అన్వేషించండి

UBI Specialist Officers: యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే

UBI SO Jobs: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీచేయనున్నారు.

Union Bank of India SO Recruitment: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

వివరాలు..

🔰 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 606.

పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-253, ఈడబ్ల్యూఎస్-59, ఓబీసీ-161, ఎస్టీ-44, ఎస్సీ-89.

1) చీఫ్ మేనేజర్ (ఐటీ): 05 పోస్టులు

2) సీనియర్ మేనేజర్ (ఐటీ): 42 పోస్టులు

3) మేనేజర్ (ఐటీ): 04 పోస్టులు

4) మేనేజర్ (రిస్క్): 27 పోస్టులు

5) మేనేజర్ (క్రెడిట్): 371 పోస్టులు

6) మేనేజర్ (లా): 25 పోస్టులు

7) మేనేజర్ (ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్): 05 పోస్టులు

8) మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్): 19 పోస్టులు

9) అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్): 02 పోస్టులు

10) అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ ఇంజినీర్): 02 పోస్టులు

11) అసిస్టెంట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్): 01 పోస్టు 

12) అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్): 30 పోస్టులు

13) అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్): 73 పోస్టులు

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ/ సీఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్/ సీఎఫ్‌ఏ సర్టిఫికేట్/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి..

➥ చీఫ్ మేనేజర్(ఐటీ) పోస్టులకు 30 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ సీనియర్ మేనేజర్(ఐటీ) పోస్టులకు 28 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్(రిస్క్/సీఏ) పోస్టులకు 25 - 35  సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్ (ఐటీ/క్రెడిట్/ఐటీవో/టీవో) పోస్టులకు 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్ (రిస్క్/లా) పోస్టులకు 25 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి.  

➥ అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్/సివిల్ ఇంజినీర్/ఆర్కిటెక్ట్/టెక్నికల్/ఫోరెక్స్) పోస్టులకు 20 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.  

➥ ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందినవారికి  5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

ALSO READ: ఐసీఐసీఐ బ్యాంకులో పీవో పోస్టులు - కోర్సు, స్టైపెండ్ వివరాలు ఇవే

పరీక్ష విధానం..

➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.

➥ అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్- 50 ప్రశ్నలు-50 మార్కులు, అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.

➥ పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు.

పర్సనల్ ఇంటర్వ్యూ: రాతపరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 50 మార్కులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 22.5గా నిర్ణయించారు. నిర్ణీత అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.

గ్రూప్ డిస్కషన్: మొత్తం 50 మార్కులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 22.5గా నిర్ణయించారు. 

పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, చండీగఢ్/మొహాలీ, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్‌కతా, భోపాల్, పాట్నా, ముంబయి/నేవీ ముంబయి/గ్రేటర్ ముంబయి/థానే, భువనేశ్వర్, అహ్మదాబాద్/గాంధీనగర్.

జీత భత్యాలు..

➥ చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.76,010-రూ.89,890 వరకు ఉంటుంది. 

➥ సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.63840-రూ.78,230 వరకు ఉంటుంది. 

➥ మేనేజర్ పోస్టులకు రూ.48,170-రూ.69,810 వరకు ఉంటుంది.  

➥ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.36,000-రూ.63,840 వరకు ఉంటుంది.  

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2024

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.02.2024 (24:00 Hrs).

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget