అన్వేషించండి

Agnipath Scheme Protests In Hyderabad: ఆందోళనలు అదుపు చేసేందుకు పోలీసుల కాల్పులు-ఒకరు మృతి

సికింద్రాబాద్ కాల్పుల ఘటనలో పలువురు గాయపడ్డారు. ఒకరు మృతి చెందినట్టు సమాచారం.

పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆర్మీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఆందోళనకారులు బీభత్సం సృష్టించటం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లను కట్టడి చేేసే ప్రయత్నం చేసినా అది సాధ్య పడలేదు ఫలితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్పటికీ ఆందోళనకారులు అల్లర్లు ఆపలేదు. పైగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితులు చేయి దాటిపోవటం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే యువకులుఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఈ తోపలాటలో పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లోనే ఒకరు మృతి చెందారు. ఇప్పటికే పోలీసులు రైల్వే స్టేషన్ చుట్టూ మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

బోగీలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

కర్రలతో, రాళ్లతో రైళ్లను కొడుతూ,  బోయి గూడ ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ వద్ద ఉన్న ఇంజన్ కి కొందరు ఆందోళనకారులు నిప్పు పెట్టె ప్రయత్నం చేశారు. ఈస్ట్ కోస్ట్ రైలుకు 5 బోగిల కు నిప్పు పెట్టగా.. పోలీసులు, రైల్వే కార్మికులు కలిసి బోగీల్లో మంటాలార్పుతున్నారు. రైల్వే పోలీసులకు సహాయం చేసేందుకు రెగ్యూలర్ పోలీసులు సికింద్రాబాద్‌కు చేరుకుంటున్నట్లు సమాచారం. అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు.

అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ నిరసనలు 

అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్‌ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అగ్నిగుండంగా మారింది. రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. నిజానికి ముందుగానే ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నిరసనలు ఆపి రైల్వేస్టేషన్‌ను ఖాళీ చేయకపోతే కాల్పులు చేస్తామని హెచ్చరించారు. అయినా మాట వినకపోవటం వల్ల చివరకు కాల్పులు జరిపారు. 
ఎన్ఎస్‌యూఐ సంఘాలు అల్లర్లకు కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమకు ఈ అల్లర్లు, విధ్వంసంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అగ్నిపథ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం వివరణ ఇస్తున్నా, దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌ ఘటనతో ఈ నిరసనలు కొత్త మలుపు తీసుకున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Meet Rahul:  రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ -  ఆ అంశాలపై క్లారిటీ వచ్చినట్లే !
రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ - ఆ అంశాలపై క్లారిటీ వచ్చినట్లే !
Balakrishna: ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
High Speed rail: హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
AP Bird Flu Tension: ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Deputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP DesamPM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP DesamTrump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP DesamCaste Census Re Survey in Telangana |  ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Meet Rahul:  రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ -  ఆ అంశాలపై క్లారిటీ వచ్చినట్లే !
రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ - ఆ అంశాలపై క్లారిటీ వచ్చినట్లే !
Balakrishna: ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
ఏపీలో అతి త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి - నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన
High Speed rail: హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?
AP Bird Flu Tension: ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
Chiranjeevi - Sai Durga Tej: చిరంజీవితో సాయి దుర్గా తేజ్ సినిమా... మామా అల్లుళ్ళ సందడి చూసేందుకు రెడీ అవ్వండమ్మా!
చిరంజీవితో సాయి దుర్గా తేజ్ సినిమా... మామా అల్లుళ్ళ సందడి చూసేందుకు రెడీ అవ్వండమ్మా!
Mahindra XEV 9e& BE6 Sales: రికార్డ్ బ్రేక్ చేస్తున్న మహింద్రా ఎలక్ట్రిక్ SUVల బుకింగ్ మొదలు. XEV 9e vs BE 6 – ఏది కస్టమర్ల ఫేవరెట్?
రికార్డ్ బ్రేక్ చేస్తున్న మహింద్రా ఎలక్ట్రిక్ SUVల బుకింగ్ మొదలు. XEV 9e vs BE 6 – ఏది కస్టమర్ల ఫేవరెట్?
PM Children Care Scheme: మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - ఈ స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - PM CARES స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
Ind Vs Pak High Voltage Match: భారత ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని ఆ జట్టుకు సూచన.. ఆ కారణాలతో టీమిండియాపై కోపంతో.. 
భారత ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని ఆ జట్టుకు సూచన.. ఆ కారణాలతో టీమిండియాపై కోపంతో.. 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.