అన్వేషించండి

Citizenship Amendment Act: పాక్ నుంచి వచ్చిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

Citizenship Amendment Act: అహ్మదాబాద్‌లోని 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించారు.

CAA Implementation: దేశవ్యాప్తంగా ఇటీవలే పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని వెనక్కితీసుకునే ప్రసక్తే లేదని మోదీ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియ మొదలైంది. పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకి గుజరాత్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. అహ్మదాబాద్‌లో ఉంటున్న 18 మంది హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పించినట్టు గుజరాత్ హోంశాఖ వెల్లడించింది. హోం మంత్రి హర్ష్ సంఘ్వీ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ క్యాంప్ నిర్వహించారు. అక్కడే వాళ్లకి సిటిజన్‌షిప్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లోనే ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. 18 మందికి పౌరసత్వం కల్పించిన తరవాత హర్ష్ సంఘ్వీ వాళ్లతో మాట్లాడారు. దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. కొత్తగా భారత పౌరసత్వం లభించిన వాళ్లందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తుందని, వాళ్లకీ అన్ని విధాలుగా సంక్షేమ ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌లకు అధికారాలిచ్చారు. 2016,2018 గెజిట్ నోటిఫికేషన్‌ల ఆధారంగా ఈ అధికారాలు కల్పించారు. అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్‌ జిల్లా కలెక్టర్‌లు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకూ పాకిస్థాన్‌ నుంచి అహ్మదాబాద్‌లో ఉంటున్న హిందువుల్లో దాదాపు 1,167 మందికి భారత పౌరసత్వం లభించింది. 

"ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మైనార్టీల హక్కులపై ప్రత్యేక దృష్టి సారించారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురై భారత్‌కి వలస వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించనున్నారు. ఈ ప్రక్రియ చాలా సులువుగా జరిగేలా చొరవ చూపించారు"

- హర్ష్ సంఘ్వీ, గుజరాత్ హోం మంత్రి

మార్చి 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం CAAని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ చట్టం ద్వారా ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని వెల్లడించింది. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించనున్నట్టు తెలిపింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Oscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP DeshamRaksha Khadse Daughter | తన కుమార్తెను వేధించిన పోకిరీలపై కేంద్రమంత్రి పోలీస్ కంప్లైంట్ | ABP DesamSpeaker suggests massage chairs for MLAs in Assembly | MLAలకు సభ తర్వాత విశ్రాంతి కావాలి | ABP DeshamPM Modi Lion Safari | గిర్ అభయారణ్యంలో సఫారీ కి వెళ్లిన ప్రధాని మోదీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Uttarandhra Teachers Mlc: కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
SLBC టన్నెల్ పై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Viral News: ముద్దులు కలిపి ఉంచలేవు - లిప్ కిస్సులో ప్రపంచరికార్డు సృష్టించారు కానీ విడాకులు తీసుకుంటున్నారు !
ముద్దులు కలిపి ఉంచలేవు - లిప్ కిస్సులో ప్రపంచరికార్డు సృష్టించారు కానీ విడాకులు తీసుకుంటున్నారు !
Embed widget