అన్వేషించండి

Andhra News: 'మార్పు తెచ్చాం, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాం' - కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan: నాలుగున్నరేళ్లలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ తెలిపారు. గురువారం కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పెన్షన్లు, చేయూత, ఆసర కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.

CM Jagan Key Comments on Collectors Review Meeting: నాలుగున్నరేళ్ల పాలనా కాలంలో ప్రతి పేదవాడి ఇంటికే సంక్షేమం అందేలా మార్పులు తెచ్చామని, వైసీపీ ప్రభుత్వం అంటే విశ్వసనీయతకు మారుపేరని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. తాడేపల్లిలోని (Tadepally) తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో (Collectors Review meeting) ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్షించారు. అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. కొత్త ఏడాదిలో 4 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని, జనవరి 3, ఫిబ్రవరిలో 1 ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూడాలని  కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యకమాలుంటాయని, అవి సక్రమంగా నడిచేలా షెడ్యూల్ చేసుకోవాలన్నారు. 

జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్

జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని చెప్పారు. 'గతంలో ఎన్నికలకు ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.2,250 చేశాం. దశలవారీగా రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. పెన్షన్ల కోసం నెలకు రూ.1,950  కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో 39 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్య ఇప్పుడు 66 లక్షలకు చేరింది. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చాం. ఆదివారమైనా, పండుగైనా ఒకటో తేదీనే ఇంటి వద్దే పింఛన్ అందించేలా మార్పు తీసుకొచ్చాం. ఈ మార్పును ఎలా తెచ్చామో ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది.' అంటూ జగన్ పేర్కొన్నారు.

'విశ్వసనీయతకు మారుపేరు'

ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని, ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా తాను జనవరి 3న కాకినాడలో పాల్గొంటున్నానని, అయితే అవ్వాతాతలు ఎదురు చూసే పరిస్థితే రాకుండా, జనవరి 1నే కార్యక్రమం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులంతా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కార్యక్రమం నిర్వహించాలన్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ చేసుకోవాలని, 8 రోజులు పెన్షన్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెన్షన్ తో పాటు తన తరఫున లేఖ, తాను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలని వెల్లడించారు. 

జనవరి 19న అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జనవరి 23 నుంచి 31 వరకూ ఆసరా కార్యక్రమంలో జరుగుతుందని, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ 'వైఎస్సార్ చేయూత' కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అర్హత ఉండీ ఎవరైనా మిగిలిపోయిన సందర్భాల్లో అలాంటి వారికి పథకాలు వర్తింప చేసే బైయాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందని వివరించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 

Also Read: Andhra News: కుప్పం నుంచి పోటీలో మరో వైసీపీ రెబల్ అభ్యర్థి - ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget