![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rangula Ratnam June 20th: ఆఫీసులో అడుగుపెట్టిన రోజే చుక్కలు చూపిస్తున్న రేఖ.. రఘు చెప్పిన నిజానికి షాకైన పూర్ణ?
చైర్ పర్సన్ గా అడుగుపెట్టిన తొలిరోజే రేఖ బాగా రెచ్చిపోవటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Rangula Ratnam June 20th: ఆఫీసులో అడుగుపెట్టిన రోజే చుక్కలు చూపిస్తున్న రేఖ.. రఘు చెప్పిన నిజానికి షాకైన పూర్ణ? Purna shocked after knowing truth by raghu in Rangula Ratnam June 20th serial episode Rangula Ratnam June 20th: ఆఫీసులో అడుగుపెట్టిన రోజే చుక్కలు చూపిస్తున్న రేఖ.. రఘు చెప్పిన నిజానికి షాకైన పూర్ణ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/20/4e42e41cf4032d98a5f45d5090e1df121687246344675768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rangula Ratnam June 20th: జానకి తన అన్న శంకర్ ప్రవర్తన పట్ల తన భర్తతో కోపంగా చెబుతూ ఉంటుంది. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడో అని.. వదినను చాలా బాధ పెడుతున్నాడు అని చెబుతుంది. ఇక జానకి భర్త కూడా శంకర్ ముందు ఇలా లేకుండే అని.. ఎప్పుడైతే రేఖ తన జీవితంలోకి వచ్చిందో అప్పటినుంచి తనలో మార్పు వచ్చిందని అంటాడు. మరి అన్నయ్య మరి అవకాశం లేదా అని జానకి అడగటంతో.. చెప్పలేం ఎప్పుడైనా రేఖ నుంచి పొరపాటు వస్తే స్వయంగా రేఖ మెడపట్టి బయటికి గెంటేస్తాడు అని అంటాడు.
ఇక స్వప్న సిద్దు కోసం ఎదురు చూస్తూ ఉండగా.. సిద్దు రావటంతో జరిగిన విషయం మొత్తం చెబుతుంది. మామయ్య రేఖకు ఖాళీ బాండ్ పేపర్ ఇచ్చి సంతకం చేసుకోమని చెప్పటంతో సిద్దు కోపంతో రగిలి వెంటనే తండ్రిని అడగాలని అనుకుంటాడు. కానీ స్వప్న అడగాల్సింది మామయ్యను కాదు రేఖను అడగాలి.. ఎందుకంటే ఆఫీసులో ఏదో జరిగింది అని మామయ్య ముందు నటిస్తూ ఏడ్చిందంటూ.. ఎందుకు చేసావో అడిగి ఆ డాక్యుమెంట్స్ తీసుకోమని చెప్పి సిద్దును పంపిస్తుంది.
తర్వాత స్వప్న నీ నాటకాలు మామయ్య దగ్గర చదువుతాయేమో కానీ మా ఆయన దగ్గర కాదు అని పొగరుగా అనుకుంటుంది. సిద్దు రేఖ దగ్గరికి వెళ్లి ఎందుకు డాక్యుమెంట్స్ పేపర్స్ తీసుకున్నావు అంటూ కోపంతో ప్రశ్నిస్తాడు. వెంటనే రేఖ అవి నేను తీసుకోలేదని మీ నాన్నగారు ఇచ్చారు అని అనటంతో.. అప్పుడు మా నాన్నతో నాకెందుకు సిద్దుకి ఇవ్వాల్సింది అని ఎందుకు అనలేదు అని అంటాడు.
దాంతో రేఖ నువ్వు మీ నాన్నకి ఒక్కడివే కాదు మరో ఇద్దరు ఉన్నారు. ఒకవేళ మీ నాన్న డాక్యుమెంట్ ఇవ్వాలంటే ముందుగా రఘు కే ఇవ్వాలి. అదే నా చేతిలో వచ్చింది కాబట్టి కొన్ని రోజులు నేను చైర్మెన్గా ఉండి ఆ తర్వాత ఆ చైర్మన్ బాధ్యతలు నీకు అప్పచెప్పుతాను అని అంటుంది. దాంతో సిద్ధూ కూల్ అయ్యి.. ఇదంతా నాటకం అని తెలిస్తే అసలు ఊరుకోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇదే విషయాన్ని సిద్దు స్వప్నతో చెప్పి వెళ్లిపోగా స్వప్న సిద్దు కి రేఖ గురించి అసలు తెలియదని.. తన తెలివి తక్కువతనంతో తనను గుడ్డిగా నమ్మాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత రేఖ ఆఫీస్ కి వెళ్లి ఈ సామ్రాజ్యానికి మహారాణిని నేనే అంటూ పొగరుగా నవ్వుకుంటుంది. లోపలికి వచ్చాక అటెండర్ గుడ్ మార్నింగ్ చెప్పలేకపోయేసరికి లాగి చెంపదెబ్బ కొట్టడంతో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ చెబుతారు.
ఇక క్యాబిన్ లోకి వెళ్లి కూర్చుని చూసి మురిసిపోతుంది. గతంలో పూర్ణ అన్న మాటలు తలుచుకొని మీ ఫ్యామిలీని రోడ్డుకి వేస్తాను అని అనుకుంటుంది. ఇక ఈ శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నేనే చైర్ పర్సన్ అని నవ్వుకుంటుంది. ఇక మూర్తి వచ్చి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నెక్స్ట్ చైర్మన్ ఎంచుకోవడానికి చర్చ చేస్తున్నారు అని తనని తీసుకొని వెళ్తాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంత తమలో ఎవరైనా ఒకరు చైర్మన్ గా ఉండటానికి ఓట్స్ వేసుకోవాలని అనుకోగా.. అప్పుడే అక్కడికి రేఖ రావటంతో వాళ్లంతా ఫైర్ అవుతూ ఉంటారు.
అదే సమయంలో సిద్దు వచ్చి తనే చైర్పర్సన్ అని చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. ఆమె మాటలను అసలు జీర్ణించుకోలేకపోతారు. అంతేకాకుండా తను ఒక ఐడియా చెప్పడంతో వాళ్ళు ఏమి అనకుండా సైలెంట్ గా ఉంటారు. ఇక సీత కూరగాయలు కట్ చేస్తూ ఉండగా పూర్ణ వచ్చి తనకు ఖాళీగా ఉంటే అన్ని గుర్తుకొస్తున్నాయని తీసుకొని కూరగాయలు కట్ చేసింది. అదే సమయంలో రఘు వచ్చి రేఖ చైర్పర్సన్ గా ఉందన్న తెలిసిందని చెప్పటంతో వాళ్ళు షాక్ అవుతారు.
Also Read: Krishnamma kalipindi iddarini June 20th: సునంద మనసు బాధ పెట్టిన గౌరీ-పెద్ద ప్లాన్ వేసిన అఖిల?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)