Twitter Subscription Launch: బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ మళ్లీ షురూ, ప్రకటించిన ఎలన్ మస్క్
Twitter Subscription Launch: ట్విటర్ బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ను మళ్లీ స్టార్ట్ చేస్తున్నట్టు మస్క్ ప్రకటించారు.

Twitter Subscription Launch:
నవంబర్ 29న రీస్టార్ట్..
ట్విటర్ బ్లూ టిక్పై సోషల్ మీడియాలో ఏ రేంజ్లో చర్చ జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. బ్లూటిక్ మెయింటేన్ చేయాలంటే తప్పనిసరిగా నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని కండీషన్ పెట్టాడు ఎలన్ మస్క్. అయితే...కొందరు హ్యాకర్లు ఫేక్ అకౌంట్లు సృష్టించి ట్విటర్కు తలనొప్పి తెచ్చి పెట్టారు. పైగా వాటికి బ్లూటిక్ కూడా ఉన్నట్టు క్రియేట్ చేశారు. అమెరికాలో అయితే...ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వాళ్లు కూడా బ్లూ టిక్ కోసం 8 డాలర్లు చెల్లించారు. ఆ తరవాత కానీ..అవి నకిలీ అని తేలలేదు. మొత్తానికి ఇది మస్క్ను ఇరకాటంలో పడేసింది.
ఈ పెయిడ్ ఫీచర్ ఉంచుదామా తీసేద్దామా అనే ఆలోచనలో పడి..చివరకు కొద్ది రోజుల పాటు ఈ సర్వీస్ను నిలిపివేశారు. ఫేక్ అకౌంట్ల లెక్క తేల్చిన మస్క్ మామ...ఆ పని పూర్తి చేసిన వెంటనే ఓ ప్రకటన చేశాడు. ట్విటర్ బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ను రీస్టార్ట్ చేస్తున్నట్టు వెల్లడించాడు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సర్వీస్ను మళ్లీ ప్రారంభిస్తామని చెప్పాడు. ట్విటర్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఈ పెయిడ్ ఫీచర్పై హింట్ ఇస్తూనే వచ్చారు ఎలన్ మస్క్. కానీ...మధ్యలో ఈ అవాంతరాల వల్ల ఆపేయాల్సి వచ్చింది. నిజానికి..గత వారమే మస్క్...దీనిపై క్లారిటీ ఇచ్చారు. "బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ మళ్లీ ఎప్పుడు మొదలు పెడతారు" అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు "వచ్చే వారంలోగా" అని సమాధానమిచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రకటన చేశారు.
Punting relaunch of Blue Verified to November 29th to make sure that it is rock solid
— Elon Musk (@elonmusk) November 15, 2022
లేఆఫ్లు..
ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఎలాన్ మస్క్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చి రాగానే చాలా మంది ఉద్యోగులను తీసేసిన మస్క్.. లేఆఫ్ను ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా ఔట్సోర్సింగ్ విభాగంలోనూ మస్క్ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 4400 నుంచి 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ట్విట్టర్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అమెరికా సహా ఇతర దేశాల్లోని ట్విట్టర్ ఆఫీసుల్లో ఈ లేఆఫ్లు కొనసాగినట్లు సమాచారం. ట్విట్టర్కు చెందిన కంటెంట్ మోడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తీసేశారు. అయితే వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేశారట. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్లకు గురైనట్లు వారికి తెలిసిందట. వీరిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఈ-మెయిల్ ద్వారా సమాచారమిచ్చారట. అయితే తాజా కోతలపై ట్విట్టర్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ట్విట్టర్ను టేకోవర్ చేసిన తర్వాత మస్క్.. లేఆఫ్ల నిర్ణయం తీసుకున్నారు. చాలా మందిని తొలగించారు. ఇప్పుడు ఉద్యోగులకు మరో ఝలక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈవో స్థాయిలో తొలిసారి ఉద్యోగులకు మెయిల్ పంపారు. "కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి" అని మెయిల్ చేశారు మస్క్.
Before You Go
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















