అన్వేషించండి

Andhra News: 'మార్పు తెచ్చాం, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాం' - కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan: నాలుగున్నరేళ్లలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ తెలిపారు. గురువారం కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పెన్షన్లు, చేయూత, ఆసర కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.

CM Jagan Key Comments on Collectors Review Meeting: నాలుగున్నరేళ్ల పాలనా కాలంలో ప్రతి పేదవాడి ఇంటికే సంక్షేమం అందేలా మార్పులు తెచ్చామని, వైసీపీ ప్రభుత్వం అంటే విశ్వసనీయతకు మారుపేరని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. తాడేపల్లిలోని (Tadepally) తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో (Collectors Review meeting) ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్షించారు. అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. కొత్త ఏడాదిలో 4 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని, జనవరి 3, ఫిబ్రవరిలో 1 ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూడాలని  కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యకమాలుంటాయని, అవి సక్రమంగా నడిచేలా షెడ్యూల్ చేసుకోవాలన్నారు. 

జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్

జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని చెప్పారు. 'గతంలో ఎన్నికలకు ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.2,250 చేశాం. దశలవారీగా రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. పెన్షన్ల కోసం నెలకు రూ.1,950  కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో 39 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్య ఇప్పుడు 66 లక్షలకు చేరింది. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చాం. ఆదివారమైనా, పండుగైనా ఒకటో తేదీనే ఇంటి వద్దే పింఛన్ అందించేలా మార్పు తీసుకొచ్చాం. ఈ మార్పును ఎలా తెచ్చామో ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది.' అంటూ జగన్ పేర్కొన్నారు.

'విశ్వసనీయతకు మారుపేరు'

ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని, ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా తాను జనవరి 3న కాకినాడలో పాల్గొంటున్నానని, అయితే అవ్వాతాతలు ఎదురు చూసే పరిస్థితే రాకుండా, జనవరి 1నే కార్యక్రమం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులంతా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కార్యక్రమం నిర్వహించాలన్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ చేసుకోవాలని, 8 రోజులు పెన్షన్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెన్షన్ తో పాటు తన తరఫున లేఖ, తాను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలని వెల్లడించారు. 

జనవరి 19న అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జనవరి 23 నుంచి 31 వరకూ ఆసరా కార్యక్రమంలో జరుగుతుందని, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ 'వైఎస్సార్ చేయూత' కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అర్హత ఉండీ ఎవరైనా మిగిలిపోయిన సందర్భాల్లో అలాంటి వారికి పథకాలు వర్తింప చేసే బైయాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందని వివరించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 

Also Read: Andhra News: కుప్పం నుంచి పోటీలో మరో వైసీపీ రెబల్ అభ్యర్థి - ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget