అన్వేషించండి

Centre on Covid19: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం!

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించనున్నట్లు కేంద్రం తెలిపింది. సుప్రీం కోర్టులో విచారణలో భాగంగా కేంద్రం ఈ మేరకు వెల్లడించింది.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. కరోనా బాధితులకు సేవలు అందిస్తూ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిహారం అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్​డీఎంఏ) సిఫార్సు చేసినట్లు పేర్కొంది. ఈ సహాయం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్​డీఆర్​ఎఫ్​) నుంచి రాష్ట్రాలే చెల్లిస్తాయని స్పష్టం చేసింది.

కొవిడ్​ మృతుల కుటుంబాలకు పరిహారం అంశంపై 6 వారాల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని జూన్ 30న తీర్పులో ఎన్​డీఎంఏను సుప్రీం ఆదేశించింది. ఇటీవల కొవిడ్ మృతిగా ఎప్పుడు నిర్ధరిస్తారనే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

మార్గదర్శకాలు ఇవే..

  1. ఓ వ్యక్తికి కొవిడ్‌ సోకినప్పటికీ విషం తీసుకోవడం వల్ల, ఆత్మహత్యలతో, హత్యకు గురై, రోడ్డుప్రమాదాలతో మరణిస్తే కొవిడ్‌ మరణంగా పరిగణించబోరని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.
  2. ఆర్టీపీసీఆర్, మాలిక్యులర్‌ పరీక్ష, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష లేదా ఆసుపత్రి/వైద్యుడి పర్యవేక్షణలో చేసిన పరీక్షలను కొవిడ్‌ నిర్ధరణకు ప్రామాణికంగా భావిస్తారు.
  3.  కొవిడ్‌ నిర్ధారణైన కేసుల్లో ఆసుపత్రుల్లో లేదా ఇళ్ల వద్ద గానీ మరణిస్తే జనన, మరణ నమోదుచట్టం 1969లోని సెక్షన్‌ 10 ప్రకారం వైద్యపరంగా మరణ ధ్రువీకరణ పత్రం ఫారం 4, ఫారం 4ఏ నమోదు అధికారికి జారీ చేస్తారు. దీన్ని మాత్రమే కొవిడ్‌ మరణంగా పరిగణిస్తారు.
  4. ఆసుపత్రిలో లేదా ఇళ్ల వద్ద చికిత్స పొందుతూ మరణించిన వారి వివరాలను 30 రోజుల్లోపు నమోదు చేయిస్తే కొవిడ్‌ మరణంగా పరిగణిస్తారు.
  5. ఈ కేసుల నిర్ధారణకు అవసరమైతే జిల్లాస్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
  6. బంధువుల దరఖాస్తులు, ఫిర్యాదులను ఈ కమిటీ 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది.

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన అధికారులకు సరైన కొవిడ్ మరణాల నమోదుపై శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. 

Also Read: Ratnam Pens: స్వదేశీ ఉద్యమస్ఫూర్తిని చాటిచెప్పిన కేవీ రత్నం ఫ్యామిలీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Akshaya Tritiya 2025 Date : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
Next Chief Justice: భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
Samantha: సమంతతో అంత వీజీ కాదు... కొత్త రూల్‌తో కోట్లాది రూపాయలు లాస్... ఆ ముగ్గురూ 'నో' అంటే ఇక అంతే!
సమంతతో అంత వీజీ కాదు... కొత్త రూల్‌తో కోట్లాది రూపాయలు లాస్... ఆ ముగ్గురూ 'నో' అంటే ఇక అంతే!
Embed widget