అన్వేషించండి

Delimitation bill: దేశంలో ఇక 850 లోక్ సభ సీట్లు - కేంద్రం తేబోతున్న డీలిమిటేషన్ బిల్లు పూర్తి వివరాలు ఇవిగో

Delimitation bill: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాల నుండి 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35 సీట్లు ఉండనున్నాయి

Centre proposes to increase Lok Sabha seats to 850:   లోక్‌సభ సీట్ల సంఖ్యను భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదిస్తూ కేంద్రం గురువారం నాడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా రాష్ట్రాల నుండి 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35 సీట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. గత రెండు వారాలుగా ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతుండగా, మంగళవారం నాడు ఎంపీలకు ఈ ముసాయిదా చట్టం ప్రతులను పంపిణీ చేయడంతో ఈ ప్రక్రియ అధికారికంగా ముందడుగు పడింది.               

రాజ్యాంగంలోని అధికరణ 82 ప్రకారం, ప్రతి జనాభా గణన తర్వాత రాష్ట్రాలకు కేటాయించే లోక్‌సభ సీట్లను జనాభా మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల విభజన 1971 జనాభా గణన ఆధారంగా జరిగింది. 2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన వరకు నియోజకవర్గాల సరిహద్దుల మార్పుపై నిషేధం ఉంది. అయితే, తాజా బిల్లులో ఈ నిబంధనను సవరించి, 2011 జనాభా గణన ఆధారంగానే ఈ పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.

మహిళా రిజర్వేషన్ల అమలుతో ఈ డిలిమిటేషన్ ప్రక్రియ ముడిపడి ఉండటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే ఇది జనాభా గణన మరియు డిలిమిటేషన్ తర్వాతే సాధ్యమని ప్రభుత్వం గతంలో పేర్కొంది. తాజా ప్రతిపాదనల ప్రకారం సీట్ల సంఖ్యను 850కి పెంచితే, అందులో సుమారు 270 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి.                            

లోక్‌సభ స్థానాలను దాదాపు 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఈ ప్రక్రియ కేవలం అంకగణితంలా కాకుండా రాజకీయంగా అందరికీ సమన్యాయం చేసేలా ఉండాలని కోరింది. ముఖ్యంగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు, కేవలం జనాభా తక్కువగా ఉందన్న కారణంతో పార్లమెంట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోకూడదని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నందున, సీట్ల పెంపు వల్ల వారికి అదనపు లబ్ధి చేకూరితే దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కినట్లు అవుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.                      

ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పొడిగించిన ప్రభుత్వం, ఈ మూడు రోజుల ప్రత్యేక వ్యవధిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి లాంటి నేతలు ప్రతిపాదిస్తున్న  హైబ్రీడ్ మోడల్,  రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా సీట్లు పెంచే వ్యూహాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా, దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే ఈ డిలిమిటేషన్ ప్రక్రియపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Gen Kia Sonet Spotted Testing: రోడ్డుపైకి వచ్చేసిన కొత్త కియా సోనెట్.. అదిరిపోయే డిజైన్ తో నెక్స్ట్ జనరేషన్ మోడల్! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
రోడ్డుపైకి వచ్చేసిన కొత్త కియా సోనెట్.. అదిరిపోయే డిజైన్ తో నెక్స్ట్ జనరేషన్ మోడల్! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ABP Desam Top 10, 12 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 12 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Mahindra Hybrid SUVs: హైబ్రిడ్ టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్న మహీంద్రా.. మైలేజీ కోసం Mahindra XUV 7XOతో ప్రయోగం
హైబ్రిడ్ టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్న మహీంద్రా.. మైలేజీ కోసం Mahindra XUV 7XOతో ప్రయోగం
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget