అన్వేషించండి

Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

Background

Breaking News Live Telugu Updates:   తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా పలు జిల్లాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణశాఖ అధికారులు జారీ చేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. ఇది దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇక దీనికి అనుబంధంగా మరో ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున వ్యాపించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. 22వ తేదీన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది.

ఇక హైదరాబాద్‌లో కూడా శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నగరంలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 28, 23 డిగ్రీల సెల్సియస్ నమోదవుతాయని తెలిపింది. అటు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. మంచిర్యాల జిల్లాలో 22.8 మి,మీ,  సిద్దిపేట జిల్లాలో 21.1 మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 12.6 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యల్లారెడ్డిపేటలో 113.2 మి.మీ, మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో 83.4 మి.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో 71.2 మి.మీ, కొమరం భీం జిల్లాలోని బెజ్జూర్‌లో 59.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అటు ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. ఆదిలాబాద్‌లో గరిష్టం 34.3, కనిష్టం 25 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. భద్రాచలంలో గరిష్టం 32.6, కనిష్టం 24.5 డిగ్రీలు, హకీంపేట్‌లో గరిష్టం 31.3, కనిష్టం 23, దుండిగల్‌లో గరిష్టం 32.4, కనిష్టం 24.2, హనుమకొండలో గరిష్టం 33.5, కనిష్టం 23, హైదరాబాద్‌లో గరిష్టం 32.7, కనిష్టం 24, ఖమ్మంలో గరిష్టం 34.4, కనిష్టం 25.6, మహబూబ్‌నగర్‌లో గరిష్టం 29, కనిష్టం 23.1, మెదక్‌లో గరిష్టం 33, కనిష్టం 21, నల్లగొండలో గరిష్టం 36.5, కనిష్టం 23, నిజామాబాద్‌లో గరిష్టం 33.5, కనిష్టం 24.5 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణశాఖ పేర్కొంది.

12:03 PM (IST)  •  22 Sep 2023

కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య

11:26 AM (IST)  •  22 Sep 2023

చంద్రబాబు పిటిషన్‌లపై తీర్పు మధ్యాహ్నానికి వాయిదా

క్వాష్ పిటిషన్‌పై తీర్పును 1.30కి వెల్లడించనున్న హైకోర్టు 
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పును 2.30కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 

09:18 AM (IST)  •  22 Sep 2023

రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీలో గందరగోళం- స్పీకడ్‌ పోడియం ముందు టీడీపీ ఆందోళన- సభ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెంటనే కొట్టేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై అధికార పక్ష సభ్యులు ఫైర్ అయ్యారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Embed widget