అన్వేషించండి

Manish Sisodia : తీహార్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీ నాకు సీఎం పదవిని ఆఫర్ చేసింది - మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు

Manish Sisodia : తీహార్ జైల్లో ఉన్నప్పుడు తనను బీజేపీ బెదిరించిందని ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. తనకు సీఎం పదవిని ఆఫర్ చేశారని చెప్పారు.

Manish Sisodia : ఢిల్లీలో ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ధూషణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తమ పార్టీలో చేరమని కోరిందని ఆరోపించారు. తాను వారితో చేరితే ఆప్ ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేసి తనను సీఎం చేస్తామని ఆ పార్టీ నేతలు తనకు హామీ ఇచ్చారని చెప్పారు.

మా పార్టీలో చేరితే మిమ్మల్ని సీఎం చేస్తాం 

'బీజేపీలో చేరండి, ఆప్ ఎమ్మెల్యేలను విడగొడతాం. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాం' అని బీజేపీ నేతలు తనకు కోరారని మనీషా సిసోడియా చెప్పారు. "అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలేయండి. ఒకవేళ మీరు ఈ ఆఫర్ నిరాకరిస్తే ఇలా జైల్లోనే ఉంటారు. బయటకు రాలేరు" అని బెదిరించినట్లు బీజేపీ నేతలపై సిసోడియా ఆరోపణలు చేశారు. "నేను ఆ సమయంలో జైల్లో ఇబ్బందులు పడుతున్నానని బీజేపీకి తెలుసు. నా భార్య అనారోగ్యంతో ఉందని, నా కొడుకు చదువుకుంటున్నాడని కూడా వారికి తెలుసు. ఆ టైంలోనే బీజేపీ నాకు ఓ అల్టిమేటం ఇచ్చింది. అదేంటంటే అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలిపెట్టండి లేకపోతే జైలులో ఇలానే మగ్గిపోండి అన్నారు. ఇదే ఆ పార్టీ విధానం. వారు ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తారు. ప్రజల అవసరాలతో వాళ్లకు పట్టింపు లేదు. కేవలం అధికారం కోసమే ఆరాటపడతారు. వారి మాట వినకపోతే తప్పుడు కేసులతో జైలుకు పంపిస్తారు’’ అని సిసోడియా ఆరోపించారు.

తమ ఎజెండాతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించిన ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని సిసోడియా అన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ పూనుకుంది. విడగొట్టలేని పక్షంలో వారిని జైలుకు పంపిస్తున్నారు’ అని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ రాజకీయ పోరాటం వ్యక్తిగతంగా మారిందా అని అడిగిన ప్రశ్నకు, సమాధానంగా.. బీజేపీ మొదటి నుంచీ దీన్ని ఓ వ్యక్తిగత యుద్ధంగానే పరిగణిస్తోందని అన్నారు. ‘‘వారు పాఠశాలలు, ఆస్పత్రులు, నీరు, విద్యుత్ సౌకర్యాల గురించి పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకునే ఉంటే దశాబ్దాలుగా అధికారంలో ఉనన రాష్ట్రాల్లో పాఠశాలలు, ఆస్పత్రులో మంచి స్థితిలో ఉండేవి, ప్రజలకు సకాలంలో నీరు, విద్యుత్తు అందేవి’’ అని చెప్పుకొచ్చారు.

ప్రతిపక్ష నేతలపై దాడి చేసి జైలుకు పంపేందుకు దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. అవినీతికి పాల్పడిన వారిపై మాత్రమే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పింది. 

ఇకపోతే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను 2023లో అరెస్టు చేశారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు ఆయన దాదాపు 17 నెలల కస్టడీలో గడిపారు. కాగా 70 నియోజకవర్గాలకు గానూ ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు.

Also Read : Republic Day 2025 : గణతంత్ర దినోత్సవం 2025 - 40 విమానాలతో అద్భుతమైన ఫ్లై పాస్ట్‌కు సిద్ధమైన వైమానిక దళం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget