అన్వేషించండి

Corona Cases In India: దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు.. వైరస్ కారణంగా మరో 166 మంది మృతి

దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త తగ్గాయి. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు రెండు లక్షల దిగువకు, మరణాలు 200లోపు నమోదయ్యాయి. 

దేశంలో కొత్తగా 9,89,493 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,596 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయిన కేసులు..తాజాగా మరింత తగ్గాయి. నిన్న 19,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.34 కోట్ల మంది వైరస్‌ను జయించారు. కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. రెండు లక్షల దిగువకు చేరిన కేసులు.. మరింత తగ్గి 1.89 లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.56 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.12 శాతానికి పెరిగింది. నిన్న 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,52,290 మంది వైరస్ కు బలయ్యారు.

చిన్నారులకు కరోనా టీకాలపై

భారత్‌లో 18 ఏళ్లలోపు వారికి కొవిడ్19 టీకాలకు అనుమతిపై కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ విషయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ డాక్టర్‌ వీకే పాల్‌ అన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని, అయితే పలు దేశాల్లో రెండు డోసులు తీసుకున్న తరువాత కరోనా కేసులు పెరిగాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాస్త్రీయ విషయాలను పరిశీలించిన అనంతరం కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సిన్లపై తుది నిర్ణయం తీసుకుంటుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.


పలు దేశాలలో కరోనా టూ వేవ్స్ వచ్చాయని చెప్పడానికి చింతిస్తున్నానని.. ఇతర దేశాలతో పోల్చితే భారత్ మెరుగ్గా ఉందన్నారు. పండుగలు, చాలా మంది ప్రజలు ఒకేచోట గుమిగూడే ఈవెంట్లు ఇటీవల జరిగాయని.. కొన్ని రోజులపాటు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. విదేశాలలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు, ఆ తరువాత వచ్చిన శాస్త్రీయ ఫలితాలు చెక్ చేసిన తరువాత దేశంలో 18 ఏళ్లలోపు వారికి టీకాలపై నిర్ణయం తీసుకుంటామని వీకే పాల్ పేర్కొన్నారు. 

పలు దేశాలు కరోనా టీకాలు సమర్థవంతంగా ఇచ్చినప్పటికీ కొవిడ్19 తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని మరిచిపోకూడదన్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గాయని సంతోషించాల్సిన సమయం కాదని, మరింత జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ల సరఫరా సవ్యంగా జరుగుతోందని.. ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా కరోనా టీకాలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్న కారణంగా కొవిడ్19 మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు.


దేశంలో 18 సంవత్సరాలు దాటిన వారికి కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్ వి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఈ కరోనా వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిన టీకాలు. జైడస్ కాడిల్లా రూపొందించిన జైకోవ్ డి కరోనా వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి దేశంలో అందుబాటులోకి రానున్న తొలి టీకా కానుంది. ఇదివరకే అత్యవసర వినియోగానికి అనుమతి సైతం పొందింది. 

మరోవైపు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను 2 నుంచి 18 ఏళ్ల వారికి ఇచ్చేందుకు సెంట్రల్ డ్రగ్ అథారిటీ కొన్ని షరతులతో అత్యవసర వినియోగానికి ప్రతిపాదనలు చేసింది. ఒకవేళ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందితే 18 ఏళ్లలోపు వారికి ఇవ్వడానికి జైకోవ్ డీ తరువాత అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్‌ కోవాగ్జిన్ అవుతుంది. లభ్యత, సరఫరా, శాస్త్రీయ అంశాల ఆధారంగా చిన్నారులకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారని వీకే పాల్ వివరించారు.

Also Read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget