News
News
X

PM Modi: ఇజ్రాయేల్ సంస్థలతో ప్రధాని చేతులు కలిపారు, ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు - కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

Congress Slams PM Modi: ప్రధానిమోదీపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది.

FOLLOW US: 
Share:

Congress Slams PM Modi:

ఏజెన్సీలతో కుమ్మక్కయ్యారు: కాంగ్రెస్ 

కాంగ్రెస్ ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేసింది. 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయన ఇజ్రాయేల్‌ సంస్థలతో కుమ్మక్కయ్యారని విమర్శించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించగా...సుప్రియ శ్రీనతే, పవన్ ఖేడా ఈ ఈ ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంతో ప్రధాని మోదీ ఆటలాడుతున్నారంటూ మండి పడ్డారు. ఇజ్రాయేల్ ఏజెన్సీలతో కుమ్మక్కై భారత్‌లోని ఎన్నికను ప్రభావితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారు. విదేశాలతో చేతులు కలిపి ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు" 

-పవన్ ఖేడా,కాంగ్రెస్ ప్రతినిధి 

పవన్ ఖేడాతో పాటు సుప్రియ శ్రీనతే కూడా ప్రధానిపై సంచలన ఆరోపణలు చేశారు. 

"ప్రపంచంలోని మూడు దేశాల ఎన్నికలను ఇజ్రాయేల్ కాంట్రాక్టర్లు ప్రభావితం చేశారని కొన్ని అంతర్జాతీయ సంస్థలతో పాటు జర్నలిస్ట్‌ గ్రూప్‌లు వెల్లడించాయి. అబద్ధాలను ప్రచారం చేయడనే ఆ కాంట్రాక్టర్ల పని. ఇలాంటి ఏజెన్సీలు  భారత్‌లోనూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా అలాంటి సంస్థలు ఇండియాలో ఉండనే ఉండవు. బీజేపీ ఐటీ సెల్‌తో పాటు ఆ ఏజెన్సీలు కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి" 

-సుప్రియా శ్రీనతే, కాంగ్రెస్ ప్రతినిధి 

రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన భారత్ జోడో యాత్రపైనా బీజేపీ విషం చిమ్మిందని మండి పడింది కాంగ్రెస్. పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన ఓ బాలిక రాహుల్‌ని కలిసిందంటూ కొన్ని ఫేక్ వీడియోలతో ప్రచారం చేశారంటూ విమర్శించారు సుప్రియ శ్రీనతే. రాహుల్ గాంధీపైనా వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో 113 సార్లు భద్రతా నిబంధలను ఉల్లంఘించారంటూ సీఆర్‌పీఎఫ్ అప్పట్లో ఓ ప్రకటన చేసింది. దీనిపైనా బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. 

 

Published at : 16 Feb 2023 03:31 PM (IST) Tags: PM Modi Modi Israel india elections ELections Israel Agencies

సంబంధిత కథనాలు

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్