By: Ram Manohar | Updated at : 03 Aug 2022 01:21 PM (IST)
నెహ్రూ జాతీయ జెండాను తొలిసారి ఎగరేసినప్పటి ఫోటోను కాంగ్రెస్ డీపీగా పెట్టుకుంది. (Image Credits: Twitter\Congress)
Har Ghar Tiranga:
త్రివర్ణ పతాకం మా గుండెల్లో ఉంది: కాంగ్రెస్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్ట్ 2-15వ తేదీ వరకూ సోషల్ మీడియా డీపీలో దేశ జెండాను పెట్టుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు ఇప్పటికే ప్రధాని పిలుపు మేరకు డీపీలు మార్చుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా తన ట్విటర్ డీపీ మార్చుకుంది. కేవలం త్రివర్ణ పతాకాన్ని పెట్టుకుంటే చర్చే ఉండేది కాదు. కానీ...నెహ్రూ
జాతీయ జెండాను ఆవిష్కరించినప్పటి ఫోటోను డీపీగా పెట్టుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ ఇదే డీపీని పెట్టుకుంటున్నారు. "త్రివర్ణ పతాకం మా గుండెల్లో ఉంది. మా రక్తంలో నిండిపోయింది. 1929 డిసెంబర్ 31వ తేదీన భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ త్రివర్ణ పతాకం ఎవరికీ తలొంచకూడదు" అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ త్రివర్ణ పతాకం మన ఉనికి,
భారతీయుల ఐకమత్యానికి ఇదే ప్రతీక అని అందులో వెల్లడించింది.
तिरंगा हमारे दिल में है, लहू बनकर हमारी रगों में है। 31 दिसंबर, 1929 को पंडित नेहरू ने रावी नदी के तट पर तिरंगा फहराते हुए कहा था, ‘अब तिरंगा फहरा दिया है, ये झुकना नहीं चाहिए'
आइए हम सब देश की अखंड एकता का संदेश देने वाले इस तिरंगे को अपनी पहचान बनाएं।जय हिंद#MyTirangaMyPride pic.twitter.com/NwgIMUHpp4 — Congress (@INCIndia) August 3, 2022
हम हाथ में तिरंगा लिए अपने नेता नेहरू की DP लगा रहे हैं। लेकिन लगता है प्रधानमंत्री का संदेश उनके परिवार तक ही नहीं पहुंचा। जिन्होंने 52 सालों तक नागपुर में अपने हेड क्वार्टर में झंडा नहीं फहराया, वे क्या प्रधानमंत्री की बात मानेंगे? #MyTirangaMyPride https://t.co/JOiTkYC9cY
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2022
ప్రధాని మాటలు వాళ్లు వింటారా..?
సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్ సహా మరికొందరు నేతలు నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటోను డీపీగా పెట్టుకున్నారు. జైరాం రమేశ్ "ఇది ఖాదీతో తయారు చేసింది" అని జెండాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఇలా అన్నారు జైరాం రమేశ్. పాలిస్టర్ జెండాలు తయారు చేసేందుకు, విక్రయించేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఇలా వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆర్ఎస్ఎస్పైనా సెటైర్లు వేశారు. "మేమంతా త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకున్నాం. కానీ ప్రధాని మోదీ పిలుపు, ఆయన కుటుంబ సభ్యులకే వినపడలేదేమో. నాగ్పూర్లోని హెడ్క్వార్టర్స్లో 52 ఏళ్లుగా జాతీయ జెండా ఎగరేయని వాళ్లు, ప్రధాని మాటలు వింటారా..?" అని ట్వీట్ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా...RSS ట్విటర్ అకౌంట్ డీపీల స్క్రీన్షాట్స్ తీసి ట్వీట్ చేశారు. RSS చీఫ్ మోహన్ భగవత్ ట్విటర్ అకౌంట్ డీపీ కూడా ఇందులో ఉంది.
संघ वालों, अब तो तिरंगे को अपना लो #MyTirangaMyPride https://t.co/mYQPiuAB58 pic.twitter.com/TMVcpfu3eA
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) August 3, 2022
Also Read: Viral: ఏడాదికి రూ.61 లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగం, అయిదేళ్ల వయసు దాటిన ఎవరైనా అప్లయ్ చేయచ్చు
Also Read: Virus Outbreak in Kerala: వైరస్లకు కేరళ ఎందుకు హాట్స్పాట్గా మారుతోంది? ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారు?
Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన
Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?