అన్వేషించండి

Shocking: తాంబూలం వేసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఇద్దరు రైతులు మృతి

పొలం పనులు చేసుకుంటూ తాంబూళం వేసుకున్న ఇద్దరు రైతుల ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదంను మిగిల్చింది.

2 Farmer dies after having paan in Annamayya District: హిందూ‌ సాంప్రదాయం‌ ప్రకారం తాంబూలానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహాల దగ్గర నుండి ఏ చిన్న కార్యం జరగాలన్నా తాంబూలం తప్పని సరిగా ఉపయోగిస్తారు. ఇక తాంబూలం ఎర్రగా పండితే మంచి జీవిత భాగస్వామి వస్తుందని పెద్దలు అంటుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాంబూలంను తరచూగా తీసుకుంటూ ఉంటారు. తాజాగా పొలం పనులు చేసుకుంటూ తాంబూళం వేసుకున్న ఇద్దరు రైతుల ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లా ( Annamayya District )లో తీవ్ర విషాదంను మిగిల్చింది. తాంబూలం వేసుకుంటే ప్రాణాలు పోవడం ఏంటని పోలీసులు మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని గూండావారిపల్లిలో కృష్ణప్ప(45), కనకరాజు(36) లు బావా, బామర్దులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం‌ సాగించేవారు. ఉదయం నిద్ర లేచింది మొదలుకుని చీకటి‌పడే వరకూ‌ పొలం పనుల్లో తీరిక లేకుండా ఉండేవారు. చీకటి‌ పడితే గానీ వీరిద్దరూ ఇంటికి తిరిగి వెళ్లేవారు కాదు. అయితే రోజు వారిలాగే శనివారం ఉదయం బావా, బామర్దులు పొలం‌ పనుల నిమిత్తం పొలం వద్దకు బయలుదేరారు. పోతూ పోతూ మార్గం మధ్యలో ఒకచోట కూర్చుని తమలపాకులు, సున్నం, వక్కలు కలిపి తాంబూలం‌ వేసుకున్నారు. తాంబూలం తిన్నాక అటు నుంచి పొలం వద్దకు చేరుకున్నారు. తాంబూలం తిన్న కొన్ని‌ నిమిషాలకే కృష్ణప్ప సృహ కోల్పొయి కింద‌ పడి‌పోయాడు.‌ దీంతో ఆందోళన చేందిన కనకరాజు హుటాహుటిన గుండావారిపల్లికు వెళ్లి బంధువులను తీసుకొని వచ్చేందుకు గ్రామానికి వెళ్లాడు. 
బంధువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యక్తి సైతం..
బంధువులను వెంట తీసుకొచ్చేందుకు వెళ్ళిన కనకరాజు కూడా సృహ కోల్పోయి పడి పోవడంతో  గమనించిన కుటుంబ సభ్యులు ఇరువురిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని పరిక్షించిన వైద్యులు మృతి చెందారని నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలోకి మునిగి పోయాయి. కృష్ణప్ప భార్య నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇదే విషయంపై మదనపల్లి తాలూకా సీఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణప్ప భార్య నాగరత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తాంమని మదనపల్లె తాలూకా సీఐ సత్యనారాయణ వెల్లడించారు.

తాంబూలంలో ప్రధానంగా తమలపాకులు, వక్క సున్నం ఉంటాయి. అయితే తమ అభిరుచుల మేరకు అనేక ఇతర పదార్థాలను కూడా తాంబూలంలో వాడుతూంటారు. వీటిలో జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, పుదీనా, కొబ్బరి తురుము లాంటి వస్తువులున్నాయి. కలకత్తా పాన్, హైదరాబాద్ పాన్, ఢిల్లీ పాన్, స్వీట్ పాన్, హాట్ పాన్ ఇలా ప్రాంతాన్ని బట్టి కిళ్లీలకు పేర్లు ఉన్నాయి. కానీ తాంబూలం వేసుకున్నాక ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జిల్లాలో కలకలం రేపుతోంది. వారు తిన్న కిళ్లీలో ఏవైనా విష పూరిత పదార్థాలు కలిశాయా, లేక వారిద్దరూ పాన్ తిన్నాక ఇంకేమైనా తిన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Iran War: అమెరికా ఫైటర్ జెట్స్‌ F-15, F-35 అలా కూల్చివేశాం.. బ్లాక్ ఫ్రైడే అని ఇరాన్ ప్రకటన
అమెరికా ఫైటర్ జెట్స్‌ F-15, F-35 అలా కూల్చివేశాం.. బ్లాక్ ఫ్రైడే అని ఇరాన్ ప్రకటన
IPL 2026 RR Vs GT Result Updates: రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
Hunter 350ని లాంచ్ చేసిన Royal Enfield.. దీని ఫీచర్లు, ధర పూర్తి వివరాలివే
Hunter 350ని లాంచ్ చేసిన Royal Enfield.. దీని ఫీచర్లు, ధర పూర్తి వివరాలివే
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Vs GT Result Updates: రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Embed widget