Sapthagiri: బ్లాక్లో టికెట్స్ అమ్ముతోన్న స్టార్ కమెడియన్ - వీడియో వైరల్
కమెడియన్ సప్తగిరి 'పక్కా కమర్షియల్' టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ కనిపించారు. 'పక్కా కమర్షియల్ సినిమా టికెట్స్ రూ.150 అంటూ థియేటర్ ముందు రచ్చ చేశారు.

'సీటీమార్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న గోపిచంద్.. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్'(Pakka Commercial) అనే సినిమాలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై1, 2022న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఈ క్రమంలో విడుదల చేసిన సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమా టికెట్స్ ను నాన్ కమర్షియల్ రేట్స్ కే విక్రయిస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెప్పారు. తాజాగా ఈ విషయాన్ని జనాలకు మరింత రీచ్ అయ్యే విధంగా డిఫరెంట్ ప్రమోషన్ చేపట్టారు. అదేంటంటే.. ఈ సినిమాలో నటించిన కమెడియన్ సప్తగిరి 'పక్కా కమర్షియల్' టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ కనిపించారు. 'పక్కా కమర్షియల్ సినిమా టికెట్స్ రూ.150 అంటూ థియేటర్ ముందు రచ్చ చేశారు.
ఆ తరువాత ఆయన్ను దర్శకుడు మారుతి దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడు ఆయన బ్లాక్ లో ఎందుకు అమ్ముతున్నావని అడగ్గా.. సినిమా ఇండస్ట్రీకి రాకముందు చిరంజీవి సినిమాల టికెట్స్ బ్లాక్ లో అమ్మేవాడినని సప్తగిరి అన్నారు. 'పక్కా కమర్షియల్' సినిమా టికెట్ రేట్స్ పై క్లారిటీ ఇచ్చే క్రమంలో ఈ ప్రమోషనల్ వీడియో చేశారు. నాన్ కమర్షియల్ రేట్లకే పక్కా కమర్షియల్ సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు.
Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
View this post on Instagram
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















