అన్వేషించండి

Ennallo Vechina Hrudayam Serial Today April 29th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సాక్షిని బెదిరించిన ఫణి.. త్రిపురని తప్పుగా అర్థం చేసుకున్న ఫ్యామిలీ!

Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర, బాల నర్శింగి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లడం ఫణి అతన్ని బెదిరించి అతని భార్యతో నర్శింగి చనిపోయాడని చెప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలకృష్ణ, త్రిపుర పోలీస్ స్టేషన్‌లో బాల తాతయ్య కేసు ఫైల్ కోసం వెతుకుతూ ఉంటారు. త్రిపురకు ఆ ఫైల్ దొరుకుతుంది. అది చూసిన బాల తల పట్టుకొని ఇబ్బంది పడతాడు. త్రిపుర బాలని టెన్షన్ తీసుకోవద్దని చెప్తుంది. పోలీస్ దగ్గరకు వెళ్లి చూపిస్తారు. ఆ కేసు క్లోజ్ చేసేశారని చెప్తారు. బాల చాలా ఒత్తిడికి గురి అవుతాడు. 

త్రిపుర పోలీస్‌కి సస్పెక్టెడ్ అడ్రస్ ఇవ్వమని అడుగుతుంది. ఎస్ఐ ఇస్తారు. ఇద్దరికీ జాగ్రత్త చెప్తారు. అంతా చాటుగా విన్న ఫణి త్రిపుర వాళ్లు చూడకుండా వెళ్లిపోతాడు. త్రిపుర, బాల అడ్రస్ పట్టుకొని ఆ రౌడీ ఇంటికి బయల్దేరుతారు. బాల, త్రిపుర రావడంతో రౌడీ భార్య వెళ్లి డోర్ తీస్తుంది. నర్శింగి గురించి అడుగుతారు. ఇద్దరినీ అతని భార్య లోపలికి పిలుస్తుంది. నా భర్త లేడు అని అంటుంది. నిజమే చెప్తున్నావా అని త్రిపుర అడిగితే నిజమే చెప్తున్నా అని దండ వేసిన ఫొటో చూపించి రెండు నెలల క్రితమే ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయారని చెప్తుంది. తీరా చూస్తా పక్క గదిలో ఫణి నర్శింగి మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు. దాంతో బాల, త్రిపుర వెళ్లిపోతారు. ఇక ఫణి నర్శింగిని వెంటనే ఫ్యామిలీని తీసుకొని వెళ్లిపోమని బెదిరిస్తాడు.  

బాలా చాలా టెన్షన్ ఫీలవుతాడు. ఒక్క ఆధారం కూడా పోయిందని అంటాడు. ఇక ఇద్దరూ ఇంటికి వెళ్తారు. తాతయ్య చావు గురించి నువ్వు నిజం ఎప్పటికీ తెలుసుకోలేవు అన్నయ్యా అని ఫణి అనుకుంటాడు. రాత్రి బామ్మ పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుంది. యశోద బామ్మతో అత్తయ్య నా బాల కృష్ణుడు మళ్లీ చిన్న పిల్లాడు అయిపోతాడా గతాన్ని మర్చిపోతాడా అని ఏడుస్తుంది. ఇక బాల త్రిపురతో నాకు గతంలో ఏమైందో తెలీదు ఆ దేవుడు నాకు ఎందుకు ఈ శాపం ఇచ్చాడో తెలీదు. నేను ఎందుకు ఎలా మారిపోయాను నాకు ఏమైంది అందరికీ అండగా ఉండాల్సిన నేను ఇలా అయిపోయాను ఏంటి అని అడుగుతాడు. చాలా బాధ పడతాడు. ఇంట్లో అందరూ దేవుడిని బాల కోసం వేడుకొని ఏడుస్తారు. 

త్రిపుర బాలతో మీకు ఆ  దేవుడు మంచే చేస్తాడు అని ధైర్యం చెప్తుంది. నేరస్తుల్ని పట్టుకోలేకపోయాను అని వాళ్లు సంబరపడిపోతుంటారు కానీ నేను వాళ్లని వదలను ఎప్పటికైనా వాళ్లని నేను పట్టుకొని వాళ్లకి తగిన శిక్ష వేస్తాను అని అంటాడు. ఇంతలో బాల చిన్ని పిల్లాడిలా మారే టైం అవడంతో తల పట్టుకొని చాలా ఇబ్బంది పడతాడు. త్రిపుర ఒడిలో పడిపోతాడు. బాలని మామూలు మనిషిగా ఉండనివ్వు దేవుడా అని యశోద ఏడుస్తుంది. త్రిపుర ఒడిలో ఉన్న బాల దగ్గరకు ఓ సీతాకోక చిలుక వస్తుంది. త్రిపుర దాన్ని చూసి పంపేస్తుంది. తర్వాత బాల చిన్నపిల్లాడిలా మారిపోతాడు. సుందరి నాకు ఐస్‌ క్రీమ్‌లు కొనిపెట్టు అని మాట్లాడుతాడు. బాలని చూసి త్రిపుర ఏడుస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్న బాలని ఎలా ఇంటికి తీసుకెళ్లాలి అని అనుకుంటుంది. 

బాల చిన్నపిల్లాడిలా ఇంటికి వెళ్లడం చూసి బామ్మ, యశోద ఏడుస్తారు. నేను సుందరితో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాను నాకు హ్యాపీగా ఉంది మీరు హ్యాపీగా ఉండండి అని అంటాడు. ఇక నాగభూషణం, వాసుకిలు త్రిపురతో నువ్వు ఎవరినో తీసుకొచ్చావ్ దాని వల్ల బాల మంచోడు అవ్వకుండా బాధ పెట్టాడని అంటుంది. బా సుందరిని ఏం అనొద్దని అంటాడు. త్రిపుర బామ్మతో ఇప్పుడు బాల గారు మారకపోయినా పూర్తిగా మార్చుతానని అంటుంది. వాసుకి వాళ్లు త్రిపురతో నువ్వేం మా బాలని మార్చుకు ప్రతి రోజు వచ్చి సక్రమంగా నీ డ్యూటీ చేసుకుంటే చాలు అంటారు. ఎవరూ త్రిపుర మాట వినరు. త్రిపుర ఏడుస్తూ వెళ్తుంటే గాయత్రీ చేయి పట్టుకొని ఆపి అక్క నువ్వు వీళ్లందరితో మాటలు పడొద్దు అక్క నా మాట విని ఈ కేర్ టేకర్ జాబ్ మానేయమని అంటుంది. త్రిపుర బాలని మామూలు మనిషిని చేస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget