అన్వేషించండి

Himachal CM Race: హిమాచల్ సీఎం రేసులో ప్రతిభా సింగ్ ఔట్? ఆమెను పట్టించుకోని అధిష్ఠానం!

Himachal CM Race: హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో ప్రతిభా సింగ్ పేరుని అధిష్ఠానం పక్కన పెట్టేసినట్టు సమాచారం.

Himachal CM Race:

పక్కన పెట్టేసిన పెద్దలు..

హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రెండ్రోజులుగా పార్టీలో మేధోమథనం సాగుతోంది. ఈ రేసులో దాదాపు నలుగురు సీనియర్లున్నారు. వారిలో మాజీ సీఎం వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ ఒకరు. ఆమెతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సుఖ్వీందర్ సింగ్, సీఎల్‌పీ నేత ముకేష్ అగ్నిహోత్రి, మరో లీడర్ రాజేంద్ర రాణా పేర్లు జాబితాలో ఉన్నాయి. ప్రతిభా సింగ్‌..తనకే సీఎం పదవిని కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ...అధిష్ఠానం మాత్రం అందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెకు అండగా ఉన్నారు. ఆమె మద్దతుదారులు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే షిమ్లా హెడ్‌క్వార్టర్స్ ఎదుట వాళ్లంతా నిరసన చేపట్టారు. ప్రతిభా సింగ్‌ను సీఎం చేయాలని నినదించారు. అయితే...అధిష్ఠానం మాత్రం ప్రతిభా సింగ్‌ పేరుని లిస్ట్‌లో నుంచి తీసేసినట్టు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురిలో ఎవరిని సీఎంగా చేయాలనే యోచనలో ఉంది. అయితే...ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉంది. అధిష్ఠానం నిర్ణయం మాత్రమే తీసుకోగలదు. కానీ...ఎమ్మెల్యేల్లో ఎవరైనా
వేరే అభ్యర్థికి మద్దతు తెలుపుతూ రాజీనామా వరకూ వెళ్తే అది అతి పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతిభా సింగ్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు వెనకడుగు వేయడానికి ఓ ప్రధాన కారణముంది. మండి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న ఆమెకు సీఎం పదవి అప్పగిస్తే ఆ సీట్‌ ఖాళీ అవుతుంది. ఇప్పటికిప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు పెట్టక తప్పదు. కానీ...ఈ ప్రాంతంలోని 10 సీట్లలో కాంగ్రెస్ 9 స్థానాలు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ అక్కడ ఎన్నికలు పెట్టి ఓడిపోవడం ఎందుకు అన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. అదీ కాకుండా...ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌కు కేబినెట్‌లో ఉన్నత పదవి ఇవ్వాలని భావిస్తోంది. అందుకే...ప్రతిభా సింగ్‌ను పక్కన పెట్టనుంది. 

అధిష్ఠానానిదే నిర్ణయం..

ప్రతిభా సింగ్‌కు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ...వారందరినీ పక్కన పెట్టేసింది అధిష్ఠానం. సుఖ్వీందర్‌ సింగ్‌కు ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉందని భావిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కలిసి దీనిపై ఓ నిర్ణయం తీసుకుని హై కమాండ్‌కు తమ అభిప్రాయాలు తెలిపారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్ఠానమే. "సీఎం ఎవరు అన్న విషయంలో స్పష్టత రాలేదు. చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. 
అన్ని కోణాల్లోనూ ఆలోచించి అభ్యర్థిని ప్రకటిస్తాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే సీఎం ఎవరో నిర్ణయిస్తారు. ఓటర్లు తమ నిర్ణయమేంటో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కీలక బాధ్యత తీసుకుని సీఎం ఎవరో తేల్చుకోవాలి" అని వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉంటామని ఓ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Also Read: KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget