అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 17th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యతో దీప దగ్గరకు వెళ్లిన కార్తీక్, మాటలతో ఏడిపించేసిన చిన్నారి.. జ్యోత్స్న ఎలా అర్థం చేసుకుంటుందో!

Karthika Deepam 2 Serial Episode శౌర్యని చూసిన కడియం కార్తీక్‌కి కాల్ చేసి రమ్మనడం జ్యోత్స్న కార్తీక్‌, శౌర్యలను ఫాలో అయి దీప ఇంటి వరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య ఒంటరిగా రోడ్డు మీద కార్తీక్ కార్తీక్ అనుకుంటూ నడుస్తుంటే కడియం శౌర్యని చూస్తాడు. దగ్గరకు వెళ్తాడు. కార్తీక్ కోసం అమ్మకు చెప్పకుండా వచ్చానని శౌర్య అంటుంది. కడియం ఇంటికి వెళ్దామంటే కార్తీక్ దగ్గరకు వెళ్తా రాను అని చెప్తుంది.  

కడియం: మీ అమ్మకు చెప్పకుండా రావడం తప్పు కదా. నీకు కార్తీక్ బాబు ఇళ్లు తెలుసా.
శౌర్య: తెలిస్తే ఇక్కడెందుకు ఏడుస్తూ ఉంటాను. ఇంటికే వెళ్తాను కదా.
కడియం: ముందు మనం అమ్మ దగ్గరకు వెళ్దాం. తర్వాత అమ్మ కార్తీక్ బాబు దగ్గరకు తీసుకెళ్తుంది.
శౌర్య: నేను రాను నేను ముందు కార్తీక్‌ని చూడాలి. కార్తీక్‌తో మాట్లాడకుండా నేనే రాను.

కార్తీక్: అత్త ఇంకా రాలేదు ఏంటి. ఇప్పటికే చాలా లేటు చేశా. ఈ రోజు ఎలా అయినా అత్తతో మాట్లాడే వెళ్లాలి. 
జ్యోత్స్న: బావ నీ ప్రాబ్లమ్ ఏంటి. నేను గార్డెన్‌లో ఉంటే లోపల వెయిట్ చేస్తా అంటావ్. నీతో టైం స్పెండ్ చేయాలని నా ఫ్రెండ్స్‌ని పంపించి వస్తే నువ్వు గార్డెన్‌లో వెయిట్ చేస్తా అంటావ్. వచ్చే గురువారం మనకు నిశ్చితార్థం మనకు తెలుసా నీకు. ఎవరికైనా పెళ్లి ఫిక్స్ అయితే వాళ్ల మధ్య చనువు ఎలా ఉంటుంది. కలిసి బయటకు వెళ్తారు. నువ్వు కాఫీ కూడా షేర్ చేసుకోవడానికి రెడీగా లేవు. ఏంటి బావ నీ ప్రాబ్లమ్.
కార్తీక్: నాకు అలాంటివి నచ్చవు అని నీకు తెలుసు కదా.  
జ్యోత్స్న: నీ జీవితం గురించి అమ్మతో మాట్లాడాలి అన్నావ్ అదేంటో చెప్పు.
కార్తీక్: అత్తతోనే చెప్తా.
జ్యోత్స్న: నాతో చెప్పకూడదా.
కార్తీక్: ముందు అత్తతోనే చెప్తా.
జ్యోత్స్న: బావ నేను నీకు కాబోయే భార్యని అందరి కంటే నేనే నీకు ఎక్కువ.  నాతో చెప్పు. ఇప్పుడు చెప్పకపోతే నా మీద ఒట్టే. నేను చచ్చినంత ఒట్టు. నువ్వు నీ మనసులో ఏముందో ఇప్పుడు నాకు చెప్పాల్సిందే.
కార్తీక్: మనసులో..ఇంత దూరం వచ్చిన తర్వాత ఆలోచించడం ఎందుకు తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని జ్యోత్స్నతోనే చెప్పేస్తా. ఇప్పుడు బాధ పడితా తర్వాత కన్విన్స్ చేయొచ్చు.

ఇంతలో కార్తీక్‌కి కడియం నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పుడే వస్తాను అని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. జ్యోత్స్న కూడా కార్తీక్‌ని ఫాలో అవుతుంది. కార్తీక్ శౌర్య, కడియంల దగ్గరకు వెళ్తాడు. కార్తీక్‌ని చూసి శౌర్య ఎమోషనల్ అవుతుంది. నన్ను ఎందుకు వదిలేశావని నీ కోసం వెతుక్కుంటూ వస్తే దారిలో బూచోడు కనిపించాడని చెప్తుంది. ఇక కార్తీక్ ఇలా బయటకు రాకూడదని అమ్మ కంగారు పడుతుంది వెళ్తామని అంటాడు. కడియానికి నీకు దీప ఇళ్లు తెలుసా అంటే తెలుసు అంటాడు. దాంతో కార్తీక్ గతంలో కడియానికి దీప గురించి అడిగితే తెలీదు అనడం గుర్తు చేసుకుంటాడు. వెంటనే కడియం మాట మార్చేస్తాడు. దాంతో శౌర్య నువ్వే కదా తాత మమల్ని ఇంటికి తీసుకెళ్లావ్ అంటుంది. దాంతో కార్తీక్ కడియం నువ్వు చేసింది తప్పే అంటాడు. ఇక కార్తీక్ కడియం, శౌర్యలను తీసుకొని బయల్దేరుతాడు. దీప దగ్గరకే వెళ్తున్నారని జ్యోత్స్న కార్తీక్ కారుని ఫాలో అవుతుంది. 

నర్శింహ: అది దొరికినట్టే దొరికి తప్పించుకుందే. లేదంటే ఈ రోజే ఇంటికి తీసుకొచ్చేదాన్ని. 
శోభ: నాకు నీ మాటల మీద నీ మీద నమ్మకం లేదు.
అనసూయ: అయితే నువ్వు వెళ్లు. అన్నింటికి ఆవేశం పడకు.
శోభ: నాకు ఎందుకు ఈ గొడవ మా పిన్ని గారి మనవరాల్ని తెచ్చుకొని పెంచుకుంటా.
అనసూయ: మీ పిన్ని గారి మనవరాలు వరసకు కూతురు అవుతుంది కానీ సొంత కూతురు కాదుగా. నీ వాలకం చూస్తుంటే సవతి కూతురు వద్దు అనుకున్నట్లుంది. దీప కూతుర్ని నీ కూతురిగా పెంచగలవా.
శోభ: ముందు అయ్యగారిని ఆ యువరాణిని తీసుకురమ్మనండి ఎలా పెంచుతానో పెంచి చూపిస్తా.
నర్శింహ: నా బిడ్డను నేను తీసుకొస్తాలే.
శోభ: అత్తయ్య ఆ పిల్ల ఈయన్ని చూసి భయపడింది కదా ఆ విషయం తన తల్లికి చెప్తుంది.
అనసూయ: ఎందుకు చెప్పదు చెప్పే ఉంటుంది.

దీప శౌర్యని మొత్తం వెతికి ఇంటికి వెళ్తుంది. నర్శింహ ఎత్తుకుపోయింటాడా. కార్తీక్ కోసం తిప్పలు పడుతుందా అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ కారు దీప ఇంటి దగ్గర ఆగుతుంది. జ్యోత్స్న కూడా కార్తీక్‌ని ఫాలో అయి దీప ఉన్న ఇంటి దగ్గరకు వస్తుంది. దీప శౌర్యని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. అడ్రస్ చెప్పినందుకు ఏమీ అనొద్దని కడియం చెప్పి వెళ్లిపోతాడు. ఇక దీప శౌర్యకి వాటర్ తాగిస్తుంది. కార్తీక్ లోపలికి వెళ్తాడు. అక్కడ కార్తీక్ గోడ మీద తన పేరు చూస్తాడు. నువ్వు నాతో లేవని నీ పేరు రాసుకున్నా అని శౌర్య కార్తీక్‌కి చెప్తుంది. ఇక కార్తీక్ శౌర్యని పడుకోమని అమ్మతో మాట్లాడుతానని అంటాడు. దీప పాపని పడుకోపెడుతుంది. కార్తీక్ దగ్గరకు వస్తుంది. ఏమైందని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: వియ్యంకుడి కోసం దిగొచ్చిన మహదేవయ్య.. కాళీని హత్య చేసింది విశ్వనాథం కాదా, క్రిష్ మాటల అర్థమేంటి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget