అన్వేషించండి

PMLA Court Seized Plane Auction: దేశంలోనే ఫస్ట్ టైమ్.. సీజ్ చేసిన విమానాన్ని వేలం వేసిన ఈడీ.. ఫాల్కన్ స్కామ్ బాధితులకు ఊరట!

ED Hyderabad: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈడీ అధికారులు తాము సీజ్ చేసిన రూ.14 కోట్ల విలువైన లగ్జరీ ప్రైవేట్ విమానాన్ని విజయవంతంగా వేలం వేశారు. అయితే రూ.3 కోట్లు మాత్రమే వచ్చాయి.

ED Hyderabad Auctions Seized Hawker 800A Aircraft:    ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక సరికొత్త రికార్డును నమోదు చేసింది. హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం తాము ఒక మనీ లాండరింగ్ కేసులో భాగంగా జప్తు చేసిన  హాకర్ 800ఎ  లగ్జరీ ప్రైవేట్ విమానాన్ని జూలై 1  నాడు విజయవంతంగా ఈ-వేలం ద్వారా విక్రయించింది. ప్రభుత్వ రంగ సంస్థ  ఎమ్‌ఎస్‌టీసీ లిమిటెడ్  ద్వారా నిర్వహించిన ఈ అధికారిక వేలంలో ఈ విమానం రూ.3 కోట్ల విక్రయ ధరకు అమ్ముడుపోయింది. దేశంలో ఈడీ ఒక విమానాన్ని వేలం వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ వేలం వెనుక హైదరాబాద్‌ను కుదిపేసిన రూ.792 కోట్ల భారీ ఫాల్కన్/క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోంజీ స్కామ్ ఉంది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే  క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ..  ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్  పేరుతో ఒక నకిలీ స్కీమ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అమాయక పెట్టుబడిదారుల నుండి భారీగా నిధులను సేకరించి, వారికి ఎవరూ ఊహించని స్థాయిలో అధిక వడ్డీలు, రాబడులు ఇస్తామని నమ్మబలికారు. కానీ, ఎలాంటి అసలైన వ్యాపారం చేయకుండా, కొత్తగా వచ్చే పెట్టుబడిదారుల సొమ్మును పాతవారికి ఇస్తూ చివరకు దాదాపు రూ.792 కోట్ల మేర సామాన్య ప్రజల సొమ్మును ముంచేశారు.  

ఈ స్కామ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, కంపెనీ సీఎండీ అమర్‌దీప్ కుమార్.. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం  తనపై కేసు నమోదు చేయడానికంటే ముందే.. తాను 2024లో రూ.14 కోట్లకు  కొనుగోలు చేసిన ఇదే ప్రైవేట్ జెట్ విమానంలో దేశం దాటి విదేశాలకు పారిపోయాడు. పరారీలో ఉన్న అమర్‌దీప్ కుమార్ వాడిన ఈ విమానం తిరిగి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి  చేరుకున్న తరుణంలో.. మార్చి 7, 2025 నాడు ఈడీ అధికారులు దీనిని సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ విమానాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అయితే, విమానాన్ని ఎక్కువ రోజులు అలాగే ఉంచితే సహజంగానే దాని విలువ పడిపోవడమే కాకుండా.. దాని పార్కింగ్, మెయింటెనెన్స్ కోసం ప్రతి నెలా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారాన్ని నివారించేందుకు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్  రూల్ 4(2) కింద ప్రత్యేక అనుమతి కోరుతూ ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. అందుకు కోర్టు అనుమతించడంతో ఈ వేలం ప్రక్రియ పూర్తయింది.

ఈ కేసులో ఈడీ అధికారులు కేవలం విమానాన్ని వేలం వేయడమే కాకుండా.. ఇప్పటికే అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, ఫాల్కన్ ఇన్వాయిస్ సీఈవో ఆర్యన్ సింగ్ ఛాబ్రాలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కాగా, ఈ విమానాన్ని వేలంలో ఎవరు కొనుగోలు చేశారనే  కొనుగోలుదారుడి అధికారిక పేరును గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ఈడీ ,  ఎమ్‌ఎస్‌టీసీ సంస్థలు బహిరంగంగా వెల్లడించలేదు. అయితే, ఈ వేలం ద్వారా వచ్చిన రూ.3 కోట్ల నగదును పీఎమ్‌ఎల్‌ఏ స్పెషల్ కోర్టు అనుమతితో.. ఫాల్కన్ స్కామ్‌లో సర్వస్వం కోల్పోయిన అసలైన, బాధితులైన ఇన్వెస్టర్లకు పరిహారంగా   పంపిణీ చేయనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ సంఘీభావం.. ఈ 15న భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ సంఘీభావం.. ఈ 15న భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
Shreyas Iyer Captaincy Nightmare: శ్రేయస్ అయ్యర్ పేరిట అన్ వాంటెడ్ రికార్డు.. ఆ జాబితాలో చోటు..
శ్రేయస్ అయ్యర్ పేరిట అన్ వాంటెడ్ రికార్డు.. ఆ జాబితాలో చోటు..
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Embed widget