అన్వేషించండి

Union Ministers of Telugu States And Departments: తెలుగు కేంద్ర మంత్రులకు కీలక బాధ్యతలు - ఐదుగురికి కేటాయించిన శాఖలు ఇవే

Central Cabinet News : తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కీలకమైన శాఖలు లభించాయి. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానశాఖ కేటాయించారు.

Central Cabinet Telugu Ministers portfolios :  కేంద్ర మంత్రివర్గంలోని తెలుగు మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కేబినెట్ ర్యాంక్‌లో ఉన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖ కేటాయించారు. గతంలో ఎన్డీఏ 1 హయాంలో కూడా టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉంది.అప్పట్లో కూడా కేబినెట్ మంత్రిగా టీడీపీ తరపున అశోక్ గజపతిరాజు వ్యవహరించారు. ఇప్పుడు అదే శాఖను రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. 

తెలంగాణ నుంచి కేబినెట్ ర్యాంక్ దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డికి బోగ్గు, గనుల శాఖను కేటాయించారు. గతంలో కిషన్  రెడ్డి టూరిజం, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల వ్యవహారాల మంత్రిత్వ శాఖను చూశారు. గత ప్రభుత్వంలో బొగ్గు శాఖను చూసిన ప్రహ్లాద్ జోషి స్థానంలో ఈ సారి కిషన్ రెడ్డికి చోటు కల్పించారు. 

ఇక తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కు సహాయ మంత్రి లభించింది. ఆయనకు హోంశాఖకు సహాయ మంత్రిగా వ్యవహరిస్తారు. ఈ శాఖకు కేబినెట్ మంత్రిగా అమిత్ షా ఉన్నారు. కిషన్  రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ రాక ముందు.. సహాయ మంత్రిగా హోంశాఖకే పని చేశారు. 

ఏపీకి చెందిన గుంటూరు ఎంపీకి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు.  ఇక నర్సాపురం ఎంపీ, సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు కూడా కీలక శాఖలు లభించాయి. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలకు ఆయన సహాయ మంత్రిగా వ్యవహరిస్తారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం  పార్టీకి వచ్చిన హైప్‌ను బట్టి చూస్తే.. అనుకున్న విధంగా కీలక శాఖలు రాలేదని అనుకోవచ్చు. కింగ్ మేకర్ గా టీడీపీని జాతీయ రాజకీయ నేతల అభివర్ణించారు. అయితే కేబినెట్ లో ఆ స్థాయిలో ప్రాధాన్యం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పది కేంద్ర మంత్రి పదవులు, స్పీకర్ పోస్టును టీడీపీ అడిగిందని ప్రచారం జరిగింది. చివరికి ఒక్క కేబినెట్, ఒక్క సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు. వారి శాఖలు కూడా ఏపీకి అంతగా ఉపయోగపడేవి కావు. కనీసం రామ్ మోహన్ నాయుడికి పట్టణాభివృద్ధి శాఖను ఇచ్చినా ఏపీ కి రాజధాని నిర్మించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నారు. కానీ గతంలో అశోక్ గజపతిరాజుకు ఇచ్చిన పౌర విమానయానమే ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బోగాపురం ఎయిర్ పోర్టును వేగంగా పూర్తి చేసుకునే అవకాశం మాత్రం లభిస్తుంది.
 

అయితే కిషన్ రెడ్డికి మాత్రం బొగ్గు,  గనులు వంటి కీలకమైన శాఖను కేటాయించారు. తెలంగాణలో బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయి. సింగరేణి కూడా ఉంది. అందుకే కిషన్ రెడ్డికి మంచి ప్రాధాన్యం లభించిందని అంచనా వేస్తున్నారు. ఇక సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలు కీలకమైనవే కానీ... వారికి ఉండే అధికారాలు పరిమితమని భావిస్తున్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని మెడికల్ రంగంలో నిపుణుడు. ఆయనకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి కేటాయిస్తారేమో అనుకున్నారు. కానీ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖను కేటాయించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ICC Women's World Cup 2025: జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
Second Hand Car Buying Tips పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
No Nut November : నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Embed widget