అన్వేషించండి

పోలీసుల డ్రోన్‌లను అడ్డుకునేందుకు పతంగులు ఎగరేసిన రైతులు - వీడియో వైరల్

Farmers March: టియర్ గ్యాస్ ప్రయోగించే డ్రోన్స్‌ని అడ్డుకునేందుకు రైతులు పతంగులు ఎగరేశారు.

Farmers Protest: రైతుల ఆందోళనలతో హరియాణా, ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఛలో ఢిల్లీ మార్చ్ రెండో రోజుకి చేరుకుంది. దేశ రాజధానిలో రైతులు అడుగు పెట్టకుండా పోలీసులు ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. వేలాది మంది రైతులు వస్తుండడం వల్ల డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్లను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే...రైతులు ఈ డ్రోన్‌లను అడ్డుకునేందుకు పతంగులు ఎగరేశారు. ఈ పతంగులతో డ్రోన్స్‌ని కట్టడి చేశారు. శంభు సరిహద్దు ప్రాంతం వద్ద రైతులు ఇలా పతంగులు ఎగరేస్తూ కనిపించారు. పంజాబ్‌ నుంచే భారీ మొత్తంలో రైతులు ఈ మార్చ్‌లో పాల్గొంటున్నారు. తమ పంటలకు కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేయడంతో పాటు మరి కొన్ని సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తున్నారు. అంబాలాకి సమీపంలోని శంభు సరిహద్దు వద్ద రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాళ్లను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి అర్జున్ ముండా రైతులు ఆందోళనలు విరమించారని సూచించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఇలా నిరసనల్లో పాల్గొనద్దని విజ్ఞప్తి చేశారు. అటు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్‌లను రైతులు ధ్వంసం చేశారు. వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. కానీ..అప్పటికే రైతులు టియర్ గ్యాస్ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు వాటర్ బాటిల్స్ సిద్ధం చేసుకున్నారు. తడిబట్టలతోనే రోడ్లపైకి వచ్చారు. కళ్లకు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం తీరుపై రైతు సంఘాల నాయకులు మండి పడుతున్నారు. సానుకూల వాతావరణంలో సమస్యలు పరిష్కరించాలని, చర్చలకు ఎప్పటికైనా తాము సిద్ధమే అని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని అడిగారు. ఆ సమయంలో రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు కనీసం 6 నెలల పాటు ఆందోళనలు చేయాలన్న ప్లాన్‌తో వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆరు నెలలకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకున్నారు. ట్రాక్టర్‌లకు అవసరమైన డీజిల్ కూడా తెచ్చుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సింగూ సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ప్రభుత్వం అన్ని ఆసుపత్రులనూ అప్రమత్తం చేసింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
Embed widget