అన్వేషించండి

కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా, లిక్కర్ స్కామ్‌ కేసుపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి (Arvind Kejriwal) ఈడీ ఏడోసారి సమన్లు పంపింది. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్. ఈ కేసులో ఆరు సార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. అయితే...ఈ సమన్లపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. పదేపదే ఇలా సమన్లు పంపడం కన్నా కోర్టు ఏదోటి తేల్చేయాలని అన్నారు. ఏడోసారి కూడా సమన్లను పట్టించుకోలేదు కేజ్రీవాల్. కేవలం కాంగ్రెస్‌తో తాము చేతులు కలుపుతున్నందుకే బీజేపీ కుట్ర పూరితంగా తమను టార్గెట్ చేసినట్టు ఆరోపించారు. అంతే కాదు. లోక్‌సభ ఎన్నికల ముందు I.N.D.I.A కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని మండి పడ్డారు. ఆ కూటమితో తెగదెంపులు చేసుకోవాలనే ఇలా బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. 

"ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలన్నదే బీజేపీ కుట్ర. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కోర్టు వరకూ వెళ్లింది. అలాంటప్పుడు కోర్టు తీర్పు ఏమిస్తుందో ఎదురు చూడాలిగా..? కోర్టు నిర్ణయమేంటో తెలుసుకోవాలిగా. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. ఇలా మళ్లీ మళ్లీ సమన్లు జారీ చేయడం దేనికి..? ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేయాలంటూ కొందరు మాపై ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ ప్రతిపక్ష కూటమి నుంచి బయటకు రాం"

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

 

ఇప్పటికే బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులూ ఇదే విధంగా ఆరోపించారు. కొంత మంది ఆప్‌ నేతలకు బీజేపీ నుంచి మెసేజ్‌లు వచ్చాయని అన్నారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, CBIతో దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నట్టు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి విచారణకు హాజరు కాకుండా దాటవేస్తూ వస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. మార్చి 16వ తేదీన నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశాలందాయి. అందుకు కేజ్రీవాల్ అంగీకరించారు. గతంలో బడ్జెట్ సమావేశాలున్నందున విచారణకు హాజరు కాలేకపోయామని తెలిపారు. ఈడీ ప్రకారం...ఎక్సైజ్ పాలసీని ఫైనలైజ్ చేసేందుకు ఆప్ రూ.100 కోట్ల లంచం తీసుకుంది. గోవా ఎన్నికల్లో ప్రచారం కోసం ఈ డబ్బుల్నే వినియోగించారని ఆరోపిస్తోంది ఈడీ. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. 

Also Read: 2 వేల రైల్వే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క ఒళ్లు బలిసి కామెంట్.. క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క ఒళ్లు బలిసి కామెంట్.. క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Neha Kakkar Controversy: స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క ఒళ్లు బలిసి కామెంట్.. క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క ఒళ్లు బలిసి కామెంట్.. క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Neha Kakkar Controversy: స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
VT15 movie: సత్యను ఓ ఆట ఆడుకున్న వరుణ్ తేజ్, గాంధీ... హిలేరియస్‌గా మెగా ప్రిన్స్ కొత్త మూవీ అనౌన్స్మెంట్
సత్యను ఓ ఆట ఆడుకున్న వరుణ్ తేజ్, గాంధీ... హిలేరియస్‌గా మెగా ప్రిన్స్ కొత్త మూవీ అనౌన్స్మెంట్
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Embed widget