అన్వేషించండి

Shocking: తాంబూలం వేసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఇద్దరు రైతులు మృతి

పొలం పనులు చేసుకుంటూ తాంబూళం వేసుకున్న ఇద్దరు రైతుల ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదంను మిగిల్చింది.

2 Farmer dies after having paan in Annamayya District: హిందూ‌ సాంప్రదాయం‌ ప్రకారం తాంబూలానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహాల దగ్గర నుండి ఏ చిన్న కార్యం జరగాలన్నా తాంబూలం తప్పని సరిగా ఉపయోగిస్తారు. ఇక తాంబూలం ఎర్రగా పండితే మంచి జీవిత భాగస్వామి వస్తుందని పెద్దలు అంటుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాంబూలంను తరచూగా తీసుకుంటూ ఉంటారు. తాజాగా పొలం పనులు చేసుకుంటూ తాంబూళం వేసుకున్న ఇద్దరు రైతుల ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లా ( Annamayya District )లో తీవ్ర విషాదంను మిగిల్చింది. తాంబూలం వేసుకుంటే ప్రాణాలు పోవడం ఏంటని పోలీసులు మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని గూండావారిపల్లిలో కృష్ణప్ప(45), కనకరాజు(36) లు బావా, బామర్దులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం‌ సాగించేవారు. ఉదయం నిద్ర లేచింది మొదలుకుని చీకటి‌పడే వరకూ‌ పొలం పనుల్లో తీరిక లేకుండా ఉండేవారు. చీకటి‌ పడితే గానీ వీరిద్దరూ ఇంటికి తిరిగి వెళ్లేవారు కాదు. అయితే రోజు వారిలాగే శనివారం ఉదయం బావా, బామర్దులు పొలం‌ పనుల నిమిత్తం పొలం వద్దకు బయలుదేరారు. పోతూ పోతూ మార్గం మధ్యలో ఒకచోట కూర్చుని తమలపాకులు, సున్నం, వక్కలు కలిపి తాంబూలం‌ వేసుకున్నారు. తాంబూలం తిన్నాక అటు నుంచి పొలం వద్దకు చేరుకున్నారు. తాంబూలం తిన్న కొన్ని‌ నిమిషాలకే కృష్ణప్ప సృహ కోల్పొయి కింద‌ పడి‌పోయాడు.‌ దీంతో ఆందోళన చేందిన కనకరాజు హుటాహుటిన గుండావారిపల్లికు వెళ్లి బంధువులను తీసుకొని వచ్చేందుకు గ్రామానికి వెళ్లాడు. 
బంధువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యక్తి సైతం..
బంధువులను వెంట తీసుకొచ్చేందుకు వెళ్ళిన కనకరాజు కూడా సృహ కోల్పోయి పడి పోవడంతో  గమనించిన కుటుంబ సభ్యులు ఇరువురిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని పరిక్షించిన వైద్యులు మృతి చెందారని నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలోకి మునిగి పోయాయి. కృష్ణప్ప భార్య నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇదే విషయంపై మదనపల్లి తాలూకా సీఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణప్ప భార్య నాగరత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తాంమని మదనపల్లె తాలూకా సీఐ సత్యనారాయణ వెల్లడించారు.

తాంబూలంలో ప్రధానంగా తమలపాకులు, వక్క సున్నం ఉంటాయి. అయితే తమ అభిరుచుల మేరకు అనేక ఇతర పదార్థాలను కూడా తాంబూలంలో వాడుతూంటారు. వీటిలో జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, పుదీనా, కొబ్బరి తురుము లాంటి వస్తువులున్నాయి. కలకత్తా పాన్, హైదరాబాద్ పాన్, ఢిల్లీ పాన్, స్వీట్ పాన్, హాట్ పాన్ ఇలా ప్రాంతాన్ని బట్టి కిళ్లీలకు పేర్లు ఉన్నాయి. కానీ తాంబూలం వేసుకున్నాక ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జిల్లాలో కలకలం రేపుతోంది. వారు తిన్న కిళ్లీలో ఏవైనా విష పూరిత పదార్థాలు కలిశాయా, లేక వారిద్దరూ పాన్ తిన్నాక ఇంకేమైనా తిన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget