అన్వేషించండి

Jagadhatri Serial Today March 23th: మీనన్‌ గుట్టు బయటకు తీయడానికి జేడీ వేసిన ప్లాన్ ఏంటి..? కౌషికి షేర్లు నిషక వాళ్ల పేరిట రాసిందా..? లేదా..?

Jagadhatri Serial Today Episode March 23th: మీనన్‌ గుట్టు బయటకు తీయడానికి జేడీ వేసిన ప్లాన్ ఏంటి..? కౌషికి షేర్లు నిషక వాళ్ల పేరిట రాసిందా..? లేదా..?

Jagadhatri Serial Today Episode: కౌషికి భూమి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా...కమలాకర్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో భూమి కొనుగోలు చేసేవాళ్లు కుదరదని చెబుతారు. ఇంట్లో అందరూ సంతకాలు పెడితేనే ఈ భూమి కొనుగోలు చేస్తామని అంటారు. దీంతో చేసేది లేక కౌషికి వాళ్లను వెళ్లిపొమ్మని చెబుతుంది. దీంతో వైజయంతి,నిషిక, యువరాజు ఆనందంగా తమ గదికి వెళ్లిపోతారు. ఇదంతా నిషిక వాళ్ల ప్లాన్‌ అని అనుమానంగా ఉందని కేదార్ అనగా...ఈ వ్యవహారం నిషికకు తెలియదని ధాత్రి అంటుంది. 
 
తమ రూమ్‌లోకి వెళ్లగానే వైజయంతి అసలు విషయం చెబుతుంది. మీ బాబాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని చెప్పింది తానేనని అంటుంది. కమలాకర్‌ను రాత్రి కలిసి నేనే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్పానని అంటుంది. నువ్వు లేకుంటే సంతకం పెట్టేవాళ్లు లేక వాళ్లు భూమిని కొనుగోలు చేయరని...అప్పుడు కౌషికి ఓడిపోయి కంపెనీ మన పేరిట వస్తుందని అనడంతో కమలాకర్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. తల్లి తెలివితేటలకు యువరాజు ఆమెను మెచ్చుకుంటాడు. ఇక ఈ కంపెనీకి నువ్వు సీఈవో కాకుండా ఆపే దమ్ము ఎవరికీ లేదని వైజయంతి కొడుకుని చూసి మురిసిపోతుంది.
     
మీనన్ బతికే ఉన్నాడన్న విషయం డిపార్ట్‌మెంట్‌లో కూడా ఎవరికీ చెప్పొద్దన్నవ్...ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావని సాధూసార్ జేడీని అడుగుతాడు. మీనన్‌ను కాల్చింది నేనే, చచ్చిపోయాడని ప్రెస్‌కు చెప్పింది కూడా మనమేనని జేడీ అంటుంది. ఇప్పుడు మీనన్ బతికే ఉన్నాడని మనం చెబితే ప్రజలు నమ్మరని...అదే మీనన్ ధైర్యమని జేడీ అంటుంది. మనతోనే వాడు చచ్చిపోయాడని చెప్పించి... ఇప్పుడు చీకటిలో ఉండి తప్పుడు పనులు చేయాలని చూస్తున్నాడని అంటుంది. 
 
కాబట్టి వాడిని చీకటిలో నుంచి వెలుగులోకి వాడంతట వాడే వచ్చేలా చేయాలని అంటుంది. దీనికి ఏం చేద్దామంటే ఆపరేషన్ డ్రాగన్ చేపడదామని చెబుతుంది. ఈ ధనలక్ష్మీ అనే లేడీ దొంగను మనం బయటకు విడుదల చేసి మీనన్ భార్యగా చెలామణి అయ్యేలా చేద్దామని చెబుతుంది. అండర్‌వరల్డ్ డాన్‌ అవుదామని కలలుకని చిన్నచిన్న దొంగతనాలు చేసి పోలీసులకు దొరికిపోవడం ఈ డ్రాగన్‌ స్టైల్‌ అని అంటుంది. ఈవిడను  బయటకు వదిలి మీనన్ భార్యగా ప్రచారం చేస్తే...అది తట్టుకోలేక మీనన్ బయటకు వచ్చేస్తాడని జేడీ చెప్పడంతో సాధూ సరేనంటాడు.
 
అనుకున్న సమయానికి డబ్బులు కట్టకపోవడంతో తమ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారు ఢీల్‌ క్యాన్సిల్ చేస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పడంతో కౌషికి చాలా బాధపడుతుంది.ఆ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే 50కోట్లు పెట్టుబడి పెట్టామని...అలా మధ్యలో ఎలా వదిలేస్తారని కౌషికి అంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన నిషిక.....నువ్వు కంపెనీ నడిపేస్థితిలో లేవని అనడంతో ధాత్రి అక్కడికి వచ్చి నిషికను మందలిస్తుంది.ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ హోదా మొత్తం వదిన కష్టార్జితమని చెబుతుంది. అయినాగానీ ఇలా కంపెనీకి నష్టాలు తెస్తుంటే రేపు మా పరిస్థితి ఏంటని నిషిక నిలదీస్తుంది. అందుకే కంపెనీలో సగం షేర్లు మా పేరిట రాయమని కోరుతుంది. మాకు కూడా ధైర్యంగా ఉంటుందని చెబుతుంది. 
 
ఇంతలో వైజయంతి కలుగజేసుకుని ఈ ఢీల్ క్యాన్సిల్ అయితే కంపెనీలో సగం షేర్లు రాసిస్తానని మాటిచ్చావు కదా అని గుర్తుచేస్తుంది. దీంతో చేసేదిలేక కంపెనీ షేర్లు రాయడానికి కౌషికి ఒప్పుకుంటుంది. వాళ్లు పేపర్లు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో జగధాత్రి కౌషికి వారిస్తుంది. ఇప్పుడు సగం షేర్లు వారి పేరిట రాశామంటే....రేపు సీఈవోను కూడా మార్చాలని పట్టుబడతారని అంటుంది. ఏదీఏమైనా నేను ఇచ్చిన మాట తప్పనని కౌషికి అంటుంది.అయితే ఒక కండీషన్ పెట్టమని జగధాత్రి సూచిస్తుంది. ఈ షేర్లు వాళ్ల భయం పోగొట్టడానికే తప్ప...అమ్మడానికి వీళ్లేదని చెప్పమని చెబుతుంది. దీంతో సగం షేర్లు నిషిక వాళ్ల పేరిట రాసిన కౌషికి....వాటిని అమ్మడానికి వీళ్లేదని మెలిక పెట్టడంతో నిషిక మండిపడుతుంది. ఇదంతా జగధాత్రి కుట్రేనని కోపంతో రగిలిపోతుంది. అమ్మడానికి వీళ్లేని షేర్లు మాకు  ఎందుకని అడగ్గా....ఇది కేవలం మీ సెక్యూరిటీ కోసమేనని చెబుతుంది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today March 23th: మీనన్‌ గుట్టు బయటకు తీయడానికి జేడీ వేసిన ప్లాన్ ఏంటి..? కౌషికి షేర్లు నిషక వాళ్ల పేరిట రాసిందా..? లేదా..?
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ గుట్టు బయటకు తీయడానికి జేడీ వేసిన ప్లాన్ ఏంటి..? కౌషికి షేర్లు నిషక వాళ్ల పేరిట రాసిందా..? లేదా..?
kalavari kodalu kanaka mahalakshmi serial today march 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కండీషన్ సీరియస్! భుజంగాన్ని చూసేసిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కండీషన్ సీరియస్! భుజంగాన్ని చూసేసిన లక్ష్మీ!
Nindu Noorella Saavasam Serial Today march 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ కు సలహాలు ఇచ్చిన రాథోడ్‌ - లాల్‌ సింగ్‌ ముందు నటించిన భాగీ 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ కు సలహాలు ఇచ్చిన రాథోడ్‌ - లాల్‌ సింగ్‌ ముందు నటించిన భాగీ 
Brahmamudi Serial Today March 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు అపర్ణను రెచ్చగొట్టిన రేఖ, భ్రమరాంబ – అపర్ణను ఓదార్చిన ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు అపర్ణను రెచ్చగొట్టిన రేఖ, భ్రమరాంబ – అపర్ణను ఓదార్చిన ఇందు
Advertisement

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget