అన్వేషించండి

Fact Check: రూ.50వేల నగదు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

Fact Check: 50,000 రూపాయల నగదు, మందులను అందుబాటులో ఉంచుకోవాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను కోరుతూ అడ్వైజరీ జారీ చేసిందా? దీనిపై PIB ఫ్యాక్ట్ చెక్ చేసింది.

Fact Check: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇంట్లో అవసరమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని కోరిందని ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ అడ్వైజరీ ప్రకారం, ప్రజలు చేతిలో 50,000 రూపాయల నగదు, రెండు నెలలకు మందులు, అత్యవసర కాంటాక్ట్స్‌, అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలని కేంద్రం చెప్పినట్టు ఉంది. అయితే PIB నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్‌లో అడ్వైజరీలో పేర్కొన్నవి ఫేక్ అని తేలింది. 

Narendra Modi-Led Govt Issued Advisory Asking People To Keep INR 50,000 Cash and Medicines Handy? As Fake 'Advisory' Goes Viral, PIB Fact Check Reveals the Truth

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య చాలా ఫేక్ వార్తలు ప్రజలను గందరగోళపరుస్తున్నాయి. అలాంటి వాటిలో ఈ అడ్వాజరీ కూడా ఒకటి. ఇది నిజం అనుకొని చాలా మంది సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇంట్లో అవసరమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని కోరిందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో పేర్కొన్నట్టు ప్రజలు చేతిలో 50,000 రూపాయల నగదు, రెండు నెలలకు మందులు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్‌, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలనే సలహాలు కేంద్రం నుంచి రాలేదు. 

సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రజలు ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై PIB ఫ్యాక్ట్ చెక్ చేసింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అందులో తేలింది.  "ప్రభుత్వం అలాంటి సలహా ఏదీ జారీ చేయలేదు" అని PIB తెలిపింది. 
ఇదే కాకుండా దేశంలోని ఫోన్‌ కాల్స్ రికార్డు అవుతున్నాయని, వాట్సాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ పోస్టులు కూడా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోయాయనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇది కూడా తప్పుడు ప్రచారమని పీఐబీ వెల్లడించింది. ఇలాంటి నియంత్రణ ఏదీ లేదని తెలిపింది. అయితే తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తే కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడతారని తెలిపింది. పోస్టులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని కూడా సూచించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement
Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget