అన్వేషించండి

పోలీసుల డ్రోన్‌లను అడ్డుకునేందుకు పతంగులు ఎగరేసిన రైతులు - వీడియో వైరల్

Farmers March: టియర్ గ్యాస్ ప్రయోగించే డ్రోన్స్‌ని అడ్డుకునేందుకు రైతులు పతంగులు ఎగరేశారు.

Farmers Protest: రైతుల ఆందోళనలతో హరియాణా, ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఛలో ఢిల్లీ మార్చ్ రెండో రోజుకి చేరుకుంది. దేశ రాజధానిలో రైతులు అడుగు పెట్టకుండా పోలీసులు ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. వేలాది మంది రైతులు వస్తుండడం వల్ల డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్లను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే...రైతులు ఈ డ్రోన్‌లను అడ్డుకునేందుకు పతంగులు ఎగరేశారు. ఈ పతంగులతో డ్రోన్స్‌ని కట్టడి చేశారు. శంభు సరిహద్దు ప్రాంతం వద్ద రైతులు ఇలా పతంగులు ఎగరేస్తూ కనిపించారు. పంజాబ్‌ నుంచే భారీ మొత్తంలో రైతులు ఈ మార్చ్‌లో పాల్గొంటున్నారు. తమ పంటలకు కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేయడంతో పాటు మరి కొన్ని సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తున్నారు. అంబాలాకి సమీపంలోని శంభు సరిహద్దు వద్ద రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాళ్లను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి అర్జున్ ముండా రైతులు ఆందోళనలు విరమించారని సూచించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఇలా నిరసనల్లో పాల్గొనద్దని విజ్ఞప్తి చేశారు. అటు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్‌లను రైతులు ధ్వంసం చేశారు. వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. కానీ..అప్పటికే రైతులు టియర్ గ్యాస్ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు వాటర్ బాటిల్స్ సిద్ధం చేసుకున్నారు. తడిబట్టలతోనే రోడ్లపైకి వచ్చారు. కళ్లకు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం తీరుపై రైతు సంఘాల నాయకులు మండి పడుతున్నారు. సానుకూల వాతావరణంలో సమస్యలు పరిష్కరించాలని, చర్చలకు ఎప్పటికైనా తాము సిద్ధమే అని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని అడిగారు. ఆ సమయంలో రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు కనీసం 6 నెలల పాటు ఆందోళనలు చేయాలన్న ప్లాన్‌తో వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆరు నెలలకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకున్నారు. ట్రాక్టర్‌లకు అవసరమైన డీజిల్ కూడా తెచ్చుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సింగూ సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ప్రభుత్వం అన్ని ఆసుపత్రులనూ అప్రమత్తం చేసింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ABP Desam Top 10, 28 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 28 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget