Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో కొత్తగా 5,784 కరోనా కేసులు నమోదుకాగా 252 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 5,784 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 571 రోజుల్లో ఇదే అత్యల్పం. 252 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,995 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. రికవరీ రేటు 98.37%గా ఉంది.
తాజాగా 9,90,482 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యాశాఖ వెల్లడించింది.
252 మరణాల్లో 203 కేరళలో కాగా 12 తమిళనాడులో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. సోమవారం 66,98,601 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,33,88,12,577కు చేరింది.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు నమోదుకాగా రాజస్థాన్ (9), కర్ణాటక (3), గుజరాత్ (4), కేరళ (1), ఆంధ్రప్రదేశ్ (1), ఛండీగఢ్ (1), దిల్లీ (2) ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
డిసెంబర్ 9 వరకు ఉన్న డేటా ప్రకారం మొత్తం 63 దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్
Also Read: ఈ బ్యాంకు హోమ్ , కార్ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets