అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 17th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాకు మిత్ర భార్య స్థానం, ఖడ్గం ఇచ్చినా.. ఊరి జనం ఊరుకోలేదుగా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా వంశ ఖడ్గం తీసుకొని గుడికి బయల్దేరడం ఊరి జనం వచ్చి లక్ష్మీ ఖడ్గం తీసుకురాకపోతే పూజలు ఆపేస్తాం అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode వివేక్ జానుని చాటుగా తీసుకెళ్లి పెళ్లి అయిన తర్వాత కూడా ముద్దు ముచ్చట లేదని ముద్దు ఇవ్వమని అడుగుతాడు. జాను వెటకారంగా దానికి కూడా మీ అమ్మ పర్మిషన్ కావాలని అంటుంది. ఇక వివేక్ జానుని ముద్దు పెట్టుకుంటాడు. రాత్రి లక్ష్మీ ఖడ్గం తీసుకొని ఆరు బయట ఆటు ఇటూ తిరగడం జయదేవ్ చూస్తాడు. షాక్ అయిపోతాడు. అరవింద రావడంతో లక్ష్మీని చూపిస్తాడు. అరవింద కూడా షాక్ అవుతుంది. మిత్ర కూడా కత్తి పట్టుకొని తిరగడం చూస్తాడు. 

అరవింద: ఈ టైంలో అక్కడేం చేస్తుందండి.
జయదేవ్: ఇంకా నీకు అర్థం కలేదా ఈ కుటుంబాన్ని కాపాడటానికి అలా తిరిగుతుంది. తనని చూస్తుంటే దేశ సరిహద్దుల్లో సైనికుడిలా ఊరి పోలి మేరలో తిరిగే గ్రామ దేవతలా కనిపిస్తుంది. 
అరవింద: నిజమే అండీ లక్ష్మీ మన ఇంటికి దేవత మిత్ర ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేస్తున్న దేవత. మిత్ర ఎందుకండీ లక్ష్మీని అపార్థం చేసుకుంటున్నాడు. 

రౌడీలు వచ్చి చూసి లక్ష్మీ తిరగడం చూసి ఈ రాత్రికి ఏం చేయలేమని వెళ్లిపోతారు. ఉదయం గుడి దగ్గరకు అమ్మవారి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. అందరూ నందన్ వంశ రాక కోసం ఎదురు చూస్తారు. ఇక ఇంట్లో అందరూ రెడీ అవుతారు. అరవింద ఇద్దరు కోడళ్లు లక్ష్మీ ,జానులకు దీపం పెట్టమని అంటుంది. ఇద్దరూ వెళ్తుంటే మనీషా ఆపుతుంది. 

మనీషా: దీపాలు నేను వెలిగిస్తా. 
అరవింద: ఇంటి కోడల్లే దీపాలు వెలిగించాలి నువ్వు ఎలా వెలిగిస్తావ్ మనీషా.
దేవయాని: తను కాబోయే కోడలు కదా అక్క.
మనీషా: ఈ లక్ష్మీ అడ్డుకోవడం వల్లే నా పెళ్లి జరగలేదు.
అరవింద: ఆ పెళ్లి జరగలేదు కాబట్టే నీకు దీపం పెట్టొద్దు అన్నా. ఇప్పటికి లక్ష్మీనే ఈ ఇంటి కోడలు.
మనీషా: ఏంటి మిత్ర ఇది నన్ను ఇక్కడికి పిలిచి అవమానిస్తారా. అందుకేనా నన్ను ఇక్కడికి రమ్మన్నారు. 
మిత్ర: మామ్ దీపాలు ఎవరు వెలిగిస్తే ఏంటి మనీషానే విలిగించనివ్వు. 
జయదేవ్: అది కాదు మిత్ర లక్ష్మీ ఉండగా మనీషా ఎలా వెలిగిస్తుంది. 
లక్ష్మీ: మామయ్య గారు పర్లేదు దేవుడి కార్యం ఎవరు చేస్తే ఏంటి. మనీషా నువ్వే వెలిగించు. జాను నువ్వు కూడా వెలిగించు. జాను వెళ్లేలోపు మనీషానే రెండు వెలిగించేస్తుంది. అదేంటి మనీషా రెండు దీపాలు నువ్వు వెలిగించావ్ జాను కూడా ఈ ఇంటి కోడలు తాను వెలిగించాలి కదా.
మనీషా: నేను ఏదీ సగం సగం చేయను.
దేవయాని: మంచి పని చేశావ్ మనీషా. 
మనీషా: మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఒక దీపం ఆర్పేసి జానుని వెలిగించమనండి నాకు అభ్యంతరం లేదు. 
లక్ష్మీ: ఆ మాట ఎలా అంటావ్ మనీషా దీపం ఆర్పడం అంటే ఏంటో తెలుసా నీకు.
అరవింద: అదే తెలిస్తే తను మనతో ఎందుకు ఉంటుంది లక్ష్మీ. మిత్ర కూడా తనకే సపోర్ట్ చేస్తున్నాడు.

మనీషా ఖడ్గం తీసుకోవడానికి వెళ్తే వద్దని అరవింద ఆపుతుంది. దానికి మనీషా ఈ సారి అమ్మవారి పూజ నా చేతుల మీదే జరుగుతుందని అంటుంది. జయదేవ్ మనీషా మీద కోప్పడతాడు. తనకి అర్థమయ్యేలా చెప్పమని మిత్రకు అంటాడు. మిత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. మిత్ర మాత్రం పర్వాలేదు మనీషాని తీసుకురమ్మని అంటుంది. అరవింద మాత్రం ఏంటి పర్వాలేదు అని అంటుంది. మిత్రనే మౌనంగా ఉంటే నేను మాట్లాడి ప్రయోజనం లేదని లక్ష్మీ అంటుంది. మిత్ర మనీషాకి చెప్పబోయే టైంలో మనీషా మిత్ర మనం ప్రేమించుకున్నప్పుడే, నువ్వు నీతో లక్ష్మీకి సంబంధం లేదన్నప్పుడే, మనం పెళ్లి పీటలు ఎక్కినప్పుడే నాకు నీ భార్యగా అన్ని హక్కులు ఉన్నాయని కాదు అంటే ఇప్పుడే వెళ్లిపోతా అంటుంది.

ఇంతలో ఊరి పెద్దలు రావడంతో మనీషా ఖడ్గం తీసుకొని వెళ్లిపోతుంది. అందరూ చూస్తూ ఉండిపోతారు. పెద్ద మనుషులు మాత్రం వంశ కోడలి చేతిలోనే ఖడ్గం ఉండాలని అంటారు. నేను ఇంటి కోడలినే అని మనీషా అంటే మీరు కాదు లక్ష్మీ అమ్మే ఈ ఇంటి కోడలని అంటారు పెద్ద మనుషులు. మిత్ర మీ మెడలో తాళి కట్టలేదు కదా మీరు ఎలా భార్య అవుతారు ఎలా కోడలు అవుతారు అని అంటారు. ఇదంతా ఊరందరికి సంబంధించనదని లక్ష్మీ ఖడ్గం తీసుకొని వస్తే ఓకే లేదంటే జాతర ఆపేస్తామని అంటారు. దాంతో తప్పని పరిస్థితుల్లో మనీషా ఖడ్గం లక్ష్మీకి ఇస్తుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read:  సత్యభామ సీరియల్: సత్యకి గన్ గురి పెట్టిన రుద్ర.. నందినిని గదిలో లాక్ చేసి హర్షతో మైత్రి రొమాన్స్!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget