అన్వేషించండి

Breaking News: రాజేంద్ర నగర్‌లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
AP Telangana Breaking News on 17 November 2021: AP Telangana News Live Updates Breaking News: రాజేంద్ర నగర్‌లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..
బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్

Background

తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు నిజామాబాద్‌ రాజకీయాల్లో లెక్కలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూల్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్సీల కోసం లీడర్లు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆ కోటాలో ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నారు. 

కవితే ఆ స్థానం నుంచి పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తున్నారన్న ప్రచారంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. లోక‌ల్ బాడీ నుంచి నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ళ్లీ క‌విత‌కే ఛాన్స్ ఇద్దామ‌ని అనుకున్నారు. కానీ ఆమె మొద‌టి నుంచి ఈ ఎమ్మెల్సీ కొంత అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

నెల్లూరు నగర కార్పొరేషన్ సహా.. 13 మున్సిపాల్టీల ఎన్నికల కౌంటింగ్‌ 
రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు నగర కార్పొరేషన్ సహా.. 13 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల కౌంటిగ్ మరికొద్ది సేపట్లో మొదలవుతుంది. కౌంటింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలనుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడిస్తారు. 

దేశవ్యాప్తంగా ముగిసిన సీబీఐ సోదాలు.. 
దేశవ్యాప్తంగా సీబీఐ నిర్వహిస్తోన్న సోదాలు ముగిశాయి. 77 ప్రాంతాల్లో 14 రాష్ట్రాల్లో తనిఖీలు. ఇంటర్‌ పోల్‌, సీబీఐ సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. ఆన్‌లైన్‌ వేదికగా చిన్నారుల లైంగిక వేధింపులపై 23 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకూ 83 మంది నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశి నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తూ, ఆల్ టైమ్ రికార్డు ధరల దిశగా దూసుకెళ్తోంది.  తాజాగా రూ.280 మేర పుంజుకోవడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,350 అయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,150 గా ఉంది. ఇక వెండి ధర రూ.700 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,500 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలతో ట్రేడింగ్ జరుగుతోంది. 

ఇక ఏపీలోనూ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 మేర పెరగడంతో విజయవాడలో నేడు 10 గ్రాముల పసిడి ధర రూ.46,150 అయింది. రూ.280 మేర పుంజుకోవడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 అయింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,500 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 

13:01 PM (IST)  •  17 Nov 2021

మేడ్చల్ మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం

తెలంగాణ: మేడ్చల్ లోని మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మంటల్లో చిక్కుకున్న మరో వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. నిల్వ చేసిన ఆయిల్‌ డబ్బాలకు మంటలు అంటుకోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

09:23 AM (IST)  •  17 Nov 2021

రాజేంద్ర నగర్‌లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్ర నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ బెడ్, మెత్తలు తయారుచేసే కంపెనీలో బుధవారం ఉదయం  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget