అన్వేషించండి

Amazing Train Journey Routes in India: జీవితంలో ఒక్కసారైనా ట్రావెల్ చేయాల్సిన ఇండియన్ రైలు మార్గాలు ఇవే! ఎడారి, జలపాతాలు, సముద్రం, మంచు కొండలు ప్రతీ ప్రయాణం ఒక అద్భుతమే!

Amazing Train Journey Routes in India:జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించవలసిన నాలుగు ఇండియన్ రైలు మార్గాలు ఇవే! ఎడారి, జలపాతాలు, సముద్రం, మంచు కొండల మీదుగా సాగే ఈ ప్రయాణం ఒక అద్భుతమని చెప్పవచ్చు.

Amazing Train Journey Routes in India:భారతదేశంలో రైల్వే మార్గాలు, అవి వెళ్లే రూట్లు అద్భుతమనే చెప్పాలి. వివిధ రకాల ట్రైన్ రూట్‌లలో జర్నీ చేయడం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. ప్రయాణ సాధనాలు ఎన్ని ఉన్నా ట్రైన్ జర్నీ అంటేనే అదో రకం కిక్కు. అయితే భారతదేశంలో ట్రైన్ ప్రేమికులు కచ్చితంగా ప్రయాణించ వలసిన నాలుగు మార్గాలు గురించి చెబుతూ ఉంటారు. ఆ రూట్లలో ప్రయాణం ఒక అద్భుతం అనేది వారి సూచన. మరి ఆ రూట్లేంటో చూసేద్దామా.

1) జోద్‌పూర్ - జైసల్మేర్ (థార్ ఎడారి గుండా ప్రయాణం) 

భారతదేశంలోని ఏకైక ఎడారి "థార్ ". రాజస్థాన్లోని ఈ ఎడారి గుండా ఒక రైలు మార్గం ఉంది. అక్కడ నివసించే ప్రజలకు ఇదే ప్రధానమైన రవాణా మార్గం. జోద్‌పూర్ నుంచి జైసల్మేర్ వరకూ 300 కిమీ దూరం ప్రయాణించే రైళ్లలో ప్రయాణం టూరిస్టులకు కొత్త అనుభూతినిస్తుంది. జోద్‌పూర్‌లో రెండు స్టేషన్‌లు ఉన్నాయి. ఒకటి జోద్‌పూర్, రెండు భగత్‌కి కోఠి. ఈ రెండు స్టేషన్‌ల నుంచి జైసల్మేర్‌కు 6 రైళ్లు నడుస్తాయి. వాటిలో డే టైం వెళ్ళేవి నడిచేవి 3. ప్రయాణ సమయం ఆరు గంటలు. పూర్తిగా ఎడారి నడుమ నడిచే ఈ రైళ్లలో వెళుతూ ఎడారి అందాలు చూడడం ఒక అనుభూతి. హైదరాబాద్ నుంచి జోద్‌పూర్‌కి రెండు, విజయవాడ నుంచి 4 డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి.

2) విజయవాడ/హైదరాబాద్ -గోవా (దూధ్ సాగర్ జలపాతం మీదుగా ప్రయాణం )

రైల్వే ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే కొంకణ్ రైల్వేలో అడవులు, గుహలు, కొండలు దాటుకుంటూ చేసే ప్రయాణం లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ అంటారు టూరిస్ట్‌లు. ముఖ్యంగా గోవా రూట్లో వాస్కోడాగామా స్టేషన్‌కు 50 km దూరంలో తగిలే దూద్ సాగర్ (పాల సముద్రం ) జల పాతం చూస్తూ ట్రైన్‌లో ప్రయాణం చేయడం నిజంగా ఒక అద్భుతమే. కర్ణాటక -గోవా బోర్డర్‌లో ఉండే ఈ జలపాతాన్ని చూడడానికి ఇదే మంచి సీజన్. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రూట్లో వెళ్లే ట్రైన్ ప్రయాణికులకి దూద్‌సాగర్ జలపాతం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది. హైదరాబాదు నుంచి గోవాకు 4, విజయవాడ నుంచి 1 డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి.

Image

3) మండపం -రామేశ్వరం(సముద్రంఫై సాహస రైళ్లు) 

నదులపై ప్రయాణించే రైళ్ళను మనం రెగ్యులర్‌గా చూస్తాం కానీ సముద్రంపై ప్రయాణించే ట్రైన్ జర్నీ అనుభూతి చెందాలంటే తమిళనాడులోని మండపం -రామేశ్వరం మధ్య ఉన్న పంబన్ బ్రిడ్జ్‌ఫై వెళ్ళాల్సిందే. జస్ట్ 17 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు స్టేషన్ల మధ్య రైలు ప్రయాణించడానికి గంట సమయం తీసుకుంటుంది. కారణం ఈ రెండు స్టేషన్‌ల మధ్యలో ఉన్న సముద్రం. 2 కిమీ దూరం ఉన్న పంబన్ బ్రిడ్జ్‌ఫై రైలు సముద్రాన్ని దాటుతున్న సమయంలో బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. ఒకే అనందాన్ని, గగుర్పాటు కలిగించే అద్భుత ప్రయాణమిది. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి రామేశ్వరానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నా అవన్నీ రామేశ్వరం వెళ్లే సరికి చీకటి పడిపోతుంది. కాబట్టి ముందుగా మండపం వెళ్ళిపోయి అక్కడి నుంచి డే టైమ్ ట్రైన్‌లో వెళ్లడం బెటర్. తిరుపతి నుంచి కూడా రామేశ్వరానికి డైరెక్ట్ ట్రైన్ ఉంది.

Image

Image

5) శ్రీనగర్ -కాట్రా ట్రైన్.. (మంచు కొండల్లో మహాద్భుతం)

హిమాలయాల్లో మంచును చూస్తూ ట్రైన్ జర్నీ చేయడం.. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఇటీవల కొత్తగా నిర్మించిన శ్రీనగర్ రైలు మార్గంతో ఆ అద్భుతం నిజమైంది. పూర్తిగా మంచుతో కప్పిన మార్గంలో ఎత్తైన పర్వతాలు, పెద్ద పెద్ద సొరంగాలు, ఎక్కడో లోతుల్లో ప్రవహించే నదులు, భయంకరమైన లోయల గుండా 200km దూరం ప్రయాణిస్తుంది ఈ రైలు మార్గం. అదే శ్రీమాతా వైష్ణో దేవి కాట్రా నుంచి శ్రీ నగర్ వెళ్లే రైల్వే రూట్. కాట్రా నుంచి శ్రీనగర్‌కు రెండు వందే భారత్‌లు నడుస్తున్నాయి. ఇవికాక శ్రీనగర్ -బారాముల్లా లైన్‌లో కూడా కొన్ని పాసింజర్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఎలా వెళ్లినా ఈ జర్నీ మాత్రం నిజంగా ఒక మహాద్భుతమే అంటారు ఈ రూట్లో వెళ్లిన వారు. హైదరాబాద్ నుంచి కాట్రాకు ఒకటి, విజయవాడ నుంచి 3 డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి.

The image shows a modern, orange and silver Vande Bharat train traveling through a snowy landscape, likely in the region of Kashmir. The train is on a curved track, emphasizing the engineering feat of the rail project. This image is associated with the post by Beats in Brief (@beatsinbrief) announcing that PM Modi will inaugurate the first Vande Bharat train to Kashmir from Katra on April 19, marking the completion of the Udhampur-Srinagar-Baramulla rail project. This event signifies the fulfillment of a long-awaited demand for direct rail connectivity to Kashmir, enhancing the region's accessibility and connectivity within India.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget