అన్వేషించండి

Andhra News: 'మార్పు తెచ్చాం, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాం' - కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan: నాలుగున్నరేళ్లలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ తెలిపారు. గురువారం కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పెన్షన్లు, చేయూత, ఆసర కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.

CM Jagan Key Comments on Collectors Review Meeting: నాలుగున్నరేళ్ల పాలనా కాలంలో ప్రతి పేదవాడి ఇంటికే సంక్షేమం అందేలా మార్పులు తెచ్చామని, వైసీపీ ప్రభుత్వం అంటే విశ్వసనీయతకు మారుపేరని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. తాడేపల్లిలోని (Tadepally) తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో (Collectors Review meeting) ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్షించారు. అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. కొత్త ఏడాదిలో 4 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని, జనవరి 3, ఫిబ్రవరిలో 1 ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూడాలని  కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యకమాలుంటాయని, అవి సక్రమంగా నడిచేలా షెడ్యూల్ చేసుకోవాలన్నారు. 

జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్

జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని చెప్పారు. 'గతంలో ఎన్నికలకు ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.2,250 చేశాం. దశలవారీగా రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. పెన్షన్ల కోసం నెలకు రూ.1,950  కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో 39 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్య ఇప్పుడు 66 లక్షలకు చేరింది. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చాం. ఆదివారమైనా, పండుగైనా ఒకటో తేదీనే ఇంటి వద్దే పింఛన్ అందించేలా మార్పు తీసుకొచ్చాం. ఈ మార్పును ఎలా తెచ్చామో ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది.' అంటూ జగన్ పేర్కొన్నారు.

'విశ్వసనీయతకు మారుపేరు'

ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని, ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా తాను జనవరి 3న కాకినాడలో పాల్గొంటున్నానని, అయితే అవ్వాతాతలు ఎదురు చూసే పరిస్థితే రాకుండా, జనవరి 1నే కార్యక్రమం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులంతా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కార్యక్రమం నిర్వహించాలన్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ చేసుకోవాలని, 8 రోజులు పెన్షన్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెన్షన్ తో పాటు తన తరఫున లేఖ, తాను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలని వెల్లడించారు. 

జనవరి 19న అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జనవరి 23 నుంచి 31 వరకూ ఆసరా కార్యక్రమంలో జరుగుతుందని, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ 'వైఎస్సార్ చేయూత' కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అర్హత ఉండీ ఎవరైనా మిగిలిపోయిన సందర్భాల్లో అలాంటి వారికి పథకాలు వర్తింప చేసే బైయాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందని వివరించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 

Also Read: Andhra News: కుప్పం నుంచి పోటీలో మరో వైసీపీ రెబల్ అభ్యర్థి - ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Israel Strike On Iran: ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget