అన్వేషించండి

Andhra Pradesh : అవయవదానం చేసే వారికి ఏపీ సర్కార్ అరుదైన గౌరవం - అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Organ Donors : అవయదానం చేసిన వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాణదానం చేస్తున్న వారికి గౌరవం ఇచ్చేలా జీవో జారీ చేశారు.

Funeral with honors for organ donors :  అవయవదానం చేసే వారికి ఏపీ ప్రభుత్వం అరదైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకుంది.  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటే మరణించిన వ్యక్తికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఈ గౌరవం ప్రాణం నిలిపిన వారి కన్నా పొందేందుకు అర్హులు ఎవరూ ఉండరని చెబుతూ ఉంటారు.  అందకే ఏపీ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచన చేసి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.  అవయవ దాతల అంతిమ సంస్కారాలు ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. 

ఆర్డీవో స్థాయికి తక్కువ కాని  వారి నేతృత్వంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు              

చనిపోయిన వారు,  బ్రెయిన్ డెడ్  అయిన వారి అవయవాలను అవసరార్ధులకు అమర్చడం ద్వారా . వారికి పునర్జన్మను ఇచ్చే జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా  అవయవ దాతల అంతిమ సంస్కారాలను  ప్రభుత్వం నిర్వహించనుంది.  RDO స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో  ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన నియమావళిని పేర్కొంటూ ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. 

అవయవదానంపై అవగాహన పెంచేందుకు వినూత్న నిర్ణయం          

అవయవ దానం వల్ల కొన్ని వందల మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని విస్తృతంగా ప్రచారం  చేస్తున్నారు.  యాక్సిడెంట్లు, బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులు ఇటీవలి కాలంలో  అవయవదానం చేసేందుకు అంగీకరిస్తున్నారు. అయితే సహజంగా చనిపోయిన వారి గురించి పెద్దగా సమాచారం రావడం లేదు. జీవన్  దాన్ లో నమోదు చేసుకున్న వారు చనిపోయిన తరవాత తమ అవయవాలను ఇవ్వడానికి అంగీకరించినట్లవుతుంది.  

90వేల మంది ప్రాణభిక్ష కోసం ఎదురు చూపులు                                                

యేటా ఐదు లక్షల మంది అవయవాలు చెడి‌పోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.  జాతీయ స్థాయిలో చాలా స్వల్పంగా ఈ అవయవ దానమ రిజిస్ట్రేషన్ లు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  కొంత మందికి మతాచారాలు అడ్డుగా వస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీల మార్పిడి కోసం ప్రజలు చాలా మంది క్యూలో ఉన్నారు.  వయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా ప్రభుత్వం తెలిపింది.  సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా...‌ ప్రజల్లో మార్పు రాలేదని ఇటీవల ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అన్నారు. ఏపీలో  260 మంది అవయవ దానం‌కోసం ముందుకు వచ్చారని  తెలంగాణలో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారని కానీ  90 వేల మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారన్నారని సత్యకుమార్ తెలిపారు. అందుకే అవయవదానం చేసే వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలని నిర్ణయంచడంతో ఇక ముందు ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు.                    

 

టాప్ హెడ్ లైన్స్

England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget