Trinayani Serial Today September 22nd: 'త్రినయని' సీరియల్: గజగండని తప్పుదోవ పట్టించిన గాయత్రీదేవి.. విశాల్ని చూస్తూ ఎమోషనల్!
Trinayani Today Episode భుజంగమణి దక్కించుకోవడానికి నయనికి మార్గం చెప్పడానికి గాయత్రీ దేవి రావడం గజగండని తిలోత్తమ తీసుకొచ్చి చాటుగా ఇంట్లో పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode విక్రాంత్, సుమన మాట్లాడుకుంటారు. గజగండని చంపేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని సుమన అంటే అలాంటి తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్లలు చనిపోతే పోలీసులు ఏం అనరని విక్రాంత్ అంటాడు. నయని పని అయిపోతుందని నయని చనిపోతుందని సుమన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. దానికి విక్రాంత్ నయనికి ఏం కాదని విక్రాంత్ ఎంత కాలం ఉంటే అంత కాలం బతుకుతుందని చెప్తాడు.
సుమన: మీకు నేను ఓ ఆఫర్ ఇస్తున్నా నా ప్రాణాలను పణం పెట్టే బంపర్ ఆఫర్.
విక్రాంత్: నువ్వేనా ఈ మాట అంటుంది.
సుమన: అవునండీ మీరు మణికాంత ప్రాంతానికి వెళ్లే మార్గం తెలుసుకొని నాకు చెప్పండి నేను వెళ్లి భుజంగమణి తీసుకొస్తా. నేను పోయినా మీకు ఇష్టమే కదా. ఇంతకంటే మంచి మార్గం రాదు. చూసుకోండి.
విక్రాంత్: మరి ఊలూచి సంగతి.
సుమన: మా అక్కకే ఇస్తారో పెద్ద బొట్టమ్మకే ఇస్తారో మీ ఇష్టం. మణికాంత ప్రాంతానికి వెళ్లే మార్గం అయితే తెలుసుకోండి.
విక్రాంత్: నీకు భుజంగమణి కావాలే అందుకే ఇలా మాట్లాడుతున్నావ్.
తిలోత్తమ, వల్లభ మాట్లాడుకుంటారు. గజగండకి భుజంగమణి గురించి నయనితో ఢీల్ పెట్టుకోమని చెప్పింది నువ్వని తెలిస్తే గాయత్రీ పెద్దమ్మ ఊరుకోదు కదా అని అంటాడు. ముందే గాయత్రీ పెద్దమ్మకి క్షమాపణ చెప్పమని అంటాడు. నేను తల దించింతే గాయత్రీ అక్క క్షమించదని చంపేస్తుందని అంత పెద్ద తప్పు చేశానని తిలోత్తమ అంటుంది. నయని భుజంగ మణి దక్కించుకుంటే నయని ఇంటికి తీసుకొస్తే ఆ మణిని మనం తీసుకోవాలని అంటుంది. ఇంట్లో వాళ్లని తన గుప్పెట్లో పెట్టుకొని ఆస్తిని ఒక్క రోజు అయినా అనుభవించాలని తిలోత్తమ అంటుంది.
మరోవైపు నయనిని విశాల్ ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలుస్తాడు. గజగండ దగ్గర పంచకమణి తీసుకోవడం కష్టమని వాడు నిన్ను ఏమైనా చేస్తాడని విశాల్ భయపడతాడు. దానికి నయని భుజంగమణి తీసుకొచ్చేది తానే కాబట్టి తనని ఏమీ చేయడని చెప్తుంది. ఇంతలో గాయత్రీ పాప అక్కడికి వస్తుంది. గాయత్రీ అమ్మగారి ఆత్మ వచ్చిన ప్రతీసారి గాయత్రీ పాప ఉండటం లేదని, అమ్మగారు అందరినీ చూశారు కానీ ఈ పాపని చూడలేదని నయని అంటుంది. దాంతో విశాల్ పొలమారుతాడు. పాప నీళ్లు తీసుకొని వస్తుంది. దానికి నయని పాప మిమల్ని చూసుకుంటుంది నాకు భారం తగ్గించిందని అంటాడు.
ఉదయం గజగండని విశాల్ ఇంటికి తీసికొస్తాడు. తిలోత్తమ గజగండని దాక్కోమని చెప్తుంది. ఇంట్లో అందరూ హాల్లోకి వస్తారు. పెద్దమ్మ వచ్చి ఎప్పుడు భుజంగమణి దక్కించుకొనే మార్గం చెప్తారా అని ఎదురు చూస్తారు. నయని, విశాల్లు గాయత్రీ దేవిని పిలుస్తారు. ఇంతలో ఇంట్లో పెద్ద గాలి వీస్తుంది. వల్లభ మాటల్లో పెద్దమ్మ ఇంకా రాలేదేంటి అమ్మ గజగండకు కూడా కనిపించదు కదా అని అంటాడు. అందరూ షాక్ అవుతారు. గజగండ గురించి ఎందుకని అడుగుతారు. ఇంతలో గాయత్రీ దేవి వస్తుంది.
గజగండ చాటుగా ఉండి గాయత్రీ దేవిని గమనిస్తున్నాడని గ్రహించిన నయని ఇన్డైరెక్ట్గా గాయత్రీ దేవికి ఆ విషయం చెప్తుంది. దాంతో గాయత్రీ దేవి అర్థం చేసుకొని గజగండని తప్పుదోవ పట్టించడానికి తప్పుడు మార్గం చెప్తుంది. పున్నమి రావాలని అప్పటి వరకు వెళ్లొద్దని తిలోత్తమకు చెప్తుంది. ఇక గాయత్రీ దేవి విశాల్ దగ్గరకు వచ్చి నిల్చొంటుంది. చేయి అలా అవ్వడం వల్ల చాలా బాధపడుతున్నా అని అంటే దాన్ని నయని నిన్ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారని చెప్తుంది. ఇక గాయత్రీ దేవి విశాల్ చేతిని పట్టుకొని ముద్దు పెడుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి నిజం చెప్పిన అపూర్వ – గగన్ కాళ్లు పట్టుకున్న నక్షత్ర
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















