అన్వేషించండి

MahaSwetha Chakravarthy: నాడు ఆక్సిజన్ , నేడు ఉక్రెయిన్, ఆమెకు టాస్క్ అప్పగిస్తే అయిపోయినట్టే

ఓ వైపు బాంబులు మోత, మరోవైపు విద్యార్థుల ఆందోళన.. ఈ పరిస్థితుల్లో అందర్నీ స్వస్థలాలకు చర్చడం చిన్న విషయం కాదు. అందుకే ఈ టాస్క్‌ను పాతికేళ్లైనా నిండని ఆమెకు అప్పగించారు.

ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ లో ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఉక్రెయిన్ బలగాలు సైతం రష్యన్ సైన్యాన్ని తమ భూభాగం నుంచి తరిమికొట్టేందుకు సర్వశక్తులు ప్రదర్శిస్తోంది. భారత్ శాంతిమంత్రాన్ని పాటిస్తూనే.. హ్యూమనటేరియన్ గ్రౌండ్స్ లో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులతో పాటు సాధారణ పౌరులను వారి దేశాలకు తరలించేందుకు సాయం అందిస్తోంది. ఆపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకున్న వేలాది విద్యార్థులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.

టాక్‌ ఆఫ్‌ ది కంట్రీ

సరిగ్గా ఈ సందర్భంలోనే ఓ యువతి వార్తల్లో నిలిచింది. తన విధులను కచ్చితత్వంతో నిర్వర్తిస్తూనే ధైర్యసాహసాలను ప్రదర్శించి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఆమె పేరే మహాశ్వేత చక్రవర్తి.

టఫ్‌ టాస్క్‌ స్మూత్‌గా

24 ఏళ్ల మహాశ్వేత చక్రవర్తి...ఓ పైలెట్. కోల్ కతా కు చెందిన ఈమె నాలుగేళ్లుగా పైలెట్ గా ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉక్రెయిన్ వార్ లో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించే బృందంలో పాల్గొనాలని మహాశ్వేత చక్రవర్తికి ఆదేశాలు అందాయి. ఉక్రెయిన్, పోలాండ్, హంగేరీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించటం ఆమెకు అప్పగించిన టాస్క్. అలా ఫిబ్రవరి 27న తనకు అప్పగించిన బాధ్యతలను స్వీకరించిన మహాశ్వేత చక్రవర్తి...మార్చి 7 వరకూ అంటే పదిరోజుల్లో 6  విమానాలను నడిపారు. మూడు దేశాల నుంచి మొత్తం  800 మంది విద్యార్థులను ఈ యువ పైలట్ భారత్ కు సురక్షితంగా తరలించారు. 

ఎయిర్‌బస్‌ నడపడం మర్చిపోలేని సంఘటన

స్పెషల్ మిలటరీ ఆపరేషన్ లో భాగంగా ఎయిర్‌బస్‌-ఏ320 (Airbus A320) లాంటి విమానాలను రోజుకు 13, 14 గంటల పాటు నడపటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని మహాశ్వేత చక్రవర్తి తెలిపారు. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో భయపడకుండా విమానాలను నడిపి...భారతీయ విద్యార్థులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చిన యువ పైలట్ అంటూ ఆమె ధైర్య సాహసాలను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.

కరోనా టైంలో ఆక్సిజన్

ఆమెను ఈ స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కు తీసుకోవటానికి ప్రధాన కారణం.. ఇంతకు ముందు వందే భారత్ మిషన్ లోనూ మహాశ్వేత భాగస్వామి కావటం. కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లు లేక అల్లాడుతున్న ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పుణే నుంచి కోల్ కతా కు ఆమె విమానాలను నడిపారు. అంతే కాదు ఆక్సిజన్ కొరతను భారత్ ఎదుర్కొన్న వేళ...విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సట్రేటర్ లను భారత్ కు తీసుకువచ్చిన టీంలోనూ మహాశ్వేత చక్రవర్తి సభ్యురాలు. అప్పటి సేవలను గుర్తుపెట్టుకున్న భారతీయ వాయుసేన... ఉక్రెయిన్ యుద్ధ సమంయలోనూ ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు.

రాజకీయ నేపథ్యం

మహాశ్వేత వ్యక్తిగత జీవితానికి వస్తే కోల్ కతా కు చెందిన ఓ రాజకీయ కుటుంబంలో జన్మించారు ఆమె. 24 ఏళ్ల శ్వేత ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీ నుంచి ఏవియేషన్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె తల్లి తనూజా చక్రవర్తి పశ్చిమబెంగాల్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ గా ఉన్నారు. తన కుమార్తె ను పూర్తిగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా పెంచామన్న తనూజా...భారతీయ వాయుసేన తో కలిసి తను సాధించిన విజయాలు గర్వకారణమని కొనియాడారు. కీలకమైన ఆపరేషన్ లో  తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న మహాశ్వేత చక్రవర్తిపై ప్రశంసల జల్లు కురస్తూనే ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP DesamDanam Nagender Face to Face | కొత్త నాయకత్వంకాదు..ముందు కేటీఆర్ మారాలంటున్న దానం | ABP DesamMadhavi Latha Sensational Interview | లక్ష ఓట్ల తేడాతో ఒవైసీని ఓడిస్తానంటున్న మాధవీలత | ABP DesamParipoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget