అన్వేషించండి

G20 Summit: దేశాధినేతల భాగస్వాములను ఆకట్టుకున్న మిల్లెట్‌ రంగోలి

G20 Summit: కొర్రలు, సామలు, ఊదలు, రాగులు, మినుములు, సజ్జలు, జొన్నలు ఇలా ఎన్నో రకాల చిరుధాన్యాల గురించి, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కలిగేలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

దేశ రాజధాని దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి దేశాధినేతలు భారత్‌కు విచ్చేసి సదస్సులో పాల్గొంటున్నారు. దాదాపు 19 దేశాల నుంచి ప్రపంచ నేతలు ఇక్కడికి విచ్చేశారు. చాలా వరకు వారితో వారి జీవిత భాగస్వాములు కూడా భారత పర్యటనకు వచ్చారు. అధినేతలంతా బిజీ బిజీగా సమావేశాల్లో పాల్గొంటుంటే మరి వారి భార్యలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా. వారికి ఎంతో చక్కగా మిల్లెట్స్‌ గురించి అవగాహన కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కొర్రలు, సామలు, ఊదలు, రాగులు, మినుములు, సజ్జలు, జొన్నలు ఇలా ఎన్నో రకాల చిరుధాన్యాల గురించి, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కలిగేలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

భారత పర్యటనకు దేశాధినేతలతో వచ్చిన దాదాపు 15 మంది సతీమణులు, ఇతర అధికారులు ఈరోజు దిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ)ని సందర్శించారు. భారతీయ వ్యవసాయం గురించి, అందులో పురోగతి గురించి, మిల్లెట్స్‌ గురించి ఎన్నో విషయాలు వారు తెలుసుకున్నారు. యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ సతీమణి, భారత్‌కు చెందిన అక్షతా మూర్తి కూడా ఐఏఆర్‌ఐకి వచ్చిన వారిలో ఉన్నారు. ఇంకా జపాన్‌ ప్రధాని భార్య యోకో కిషిడా, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా సతీమణి రీతు బంగా, ఇతర దేశాధినేతల భాగస్వాములు అక్కడికి వెళ్లారు. భారతదేశ హరితవిప్లవానికి కేంద్రంగా ఉన్న 1200 ఎకరాల ఐఏఆర్‌ఐ క్యాంపస్‌ను సందర్శించారు. 

ఐఏఆర్‌ఐకు వెళ్లిన అతిథులకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ సతీమణి క్యోకో జయశంకర్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. అలాగే క్యాంపస్‌లో తీర్చిదిద్దిన మిల్లెట్‌ రంగోలి అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్స్‌, 18 దేశాల నుంచి తెప్పించిన వివిధ రకాల మిల్లెట్స్‌తో ఈ రంగోలిని తీర్చిదిద్దారు. ఈ రంగోలితో అతిథులకు స్వాగతం పలికారు. అలాగే ఎగ్జిబిషన్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అగ్రి స్టార్టప్స్‌ వ్యవసాయంలో కింది స్థాయి సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న సాంకేతికతో వచ్చిన మార్గాలను వారికి తెలియజేశాయి. అలాగే దేశవ్యాప్తంగా విక్రయించే తినుబండారాలను ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ ప్రదర్శించాయి. సామూహిక వ్యవసాయం ద్వారా గ్రామీణ శ్రేయస్సును సాధికారం చేయడం అనే థీమ్‌తో వ్యవసాయ శాఖ మంత్రి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో దీనిని పోస్ట్‌ చేశారు.

దాదాపు గంట పాటు ప్రతినిధులు ఐఏఆర్ఐ క్యాంపస్‌లో గడిపారు. అక్కడ లైవ్‌ కుకింగ్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. మిల్లెట్స్‌ చేసే పలు రకాల వంటల గురించి తెలుసుకున్నారు. అక్కడ ప్రముఖ చెఫ్‌ కునాల్‌ కపూర్‌ అద్భుతమైన వంటకాలను వారికి అందించారు. 2023ని మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించాలని భారత్‌ కృషి చేస్తోంది. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీలో ఇప్పటికే 72 దేశాలు ఇందుకు మద్దతు తెలిపాయి. 

వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌లో భారతీయ రైతులు, వ్యవసాయ సాంకేతికత, హైడ్రోఫోనిక్‌ వ్యవసాయం, ఇతర పద్ధతుల గురించి అతిథులు తెలుసుకున్నారు. అలాగే మారుమూల గ్రామాల్లో మిల్లెట్స్‌ పండిస్తున్న సుమారు ఇరవై మంది మహిళా రైతులతో వారు మాట్లాడారు. అందులో మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన గిరిజన రైతు లహరీ బాయి కూడా ఉన్నారు. ఆమె మినుముల పంట గురించి గణనీయమైన కృషి చేశారు. మిగతా వారు కూడా తమ తమ ప్రాంతాల్లో మిల్లెట్స్‌ సాగు గురించి వారు వివరించారు. మధ్యప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఒడిశా రాష్ట్రాలలోని మారుమూల గ్రామాల నుంచి మహిళా రైతులు వచ్చారు. పోషకాహారంపై పరిశోధనల ద్వారా వ్యవసాయంపై సాధించిన పురోగతి గురించి వివరిస్తూ అక్కడ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మినుములతో పాటు డెయిరీ, ఫిషరీ, ఫ్లోరికల్చర్‌లో సాధించిన పురోగతిని ప్రదర్శనలో ప్రదర్శించారు. భారతీయ వ్యవసాయం గురించి తెలుసుకోవడానిక అతిథులు ఎంతో ఆసక్తి చూపించారని ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌ ఏకే సింగ్‌ తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్
విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
Embed widget