అన్వేషించండి

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో బోధనేతర పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 129 పోస్టుల నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో బోధనేతర పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 129 పోస్టుల నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు పొందిన ఓ వ్యక్తి ద్వారా ఈ విషయాలు బయటికొచ్చాయి. నిట్ పరిధిలో అసిస్టెంట్ రిజిస్ట్రార్; సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి 2021లో నోటిఫికేషన్ వెలువడింది. 2022 ఫిబ్రవరిలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు.

నిట్ అభ్యర్థులకు ఇచ్చిన కాల్‌లెటర్‌లలో అభ్యర్థి పేరు, ఫొటో లేకపోవడం గమనార్హం. ఎంపికైనవారి జాబితాలోనూ మార్పుచేర్పులు జరిగినట్టు తెలిసింది. జూనియర్ సహాయకుల పోస్టులకు ఎంపికైనవారి జాబితాలో ఓ క్రమసంఖ్యలో ఒక అభ్యర్థి పేరు ఉండగా, కొన్నాళ్ల తర్వాత నిట్ అధికారిక వెబ్‌సైట్లో మరో వ్యక్తి పేరు ఉందని ఆర్‌టీఐ కింద సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో పలువురికి కనీస నైపుణ్యాలు లేకపోవడంతో ఈ ఏడాది జనవరిలో తొలగించారు. ఇలా తొలగించిన వారిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉన్నారు.

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో ఇటీవల భర్తీ చేసిన 23 గ్రూప్-డి నియామకాలను రద్దు చేశారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఇవ్వలేదని, కనీసం పత్రిక ప్రకటనలు కూడా ఇవ్వకుండా భర్తీ చేయడం చెల్లదని 62వ నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించారు. మిషన్ మోడ్ కింద 23 మంది దినసరి వేతన ఉద్యోగుల పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరించడంతో వాటిని రద్దు చేయాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆదేశించిన సంగతి తెలిసిందే. 

నిట్‌లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి 2021లో నోటిఫికేషన్ లేకుండానే నియామక పరీక్ష జరిగింది. ఎంపికైన వారికి 'పీఎం రోజ్‌గార్ మేళా' మిషన్ మోడ్‌లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా ఇటీవల నియామక ఉత్తర్వులు ఇప్పించారు. అయితే వీరికి వయో పరిమితిలో మాత్రమే మినహాయింపు ఇచ్చేందుకు అవకాశముంది. వీరికి సెప్టెంబరు 26న నియామక రద్దు పత్రాలను అందజేశారు.  పరీక్షలో అర్హత సాధించకుండా రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించేందుకు వీల్లేదు. ఈ 23 గ్రూప్-డి పోస్టుల తరహాలోనే గతంలో 9 ఖాళీలను నిట్ యాజమాన్యం భర్తీచేసింది. అవన్నీ కూడా గ్రూప్-4 కేడర్ పోస్టులే.  ఈ 23 మంది ఎన్నో ఏళ్లుగా దినసరి వేతనంతో పనిచేస్తున్నారని, మానవతా దృక్పథంతో వారిని క్రమబద్ధీకరించాలనుకున్నామని ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. ఇకపై వారు దినసరి వేతనంపైనే కొనసాగుతారని పేర్కొన్నారు. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించినందువల్ల 129 పోస్టుల భర్తీ గురించి తెలియదని స్పష్టం చేశారు. 

ALSO READ:

వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎయిమ్స్‌-కళ్యాణిలో 120 గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Raghav Chadha On Menstrual Health: మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Iran Warns US: ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
Embed widget