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లాలోని కొత్గుల్-గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. 

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన భికర ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 6.30గం. సమయంలో కాల్పులు మొదలైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులకు, మావోలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం. ఇప్పటి వరకూ 26 మంది మృతి చెందగా.. ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉంది. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

కొత్గుల్-గ్యారపట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు.. పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎదురుపడగా.. మావోయిస్టులకు, పోలీసులకు నడుమ ఎదురు కాల్పులు మెుదలయ్యాయి. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ సీనియర్ సభ్యులు మిలింద్ బాబురావు తెల్తుంబ్డే అలియాస్ దీపక్ తెల్తుంబ్డే, ఛత్తీస్‌గఢ్ (MMC)  ప్రత్యేక జోనల్ కార్యదర్శి, డీవీసీ శుల్కలాల్ కూడా చనిపోయినట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 

కొన్ని సంవత్సరాలుగా.. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే పార్టీ బలహీనపడిపోయిందన్న చర్చ ఓ వైపు నడుస్తోంది. మావోయిస్టు పార్టీ మాత్రం ఇప్పటికీ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం విశాఖలో జరిగిన ఎదురుకాల్పుల్లోనూ.. ముఖ్యమైన నేతలు మరణించారు. ఇటీవలే.. మావోయిస్టు నేత అగ్రనేత.. ఆర్కే కూడా మృతి చెందారు. మళ్లీ 26 మంది మృతితో మావోయిస్టు పార్టీకు పెద్ద దెబ్బ పడినట్టైంది.

బాంబు పేలి..  మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ ప్రకటన జారీ చేసింది. బాంబులు పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి మావోయిస్టు రవి మృతి చెందాడని పేర్కొంది. మావోయిస్టు కేంద్ర కమిటీ టెక్ టీంలో రవి కీలక సభ్యుడు. రవి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత ఆయన మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఝార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టులు తెలిపారు. టెక్నికల్ టీమ్ లో కీలక సభ్యులుగా కొనసాగిన రవి... కమ్యూనికేషన్స్ తోపాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయడంలో దిట్ట. 

తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు పేలి రవి మృతి చెందారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రమాదం జరిగింది. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ రవి మరణాన్ని ఆలస్యంగా ధ్రువీకరించింది. మావోయిస్టు టెక్నికల్ టీంలో సభ్యుడిగా ఉన్న రవికి కమ్యునికేషన్స్‌తో పాటు ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో సిద్ధహస్తుడు. జూన్ 5, 2020న ఝార్ఖండ్‌లో జరిగిన ఓ బాంబు ప్రమాదంలో రవి మృతి చెందాడని, అతడి భౌతిక కాయాన్ని విప్లవ లాంఛనాలతో అంత్యక్రియలు చేశామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది.

Also Read: Delhi LockDown : ఢిల్లీలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు.. కరోనా కాదు కాలుష్యం కారణం !

Also Read: Terrorist Attack: అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
CSK Vs GT IPL 2024: చెన్నై పై గుజరాత్ ఘన విజయం
చెన్నై పై గుజరాత్ ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Shubman Gill And Sai Sudharsan Centuries | GT vs CSK Highlights | కీలక మ్యాచులో చెన్నై ఓటమి| ABPRaja Singh Insulted in PM Modi Public Meeting | ఎల్బీ స్టేడియంలో రాజాసింగ్ కు అవమానం.. ఏం జరిగిందంటేChiranjeevi on Pawan Kalyan | Pithapuram | పవన్ తరపున ప్రచారానికి వెళ్లనన్న చిరంజీవి |YS Sharmila Interview | ఒక్కోసారి జగన్‌ను చూస్తుంటే అసలు నా అన్నయ్యేనా అనిపిస్తోంది... | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
CSK Vs GT IPL 2024: చెన్నై పై గుజరాత్ ఘన విజయం
చెన్నై పై గుజరాత్ ఘన విజయం
Unhealthy Food: మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Sharmila :  తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు  - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు
తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు
Kazipet Coach Factory: 44 ఏళ్లుగా కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాట్లేదు? దాన్ని ఎవరు తన్నుకుపోయారు?
44 ఏళ్లుగా కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాట్లేదు? దాన్ని ఎవరు తన్నుకుపోయారు?
Embed widget