అన్వేషించండి
Lakshimi Raave Maa Intiki Serial Today March 27th: శ్రీలక్ష్మీపై ప్రియంవద ఎందుకు చేయిచేసుకుంది..? శ్రీరామనవమి వేడుకల్లో ఏం జరిగింది..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 27th: శ్రీలక్ష్మీపై ప్రియంవద ఎందుకు చేయిచేసుకుంది..? శ్రీరామనవమి వేడుకల్లో ఏం జరిగింది..?

లక్ష్మీ రావే మా ఇంటికి టుడే ఏపిసోడ్
Source : Jio Hotstar/ Star Maa.com
Lakshimi Raave Maa Intiki Serial Today Episode: అందరూ భోజనాలకు కూర్చోగా...ప్రియంవద చెట్నీ కావాలని అడగటంతో ఇవాళ చెట్నీ చేయలేదని తల్లి ఇందిర చెబుతుంది. ఇంతలో శ్రీలక్ష్మీ తమ కూరలు తీసుకెళ్లి డ్రైవర్ రామయ్యకు ఇచ్చి అతను తినే చెట్నీ తీసుకుని వస్తుంది. అది ప్రియంవదకు వడ్డించగా....చాలా బాగుందని అందరూ తినమని చెబుతుంది. నేనంటే ఆ మాత్రం భయం ఉండాలని...చెప్పిన వెంటనే వెళ్లి చెట్నీ చేసుకుని తీసుకొచ్చిందని ప్రియంవద అనుకుంటుంది.
ఇంతలో అందరూ చెట్నీ బాగుందని తింటారు. ఇంకా కొంచెం చెట్నీ వేయమని ప్రియంవద కోరగా...అయిపోయిందని శ్రీలక్ష్మీ చెబుతుంది.అదేంటీ ఇప్పుడే కదా చేశావ్ అప్పడే ఎలా అయిపోయిందని అంటుంది. అది మన చెట్నీ కాదని....డ్రైవర్ రాములను అడిగి తీసుకొచ్చానని చెప్పడంతో అందరూ తినే అన్నం ఊసేస్తారు. మ్యాడీ ఛీ అంటూ పక్కకు విసిరేస్తాడు. వాళ్ల ప్రవర్తన చూసి శ్రీలక్ష్మీకి ఆశ్చర్యమేస్తుంది.
ఇంతలోనే ప్రియంవద కోపంతో శ్రీలక్ష్మీ చెంప పగులగొడుతుంది. అది చూసిన సూర్యనారయణ కూతురు చెంప చెల్లుమనిపిస్తాడు.తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను కొడతారేంటి నాన్న అని ప్రియంవద ప్రశ్నిస్తుంది.
ఇన్నాళ్లు మన దగ్గర పనిచేస్తున్న వాచ్మెన్,డ్రైవర్ ఏం తింటున్నారో కూడా మనం పట్టించుకోలేదని...అలాంటిది ప్రియంవద వాళ్లకు మన కూరలు ఇచ్చి మన గౌరవం పెంచితే...తనమీదే చేయిచేసుకుంటావా అని మండిపడతాడు. వాళ్లు తెచ్చుకున్న కూరలు మనం తింటే తప్పేంటని ప్రశ్నిస్తాడు.ముందు మనుషులను మనుషులుగా చూడటం నేర్చుకోమని కూతురిని హెచ్చరిస్తాడు.
మర్యాదగా చేసిన తప్పునకు శ్రీలక్ష్మీని క్షమాపణలు అడగమని అంటాడు.ఆ మాటలకు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీలక్ష్మీ కూడా అమ్మగారు ఏ తప్పు చేయలేదని...వదిలేయమని వేడుకుంటుంది. కానీ సూర్యనారాయణ ఒప్పుకోడు.ఇప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పకపోతే...శ్రీలక్ష్మీతోనే నిన్ను కొట్టిస్తానని అనడంతో చేసేదిలేక ప్రియంవద సారీ చెబుతుంది. శ్రీలక్ష్మీ చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న ప్రియంవద వద్దకు వచ్చి శ్రీలక్ష్మీ చెట్నీ సంగతి మర్చిపొమ్మని చెబుతుంది.
మన దగ్గర పనిచేసే వాళ్లు కూడా మనుషులేనని చెబుతుంది.ఆ మాటలకు ప్రియంవదకు మరింత కోపం వస్తుంది. రేపు శ్రీరామనవమికి గుడికి వెళ్లాలని రెడీగా ఉండమని పెద్దయ్యగారు చెప్పారని చెప్పి వెళ్లిపోతుంది.
రేపు గుడిలో అందరిముందు ఆ శ్రీలక్ష్మీకి తగిన బుద్దిచెప్పాలని ప్రియంవద అనుకుంటుది. శ్రీరామనవమి సందర్భంగా ఇంటిల్లపాది గుడికి వెళ్తారు.అక్కడ పంతులుగారు శ్రీరాముడి, సీతాదేవి గొప్పతనం వివరించి...రామకోటి రాస్తే వచ్చే ప్రయోజనాలు గురించి, పూజలు చేస్తే కలిగి ఫలితాల గురించి చెబుతారు. అప్పుడు అక్కిడి త్రిష కూడా వస్తుంది.
ఇంతలో రాములోరి కల్యాణానికి సమయం అవుతుండటంతో పంతులుగారు సీతారాముల విగ్రహాలు తీసుకురావాల్సిందిగా కోరగా....సూర్యనారాయణ శ్రీలక్ష్మీ, మధుసూదన్ను పిలుస్తాడు.వారిద్దరూ చెరోవైపు నుంచి సీతారాముల విగ్రహాలను తీసుకుని వస్తుంటారు. కారుతో గుద్దినా శ్రీలక్ష్మీ చనిపోకపోవడంతో త్రిష కోపంతో రగిలిపోతుంటుంది. దీనికి ఎలాగైన బుద్ది చెప్పాలని అనుకుంటూ....టెంకాయచిప్ప శ్రీలక్ష్మీ వస్తున్న దారిలో పడేస్తుంది.అది చూసుకోకుండా దానిపై కాలువేసి పడిపోబోతున్న శ్రీలక్ష్మీని మ్యాడీ పట్టుకుంటాడు. దీంతో త్రిషతోపాటు ప్రియంవద కూడా చాా బాదపడుతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















