అన్వేషించండి

GatiShakti Launch: రూ.100 లక్షల కోట్లతో 'పీఎం గతి శక్తి'కి మోదీ శ్రీకారం.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు

పీఎం గతి శక్తి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.100 లక్షల కోట్లతో రూపొందించిన పీఎం గతిశక్తి  ద్వారా 21వ శతాబ్దంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మోదీ అన్నారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతిశక్తితో పాటు భారత వర్తక ప్రోత్సాహక సంస్థ కోసం నిర్మించిన నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్​లను సైతం మోదీ ప్రారంభించారు. దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. రూ.100 లక్షల కోట్లతో రూపొందించిన పీఎం గతిశక్తి  ద్వారా 21వ శతాబ్దంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్ సహా పలువురు పాల్గొన్నారు.

" గతంలో ఎక్కడ చూసినా 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' బోర్డులు కనిపించేవి. అవి చూసిన ప్రజలు.. ఈ పనులు ఎప్పటికీ కావు అనుకునేవారు. ఎంతో నిరాశ చెందేవారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. అభివృద్ది ప్రాజెక్టులకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. పనులు పూర్తి చేస్తున్నాం. దేశానికి రాబోయే 25 ఏళ్ల కోసం గతి శక్తితో పునాది వేశాం. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూపొందించిన నేషనల్ మాస్టర్ ప్లాన్.. 21వ శతాబ్దంలో దేశ అభివృద్ధి ప్రణాళికలకు 'గతి శక్తి'గా మారుతుంది.                                                       "
-ప్రధాని నరేంద్ర మోదీ

ప్రతిపక్షాలపై విమర్శలు.. 

అభివృద్ధి ప్రాజెక్టులు చేస్తుంటే ప్రతిపక్షాలు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు. 

" మన దేశంలో చాలా రాజకీయ పార్టీలకు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి అనేది అంత ప్రాధాన్యం కాదు. కనీసం వారి మేనిఫెస్టోలో కూడా ఇది కనపించదు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే.. దేశానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన చేస్తుంటే కూడా రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.                                                     "
-ప్రధాని నరేంద్ర మోదీ

జీ-20 ఇక్కడే..

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పీఎం గతిశక్తి ద్వారా ఎన్నో అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడులకు జోష్ వచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2023 జీ-20 సదస్సు ఇదే ప్రగతి మైదాన్‌లో జరగనుందని తెలిపారు.

ఏంటీ ప్రాజెక్ట్?

మౌలిక రంగాన్ని సమూలంగా మార్పు చేసి, శాఖల మధ్య సమన్వయం తీసుకొచ్చేలా గతి శక్తి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ గతి శక్తి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ తొలిసారి ప్రస్తావించారు. గతిశక్తి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనులను 2024-25 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Mahesh Babu: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరుKKR vs GT Match Highlights IPL 2025 | కోల్ కతా నైట్ రైడర్స్ పై 39 పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్ | ABP DesamPM Modi receives US Vice President JD Vance Family | అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 Reason Why | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Mahesh Babu: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Wine Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
Sivalenka Krishna Prasad: నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! 
నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! : నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇంటర్వ్యూ
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
Group 1 Exams Schedule: అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
Embed widget