By: Ram Manohar | Updated at : 09 Mar 2023 12:22 PM (IST)
ఎయిర్ ఇండియా ఉద్యోగి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు. (Image Credits: ANI)
Gold Smuggling Air India:
కొచ్చిలో అరెస్ట్..
గోల్డ్ స్మగ్లింగ్ ఓ ఇంటర్నేషనల్ బిజినెస్. ఎక్కడెక్కడో బంగారం కొని గుట్టు చప్పుడు కాకుండా ఇండియాకు తీసుకొచ్చేస్తుంటారు. ఈ ప్రాసెస్లో ఎయిర్పోర్ట్లలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడతారు నేరస్థులు. నిత్యం తనిఖీలు చేస్తూ పెద్ద ఎత్తున గోల్డ్ను రికవరీ చేస్తున్నారు అధికారులు. క్రిమినల్స్ ఈ పని చేశారంటే అనుకోవచ్చు. కానీ ఎయిర్ లైన్స్ సిబ్బందే ఇలా స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే..? కొచ్చిలో ఇదే జరిగింది. Air India క్యాబిన్ క్రూ మెంబర్ ఇలా గోల్డ్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. రెండు చేతులకు రేపర్లు చుట్టుకుని గోల్డ్ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. బహ్రెయిన్ నుంచి కొచ్చికి వచ్చే ఫ్లైట్లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు. క్యాబిన్ క్రూలోని షఫీ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది. 1,487 గ్రాముల బంగారాన్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ ఛానల్ నుంచి నేరుగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఆ వ్యక్తి అధికారులు చెప్పాడు. షర్ట్ స్లీవ్స్తో కవర్ చేసి స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేసినట్టు వివరించాడు. ఈ మధ్య కాలంలో ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయి. తరచూ ఏదో ఓ ఎయిర్పోర్ట్లో నేరస్థులను పట్టుకుంటోంది కస్టమ్స్ విభాగం. ఇటీవలే సింగపూర్ నుంచి ఇద్దరు క్రిమినల్స్ 6.8 కిలోల గోల్డ్ను అక్రమంగా తరలిస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో అధికారులు అరెస్ట్ చేశారు.
Kochi | Air India cabin crew Shafi, a native of Wayanad, was arrested at Kochi Airport for smuggling 1,487 gms of gold. The cabin crew was of Bahrain-Kozhikode-Kochi service. Further interrogation underway: Customs Preventive Commissionerate pic.twitter.com/1nxVzF2fA7
— ANI (@ANI) March 8, 2023
ఇటీవలే...
విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి బయటికి వచ్చిన స్మగ్లర్... సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలో పట్టుబడ్డాడు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బేరింగ్ రూపంలో బంగారం అమర్చుకొని స్మగ్లింగ్ చేస్తుండగా సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారాన్ని పట్టుకున్న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, నిందితుడ్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
కస్టమ్స్ కళ్లు గప్పి బయటకు
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. 600 గ్రాముల బంగారాన్ని సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారంతో బయటకు వచ్చిన స్మగ్లర్స్... బంగారాన్ని రిసీవర్స్ ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవల భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బూట్లు, లగేజీ, బట్టల మధ్యలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. సూడాన్ దేశం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొన్న 23 మంది మహిళ ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల గోల్డ్ ను గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.7 కోట్ల 89 లక్షలు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: భారత్ చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం తప్పదు - యూఎస్ ఇంటిలిజెన్స్
చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్ హాట్ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్ నెటిజన్స్ ?
Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ స్టాక్స్తో జాగ్రత్త
Weather Latest Update: ఇక తెలుగు రాష్ట్రాల్లో పేట్రేగిపోనున్న ఎండలు! అంతటా పొడిగానే వాతావరణం
ABP Desam Top 10, 29 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!