By: ABP Desam | Updated at : 25 Aug 2021 04:37 PM (IST)
అఫ్గాన్ పౌరులకు భారత హోంశాఖ సూచనలు
ఈ-వీసాల ద్వారానే అఫ్గాన్ పౌరులు భారత్ రావాలని హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్లో కల్లోలం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల కోసం భారత్ ఇటీవల కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. అఫ్గాన్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. ‘
భారత్కు వచ్చేందుకు అఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్ట్రాక్ పరిశీలన కోసం e-Emergency X-Misc Visa పేరుతో ప్రత్యేక కేటగిరీ ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టింది. అఫ్గాన్ పౌరులు.. ఈ-వీసాల ద్వారానే భారత్ చేరుకోవాలని తాజాగా హోంశాఖ ప్రకటించింది.
Owing to prevailing security situation in Afghanistan all Afghan nationals henceforth must travel to India only on e-Visa
Press release- https://t.co/aU2UnZW5Tm pic.twitter.com/r7Hv6p6qfr— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 25, 2021
ఇంతకుముందు అఫ్గాన్ పౌరులకు ఇచ్చిన వీసాలన్నీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ-వీసాలపై మాత్రమే వారు భారత్ కు రావాలని తెలిపింది.
భారత్ రావాలనుకునే అఫ్గాన్ పౌరులు ఈ-వీసా కోసం ఇక్కడ www.indianvisaonline.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.
అఫ్గాన్ పరిస్థితులు..
అఫ్గాన్ పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆగస్టు 31 లోపు అమెరికా దళాలు.. అప్గాన్ ను విడిచి వెళ్లాలని తాలిబన్లు ఇప్పటికే బైడెన్ ను హెచ్చరించారు. అమెరికాకు ఇచ్చిన డెడ్లైన్ను పొడిగించే ప్రసక్తే లేదని తాలిబన్ ప్రతినిధి స్పష్టం చేశారు. దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని.. అయితే ఎయిర్ పోర్టులో పరిస్థితి అదుపులోకి రావడం లేదన్నారు. అఫ్గాన్కు చెందిన మేధావులు, నిపుణులు సైతం దేశాన్ని వీడటం వల్ల నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు తాలిబన్ నేతలు, సీఐఏ ప్రతినిధులకు మధ్య జరిగిన రహస్య భేటీ గురించి తనకు తెలియదన్నారు.
అయితే బైడెన్ మాత్రం తమ పౌరులు, దళాల తరలింపునకు గడువు పొడిగించాలని యోచిస్తున్నట్లు ఇప్పటికే తెలిపారు. మరోవైపు తాలిబన్లు.. అఫ్గాన్ లో అరాచకాలు సృష్టిస్తున్నారు. పైకి శాంతివచనాలు పలుకుతున్నా మహిళల హక్కులను కాలరాస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. అప్గాన్ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లాలని కాబూల్ ఎయిర్ పోర్ట్ కు భారీగా తరలివెళ్తున్నారు.
Also Read: Afghanistan Taliban Crisis: 'అఫ్గాన్ సంక్షోభాన్ని ముందుగానే ఊహించాం.. కానీ'
Guntur News : వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి, రోడ్డుపై బైఠాయించిన ఓ కుటుంబం
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్
Secunderabad Bjp Meeting : బీజేపీ విజయసంకల్ప సభ, భారీగా తరలివచ్చిన శ్రేణులు, హాజరైన ప్రజాగాయకుడు గద్దర్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు
Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?