అన్వేషించండి

Fact Check: కాంగ్రెస్ నేతలు హిందువుల ఇళ్లలోకి చొరబడి సంపద దోచుకుంటారని ఖర్గే అన్నారా?

Fact Check: కాంగ్రెస్ నేతలు హిందువుల ఇళ్లలోకి చొరబడి వాళ్ల సంపద దోచుకుంటారని ఖర్గే అంగీకరించారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.

Fact Check: ‘కాంగ్రెస్ సభ్యులు హిందువుల ఇళ్లల్లోకి చొరబడి వారి సంపద మొత్తం ముస్లింలకు పంచుతారు’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్లికార్జున ఖర్గే 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రచార సభలో అన్నట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

Fact Check: కాంగ్రెస్ నేతలు హిందువుల ఇళ్లలోకి చొరబడి సంపద దోచుకుంటారని ఖర్గే అన్నారా?

క్లెయిమ్: ‘కాంగ్రెస్ సభ్యులు హిందువుల ఇళ్లల్లోకి చొరబడి వారి సంపద మొత్తం ముస్లింలకు పంచుతారు’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్లికార్జున ఖర్గే 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రచార సభలో పేర్కొన్నారు. 

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ‘హిస్సేదారీ న్యాయ్’కి (సమానత్వం) సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హిందువుల సంపదను ముస్లింలకు పంచుదామనుకుంటుందని ఖర్గే అన్నట్టు చూపించంచడానికి ఆయన ప్రసంగంలోని కొంత భాగాన్ని డిజిటల్‌గా క్లిప్ చేశారు. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చేయబోదని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

ఈ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ ని ఇంటర్నెట్లో వెతికితే, 4 మే 2024న ఖర్గే అహ్మదాబాద్‌లో చేసిన కాంగ్రెస్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వీడియో లభించింది. ఈ ప్రసంగంలో ఆయన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న వివిధ పాలసీలు, ప్రణాళికల గురించి మాట్లాడారు. అంతేకాక, ఈ వీడియోలో 21:55 సమయం దగ్గర ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతిపాదించిన ‘హిస్సేదారీ న్యాయ్’ (సమానత్వం) అనే అంశం గురించి వివరించడాన్ని చూడవచ్చు. 

Fact Check: కాంగ్రెస్ నేతలు హిందువుల ఇళ్లలోకి చొరబడి సంపద దోచుకుంటారని ఖర్గే అన్నారా?

ఖర్గే ఈ ప్రతిపాదన గురించి వివరిస్తూ వివిధ కులాలు, ఉప కులాల వివరాలతో పాటు వారి అక్షరాస్యత రేటు, ఆదాయ స్థాయి, తలసరి ఆదాయం గురించిన వివరాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ దేశ వ్యాప్త సామాజిక-ఆర్థిక మరియు కుల గణన నిర్వహిస్తుందని తెలిపారు. అంతేకాక, ఈ పథకం గురించి నరేంద్ర మోదీ “కాంగ్రెస్ సభ్యులు మీ ఇళ్లలోకి ప్రవేశిస్తారు, మొత్తం డబ్బును తీసుకొని ముస్లింలతో సహా అందరికీ పంచుతారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎక్కువ వాటా పొందుతారు” అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన ఉపన్యాసంలో ఖర్గే పేర్కొన్నారు. 

మోదీ ఆరోపిస్తున్న పనులను చేయాలని తమకు ఎలాంటి ఉద్దేశం లేదని ఖర్గే వివరించారు. మోదీ ఇలాంటి నిరాధారమైన ప్రచారం చేయడం అన్యాయమని ఆయన అన్నారు. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు బ్రిటిష్, ముఘల్, నిజాం పాలనలో కూడా జరగలేదని, ఇప్పుడు మాత్రం ఎందుకు అవుతుందని అన్నారు. తమ 55 సంవత్సరాల పాలనలో తాము ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశామా అని ప్రశ్నించాడు. ఇలాంటి వాదనలతో మోదీ ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ఖర్గే దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. 

ఆ తర్వాత ఖర్గే తన ప్రసంగంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ఇతర పథకాల గురించి మాట్లాడారు. ఖర్గే చేసిన ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియో చూస్తే, ఖర్గే వైరల్ వీడియోలో చేసిన వ్యాఖ్యలు మోదీ కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలను పేర్కొంటూ అన్నట్టు స్పష్టం అవుతుంది. ఇంతకుముందు కూడా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ ‘సంపద పునఃపంపిణీ’ పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 

చివరగా, మల్లికార్జున ఖర్గే వీడియోని క్లిప్ చేసి ‘కాంగ్రెస్ సభ్యులు హిందువుల ఇళ్లల్లోకి చొరబడి వారి సంపద మొత్తం ముస్లింలకు పంచుతారు’ అని అన్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. 

This story was originally published by factly.in, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget