అన్వేషించండి

China : లక్షా 20వేల కోట్లతో అతి పెద్ద బాంబు - భారత సరిహద్దులో నిర్మిస్తున్న చైనా - ఇలా కూడా కుట్రలు చేస్తారా?

Water bomb: భారత సరిహద్దులో టిబెట్ భూభాగంలో చైనా అతి పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇది అసలు ప్రాజెక్టు కన్నా వాటర్ బాంబుగానే అందరూ భావిస్తున్నారు.

China is building the biggest water bomb on the Indian border: రాబోయే రోజుల్లో యుద్దాలు మిస్సైళ్లు, బాంబులతో ఉండే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా సరిహద్దులు ఉన్న దేశాల మధ్య యుద్ధాలు వ్యూహాత్మకంగా జరగనున్నాయి. ఒక్కసారే ఇండియా, బంగ్లాదేశ్ ను ముంచేందుకు చైనా అత్యంత  భారీ ఆయుధాన్ని నిర్మిస్తోంది.ఆ ఆయుధం అతి పెద్ద డ్యాం. ఇందు కోసం 137 బిలియన్లు ఖర్చు పెట్టనున్నారు. అంటే మన కరెన్సీలో కనీసం లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు.  

డ్యాం నిర్మాణానికి లక్షా ఇరవై వేల కోట్లు కేటాయించిన చైనా  

టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో వుంది.   బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లంగ్‌ జంగ్బోగా పిలుస్తారు. ప్రస్తుతం టిబెట్‌పై పూర్తి ఆధిపత్యం చైనా ప్రదర్శిస్తోంది.  నదీ దిగువ ప్రాంతంలో పెద్ద జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్‌గా భావించే త్రీ గోర్జెస్‌ డ్యామ్‌కు ఇది దాదాపు మూడు రెట్లు పెద్దదిగా వుంటుంది. ఏడాదికి 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని చైనా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఈ ప్రాజెక్టుతో టిబెట్‌కు ఏటా 20 బిలియన్ల యువాన్ల ఆదాయం లభిస్తుందని చైనా చెబుతోంది. 

భారత్, బంగ్లాదేశ్‌లపై వాటర్ బాంబు ఆ ప్రాజెక్టు 

ఈ ప్రాజెక్టు ఉపయోగాల గురించి చైనా ఎన్ని చెప్పినా బంగ్లాదేశ్, ఇండియాలపై వాటర్ బాంబులా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని ఎక్కువ మంది నమ్ముతుననారు. హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పెద్ద యూ టర్న్‌ తీసుకొని అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ఈ యూ టర్న్‌ తీసుకునే ప్రాంతంలోని భారీ లోయ వద్ద డ్యామ్‌ను నిర్మించాలని చైనా నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించనున్నారు.  బ్రహ్మపుత్ర నది భారత్‌ గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తోంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఇది ప్రధాన నీటి వనరు. ఈ జాలల విషయంలో భారత్‌-చైనా మధ్య ఒప్పందం ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు దిగువనున్న దేశాలకు చైనా తెలియజేయాలి. కానీ చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వడంలేదు.అందుకే పలుమార్లు ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగింది. 

భారత్ ఎలా కౌంటర్ ఇస్తుంది ? 

ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే.. దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్టు భారత్‌-చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకే సారి నీటిని విడుదల చేస్తే ఈశాన్య రాష్ట్రాలు తుడిచి పెట్టుకుపోతాయి. అందుకే దీన్ని  చైనా ‘వాటర్‌ బాంబ్‌’గా భావిస్తున్నారు.  నిదానిరి టిబెట్‌ ప్రాంతం భూకంప జోన్‌లో ఉంది, అక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. అలాంటి చోట ఈ డ్యాం కట్టడం సేఫ్ కాదు. కానీ అది చైనాకు కాదు.  డ్యాంకు ఏం జరిగినా నష్టపోయేది భారత్, బంగ్లాదేశ్‌లే. 

Also Read : Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ - Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fight Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
Kerala BJP: కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
Joginapally Santosh Kumar: మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ గ్రీన్‌ ఐకాన్‌ అవార్డు
మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ గ్రీన్‌ ఐకాన్‌ అవార్డు
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget