అన్వేషించండి

Sravana Masam 2025 : శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదా? శాస్త్రీయ కారణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి

Sawan 2025 : శ్రావణమాసంలో చాలామంది మాంసాహారం తినరు. అయితే దీనికే ఆధ్యాత్మికంగానే కాదు.. శాస్త్రీయపరంగా కూడా ఓ కారణముంది. అదేంటో ఇంతకీ నాన్​వెజ్ తినాలో వద్దో తెలుసుకుందాం.

Sravana Month 2025 : శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో శ్రావణ మాసం 29 రోజులు ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజూను పవిత్రమైనదిగా భావిస్తారు. నవరాత్రి సమయంలో తొమ్మిది రోజులు ఎలా పవిత్రంగా భావిస్తారో.. వీటిని అలాగే భావిస్తారు. అందుకే ఈ పవిత్ర మాసంలో అన్నిరోజులు పూజలు చేస్తారు. అందుకే ఆహారం, దినచర్యలో కొన్ని నియమాలు పాటిస్తారు. అలా పాటించడం వల్ల జీవితంలో ఆర్థికంగా, మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు రావాని భక్తులు భావిస్తారు. అలా పాటించే నియమాల్లో నాన్​వెజ్ ఒకటి. చాలామంది భక్తులు శ్రావణమాసంలో నాన్​వెజ్ తినరు. అయితే దీనివెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందని చెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. 

మతపరమైన కారణమిదే..

శ్రావణ మాసంలో పరిశుభ్రత, పవిత్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే ఈ నెల శివుడికి అంకితం చేస్తారు కాబట్టి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. భక్తుడు తన ఇంద్రియాలను నియంత్రించుకున్నప్పుడు.. అతను దేవునితో సంబంధం పెట్టుకోవడంలో విజయం సాధిస్తాడని చెప్తోంది శాస్త్రం. పూజలు చేసేప్పుడు భక్తుడు దృష్టి అంతా శివునిపైనే ఉండాలి. అయితే మాంసాహారం తింటే.. బద్ధకం పెరుగుతుంది. అంతేకాకుండా అహంకారం, కోపం, అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో నాన్​వెజ్ తినరు. 

సమతుల్య ఆహారం తీసుకోకపోతే.. వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రించలేడు. పూజలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆధ్యాత్మికత నుంచి విడిపోతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్య శాస్త్రంలో శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదని తెలిపారు. మతపరమైన కోణం నుంచి చెప్పాలంటే..  కొన్ని నమ్మకాల ప్రకారం వర్షం కారణంగా శ్రావణ మాసంలో జీవులను చంపి తినడం పాపం కిందకు వస్తుంది. అందుకే తినరు. 

శాస్త్రీయ కారణం ఇదే

శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. శ్రావణ మాసం జూలై లేదా ఆగస్టులో వస్తుంది. ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీని కారణంగా ఆహార పదార్థాలలో ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శ్రావణ మాసంలో మాంసాహారం.. సాధారణ రోజుల కంటే వేగంగా పాడైపోతుందట. అంటే 6 గంటలు తాజాగా ఉండే ఆహారం 4 గంటల్లోనే పాడైపోతుందట. అలాగే వీటితో పాటు వేగంగా బ్యాక్టిరీయా వ్యాప్తి ఉంటుందట. అందుకే నాన్​వెజ్​కి దూరంగా ఉండాలని చెప్తారు. 

అంతేకాకుండా వర్షాకాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఆ సమయంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థ వీక్​గా ఉంటుంది. నాన్​వెజ్ అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే దానిని దూరంగా ఉండాలని చెప్తున్నారు. 

మీరు ఆధ్యాత్మికంగా నాన్​వెజ్ తినకపోయినా పర్లేదు. కానీ సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉండే సమయంలో ఇలా నాన్​వెజ్ తినకూడదని వైద్యులు కూడా సూచిస్తారు. పూర్తి ఆరోగ్యం కోసం మీరు దానిని అవాయిడ్ చేయవచ్చు. లేదా పూర్తిగా శుభ్రమైన రీతిలో.. బాగా ఉడికించుకుని తినడం ద్వారా వ్యాధుల వ్యాప్తి కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget