అన్వేషించండి
Jagadhatri Serial Today March 20th: కౌషికి భూమి అమ్మకుండా వైజయంతి వేసిన ప్లాన్ ఏంటి..? ఉన్నట్లుండీ కమలాకర్ మాయమవ్వడానికి కారణమేంటి..?
Jagadhatri Serial Today Episode March 20th: జగధాత్రిని కాపాడబోయి ప్రాణాలు వదిలిన రాగిణి....మీనన్కు జేడీ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?

జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్
Source : Jio Hotstar/ Star Maa.com
Jagadhatri Serial Today Episode: రాగిణి అంత్యక్రియల్లో ఉండగానే సాధూసార్ జేడీకి ఫోన్ చేస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. ఆ కరుడుగట్టిన రాక్షసుడు మీనన్ బతికే ఉన్నాడని జేడీ చెబుతుంది. ఆ మాటలు విన్న సాధూ షాక్ తింటాడు. ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిసిందంటే...ప్రజలతోపాటు డిపార్ట్మెంట్ మొత్తం మనల్ని చూసి నవ్వుకుంటుందని...ఇంతకు మించిన అవమానం ఇంకొకటి ఉండదని సాధూ అంటాడు.ఆ మీనన్ను చంపేసినందుకు మెచ్చుకున్న వారే రేపు మన ముఖం పట్టుకుని నిలదీస్తారని అంటాడు.అందుకే మీనన్ బతికి ఉన్నాడన్న నిజం ఎవరిక చెప్పొద్దని జేడీ అంటుంది. వీలైనంత త్వరగానే వాడి ఫైల్ క్లోజ్ చేద్దామని అంటుంది.ఆల్రెడీ వాడు చచ్చిపోయాడని ఫైల్ క్లోజ్ చేశామని...ఇప్పుడు డిపార్ట్మెంట్కు ఏం సమాధానం చెబుదామని అంటాడు. రాగిణిని చంపింది మీనన్ కాబట్టి ఇప్పుడు ఆ కేసులో ఏం రాద్దామని అంటాడు. మీనన్ పేరు కాకుండా మీనన్ మనుషులు చంపారని కేసు ఫైల్ చేద్దామని జేడీ అంటుంది. ఇవాళ కాకపోయినా....రేపు వాడు మళ్లీ దందా మొదలుపెట్టినప్పుడు అందరికీ తెలిసిపోతుందని సాధూ అంటాడు. వీలైనంత వరకు వాడు మళ్లీ క్రిమినల్ యాక్టివిటీస్ మొదలుపెట్టకముందే వాడిని పట్టుకోవాలని చెబుతాడు.
తల్లి చనిపోయిందని యామినీ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అమ్మానాన్న ఇద్దరినీ పోగొట్టుకుని ఇప్పుడు అనాథగా మిగిలానని ఏడుస్తుంది. ఇక నాకు దిక్కు ఎవరని బాధపడుతుంది. యామిని బాధ చూసిన కౌషికి..దీనంతటికీ తానే కారణమని బాధపడుతుంది.మీనన్ అడిగినప్పుడు ఆ పెన్డ్రైవ్ ఇచ్చి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదని సుధాకర్ బాబాయితో అంటుంది.ఇవాళ యామిని అనాథగా మారడానికి తానే కారణమని అంటుంది. నిజనిజాలు తెలుసుకోకుండా నువ్వు బాధపడొద్దని సుధాకర్ అంటాడు. పోలీసులు మీనన్ మనుషుుల చంపారని అని చెబుతున్నా....రాగిణి పిన్నిని చంపింది మీనన్ అని నీకు, నాకు తెలుసు కదా అని అంటుంది. నిజంగా మీనన్ బతికే ఉంటే ఆ విషయం పోలీసులు చూసుకుంటారని చెప్పి సుధాకర్ ఆమెను ఓదార్చుతాడు. మరోవైపు యామిని అనాథ అవ్వడానికి తానే కారణమని జగధాత్రి బాధపడుతుంటుంది.నా వల్లే తన తల్లి చనిపోయిందని తెలిసిననాడు యామినికి ఏం చెప్పాలని ధాత్రి అంటంది. నిజంగా ఆ విషయంచెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పకుండానే యామిని అర్థం చేసుకుంటుందని నువ్వు దాని గురించి బాధపడవద్దని కేదార్ అంటాడు.అసలు పిన్నికి నేను జేడీ అని తెలియకపోయి ఉంటే బాగుండేదని...అక్కడికి వచ్చేది కాదని జగధాత్రి బాధపడుతుంది.అటు నిషిక కూడా తన అత్తయ్య చనిపోవడంతో చాలా బాధపడుతుంది.తనను సొంత కూతురిలా పెంచిందని అంటుంది.ఇంతలో యువరాజు కలుగజేసుకుని అసలు పిన్ని అక్కడికి ఎందుకు వెళ్లిందని అంటాడు. పోలీసులకు,మీనన్ మనుషులు కాల్పులు జరుగుతుంటే రాగిణి పిన్నికి అక్కడ ఏం పని అని ఎవరి కోసం అక్కడికి వెళ్లిందని యువరాజు అంటాడు. అవన్నీ మనకు ఎందుకులేరా ఆమె చావు అక్కడ రాసిపెట్టి ఉందని వైజయంతి అంటుంది.
ఇంతలో ఎవరో వస్తుంటే కేదార్ ఎవరని అడగ్గా....నేను రమ్మన్నానని కౌషికి అంటుంది. భూమి అమ్మి ఆ డబ్బులతో ఢీల్ సెట్ చేయాలి కదా అని అంటుంది.ఇంత గొడవలోనూ అక్క భూమి అమ్మకం గురించి ఆలోచించిందంటే చాలా గ్రేట్ అని యువరాజు అంటాడు. భూమి పత్రాలపై అందరూ సంతకాలు పెట్టగా....కేదార్ను కూడా పెట్టమని జగధాత్రి అంటుంది. దీనికి యువరాజు అభ్యంతరం చెబుతాడు. రేపు మేం చెప్పింది నిజమని తేలితే....ఆ భూమి కొన్నవాళ్లు నష్టపోకూడదు కదా అని ధాత్రి అంటుంది. అయినా సరే వారసులు మాత్రమే సంతకాలు పెట్టాలని యువరాజు పట్టుబడతాడు. ఇంతలో వైజయంతి కలుగజేసుకుని కమలాకర్ సంతకం పెట్టకపోతే ఈ భూమి అమ్మకం కుదరదు కదా అంంటుంది. అతను పొద్దున్నే ఎక్కడకో చెప్పకుండా వెళ్లిపోయాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు.
ఇంకా చదవండి
Advertisement
























