అన్వేషించండి

Bilkis Bano Case: నేను మొద్దుబారిపోయాను, న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది - బిల్కిస్ బానో ఆవేదన

Bilkis Bano Case: తనపై అత్యాచారం చేసిన 11 మంది దోషులను విడుదల చేయటంపై బిల్కిస్ బానో ఆవేదన వ్యక్తం చేశారు.

Bilkis Bano Case: 

నిర్ణయం వెనక్కి తీసుకోండి..

బిల్కిస్ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవిత ఖైదు విధించిన నేరస్థులను ఉన్నట్టుండి ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. దీనిపై బిల్కిస్ బానో స్పందించారు. "న్యాయ వ్యవస్థపై ఉన్న నా నమ్మకం చెదిరింది. ఉన్నట్టుండి శరీరం మొద్దుబారిపోయినట్టు అయిపోయింది" అంటూ కామెంట్ చేశారు. ఆ నిందితులను విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె...ఈ నిర్ణయం తీసుకునే ముందు తన భద్రత గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించిన బిల్కిస్ బానో...భయం లేకుండా జీవించే హక్కుకల్పించాలని కోరారు. 

మహిళకు న్యాయం జరగాల్సిన తీరు ఇది కాదు..

బిల్కిస్ బానో తరపున ఆమె న్యాయవాది కూడా స్పందించారు. "ఆగస్టు 15న ఆ 11 మంది నిందితుల్ని విడుదల చేశారన్న వార్త ఆందోళన కలిగించింది. 20 ఏళ్ల క్రితం ఎలాంటి మానసిక వేదన అనుభవించానో ఇప్పుడూ అదే అనుభవిస్తున్నాను. నా జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్లు ఎంతో సులువుగా బయటకు వచ్చేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. "నాకే మాట్లాడాలో అర్థం కావట్లేదు" అని అన్నారు. "ఓ మహిళకు న్యాయం జరగాల్సిన తీరు ఇదేనా..? సర్వోన్నత న్యాయస్థానాలను ఎంతో గౌరవించాను. నమ్మాను. న్యాయవ్యవస్థనూ విశ్వసించాను. 
మానసిక వేదనతోనే ఏదోలా జీవించటం నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ 11 మంది దోషులను విడుదల చేసి నా మనశ్శాంతిని దూరం చేశారు. న్యాయవ్యవస్థపై నాకున్న నమ్మకాన్ని పోగొట్టారు. నా బాధ నా గురించి మాత్రమే కాదు. కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరిగే ప్రతి మహిళ గురించి" అని బిల్కిస్ బానో ఆవేదన చెందారు. 

సామూహిక అత్యాచారం..

గుజరాత్ అల్లర్లు-2002 సమయంలో బిల్కిస్ బానోపై  సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యుల ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్‭లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతురితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించుకున్నారు. ఈ ఘటనపై అప్పట్లో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను 2004లో అరెస్ట్ చేశారు. 2008 జనవరి 1న వీరికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్ష పడిన వారిని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన ఖైదీల కింద విడుదల చేశారు. వీరిని విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం వంటి కేసులున్న వారిని విడుదల చేయకూడదన్న నిబంధనలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: The Ghost Promo: ‘ది ఘోస్ట్’ టీజర్: ఒక రాయి, నిప్పు, ఒక ఆయుధం - అంచనాలు పెంచేస్తున్న నాగ్ మూవీ!

Also Read: Vijaya Shanthi: కేసీఆర్ చెప్పేవన్నీ తుపాకి రాముడి కథలే, సీఎం వ్యాఖ్యలపై విజయ శాంతి కౌంటర్


 

 

 

 

 


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Supreme Court judges Assets: ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
Prakash Raj: పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడాSiraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీRCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Supreme Court judges Assets: ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
Prakash Raj: పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
MAD Square: 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ - బావమరిది కోసం
'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ - బావమరిది కోసం
Hyderabad Weather: తెలంగాణలో మారిన వాతావరణం- హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గాలి వాన  
తెలంగాణలో మారిన వాతావరణం- హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గాలి వాన  
Ram Charan: 'చిరుత' నుంచి 'పెద్ది' వరకు... రామ్ చరణ్ సినిమాల ఆడియో రైట్స్ - లిస్ట్‌లో టాప్ ఏది? లాస్ట్‌ ఏదో తెలుసా?
'చిరుత' నుంచి 'పెద్ది' వరకు... రామ్ చరణ్ సినిమాల ఆడియో రైట్స్ - లిస్ట్‌లో టాప్ ఏది? లాస్ట్‌ ఏదో తెలుసా?
HCU Land Dispute: కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
Embed widget