అన్వేషించండి

Andhra Pradesh : అవయవదానం చేసే వారికి ఏపీ సర్కార్ అరుదైన గౌరవం - అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Organ Donors : అవయదానం చేసిన వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాణదానం చేస్తున్న వారికి గౌరవం ఇచ్చేలా జీవో జారీ చేశారు.

Funeral with honors for organ donors :  అవయవదానం చేసే వారికి ఏపీ ప్రభుత్వం అరదైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకుంది.  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటే మరణించిన వ్యక్తికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఈ గౌరవం ప్రాణం నిలిపిన వారి కన్నా పొందేందుకు అర్హులు ఎవరూ ఉండరని చెబుతూ ఉంటారు.  అందకే ఏపీ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచన చేసి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.  అవయవ దాతల అంతిమ సంస్కారాలు ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. 

ఆర్డీవో స్థాయికి తక్కువ కాని  వారి నేతృత్వంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు              

చనిపోయిన వారు,  బ్రెయిన్ డెడ్  అయిన వారి అవయవాలను అవసరార్ధులకు అమర్చడం ద్వారా . వారికి పునర్జన్మను ఇచ్చే జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా  అవయవ దాతల అంతిమ సంస్కారాలను  ప్రభుత్వం నిర్వహించనుంది.  RDO స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో  ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన నియమావళిని పేర్కొంటూ ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. 

అవయవదానంపై అవగాహన పెంచేందుకు వినూత్న నిర్ణయం          

అవయవ దానం వల్ల కొన్ని వందల మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని విస్తృతంగా ప్రచారం  చేస్తున్నారు.  యాక్సిడెంట్లు, బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులు ఇటీవలి కాలంలో  అవయవదానం చేసేందుకు అంగీకరిస్తున్నారు. అయితే సహజంగా చనిపోయిన వారి గురించి పెద్దగా సమాచారం రావడం లేదు. జీవన్  దాన్ లో నమోదు చేసుకున్న వారు చనిపోయిన తరవాత తమ అవయవాలను ఇవ్వడానికి అంగీకరించినట్లవుతుంది.  

90వేల మంది ప్రాణభిక్ష కోసం ఎదురు చూపులు                                                

యేటా ఐదు లక్షల మంది అవయవాలు చెడి‌పోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.  జాతీయ స్థాయిలో చాలా స్వల్పంగా ఈ అవయవ దానమ రిజిస్ట్రేషన్ లు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  కొంత మందికి మతాచారాలు అడ్డుగా వస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీల మార్పిడి కోసం ప్రజలు చాలా మంది క్యూలో ఉన్నారు.  వయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా ప్రభుత్వం తెలిపింది.  సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా...‌ ప్రజల్లో మార్పు రాలేదని ఇటీవల ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అన్నారు. ఏపీలో  260 మంది అవయవ దానం‌కోసం ముందుకు వచ్చారని  తెలంగాణలో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారని కానీ  90 వేల మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారన్నారని సత్యకుమార్ తెలిపారు. అందుకే అవయవదానం చేసే వారికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలని నిర్ణయంచడంతో ఇక ముందు ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు.                    

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Embed widget