అన్వేషించండి

APPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, 'ఆప్షన్లు' నమోదు చేసుకోండి! షెడ్యూలు ఇదే!

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 'ఆప్షన్లు' నమోదు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. మార్చి 6 నుంచి 15 వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 'ఆప్షన్లు' నమోదు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. మార్చి 6 నుంచి 15 వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ల నమోదులో భాగంగా అభ్యర్థులు తాము పరీక్ష రాసే మీడియం, పోస్టుల ప్రాధాన్యత క్రమం, జోనల్ ప్రిఫరెన్స్, పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసిన అభ్యర్థులను మాత్రమే మెయిన్ పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీలను ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం సెషన్లలోనే పరీక్షలు నిర్వహిస్తారు. ఇటీవల వెల్లడించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో మొత్తం 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మల్టీ జోన్‌, రిజర్వేషన్‌ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. 

APPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, 'ఆప్షన్లు' నమోదు చేసుకోండి! షెడ్యూలు ఇదే!

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ఇలా..
మెయిన్ పరీక్షలో మొత్తం 5 పేపర్లు ఉంటాయి. మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో పేపరుకు 150 మార్కుల కేటాయించారు. మొత్తం 5 పేపర్లకు గాను 750 మార్కులు, పర్సనాలిటీ టెస్టుకు 75 మార్కులు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలను కేవలం అర్హత పరీక్షలుగానే పరిగణిస్తారు. వీటిమార్కులను మెయిన్స్ పరీక్ష మార్కుల్లో కలపరు. 

➥ ఏప్రిల్ 23: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు

➥ ఏప్రిల్ 24: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు

➥ ఏప్రిల్ 25: పేపర్-1 జనరల్ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన సమస్యలు: 150 మార్కులు

➥ ఏప్రిల్ 26: పేపర్-2 (హిస్టరీ & కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు

➥ ఏప్రిల్ 27: పేపర్-3 (పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు.

➥ ఏప్రిల్ 28: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు

➥ ఏప్రిల్ 29: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ఇలా..
మెయిన్ పరీక్షలో మొత్తం 5 పేపర్లు ఉంటాయి. మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో పేపరుకు 150 మార్కుల కేటాయించారు. మొత్తం 5 పేపర్లకు గాను 750 మార్కులు, పర్సనాలిటీ టెస్టుకు 75 మార్కులు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలను కేవలం అర్హత పరీక్షలుగానే పరిగణిస్తారు. వీటిమార్కులను మెయిన్స్ పరీక్ష మార్కుల్లో కలపరు. 

➥ ఏప్రిల్ 23: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు

➥ ఏప్రిల్ 24: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు

➥ ఏప్రిల్ 25: పేపర్-1 జనరల్ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన సమస్యలు: 150 మార్కులు

ఏప్రిల్ 26: పేపర్-2 (హిస్టరీ & కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు

➥ ఏప్రిల్ 27: పేపర్-3 (పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు.

ఏప్రిల్ 28: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు

➥ ఏప్రిల్ 29: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు

APPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, 'ఆప్షన్లు' నమోదు చేసుకోండి! షెడ్యూలు ఇదే!

పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...

ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో నుంచి 1:50 నిష్పత్తిలో 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jr.NTR vs TDP Fans: వార్-2 రిలీజ్‌కు ముందు NTR ఫ్యాన్స్ టీడీపీ అభిమానుల మధ్య రచ్చ.. జూనియర్ స్టామినాకు పరీక్ష
వార్-2 రిలీజ్‌కు ముందు NTR ఫ్యాన్స్ టీడీపీ అభిమానుల మధ్య రచ్చ.. జూనియర్ స్టామినాకు పరీక్ష
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌కు 20 సెం.మీ అత్యంత భారీ వర్ష సూచన, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్‌కు 20 సెం.మీ అత్యంత భారీ వర్ష సూచన, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
Andhra Pradesh Investments:  ఏపీవైపు బడా పారిశ్రామికవేత్తల చూపు - కడప, కర్నూలు, కాకినాడల్లో భారీ పెట్టుబడుల ప్రకటన
ఏపీవైపు బడా పారిశ్రామికవేత్తల చూపు - కడప, కర్నూలు, కాకినాడల్లో భారీ పెట్టుబడుల ప్రకటన
Annapurna Studios: అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన  ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...
అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...
Advertisement

వీడియోలు

Srikakulam లో స్వాతంత్ర సమరయోధులకు గుడి | ABP Desam
Vizag Town Hall History: స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ టౌన్ హాల్ చరిత్ర | ABP Desam
East India Company పాలన పోయి British Raj ఎలా వచ్చింది.? | Hyderabad | ABP Desam
India-Pak partition Days | దేశ విభజన సమయంలో జరిగిన సంఘర్షణలు|ABP Desam
WI vs Pak 3rd ODI Highlights | ఘోరంగా కుప్పకూలిన పాక్..92పరుగులకే ఆలౌట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr.NTR vs TDP Fans: వార్-2 రిలీజ్‌కు ముందు NTR ఫ్యాన్స్ టీడీపీ అభిమానుల మధ్య రచ్చ.. జూనియర్ స్టామినాకు పరీక్ష
వార్-2 రిలీజ్‌కు ముందు NTR ఫ్యాన్స్ టీడీపీ అభిమానుల మధ్య రచ్చ.. జూనియర్ స్టామినాకు పరీక్ష
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌కు 20 సెం.మీ అత్యంత భారీ వర్ష సూచన, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్‌కు 20 సెం.మీ అత్యంత భారీ వర్ష సూచన, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
Andhra Pradesh Investments:  ఏపీవైపు బడా పారిశ్రామికవేత్తల చూపు - కడప, కర్నూలు, కాకినాడల్లో భారీ పెట్టుబడుల ప్రకటన
ఏపీవైపు బడా పారిశ్రామికవేత్తల చూపు - కడప, కర్నూలు, కాకినాడల్లో భారీ పెట్టుబడుల ప్రకటన
Annapurna Studios: అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన  ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...
అన్నపూర్ణ స్డూడియోస్‌కు 50 ఏళ్లు - టాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది వేసిన ఏఎన్నార్... హిస్టరీ ఓసారి చూస్తే...
Tata Power 6000 crore Project in Andhra Pradesh: అనంతపురానికి భారీ పెట్టుబడి -  టాటా , సుజ్లాన్ రూ. 6వేల కోట్ల విండ్ పవర్ ప్రాజెక్టు
అనంతపురానికి భారీ పెట్టుబడి - టాటా , సుజ్లాన్ రూ. 6వేల కోట్ల విండ్ పవర్ ప్రాజెక్టు
Independence Day: ఆగస్టు 15న మాంసం నిషేధంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం, రాజ్యాంగ విరుద్ధమంటూ ట్వీట్
ఆగస్టు 15న మాంసం నిషేధంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం, రాజ్యాంగ విరుద్ధమంటూ ట్వీట్
War 2 Twitter Review: అమెరికాలో ఎన్టీఆర్ 'వార్ 2' ఫస్ట్ షో ఎప్పుడు? USA Premier Show రిపోర్ట్, ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
అమెరికాలో ఎన్టీఆర్ 'వార్ 2' ఫస్ట్ షో ఎప్పుడు? USA Premier Show రిపోర్ట్, ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
Adilabad Crime News: ఎన్నారైని అంటే నమ్మేశారు - పాపం నిండా మునిగారు - పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు
ఎన్నారైని అంటే నమ్మేశారు - పాపం నిండా మునిగారు - పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు
Embed widget