Pawan Kalyan: 'OG'లో ఛాన్స్ కొట్టేసిన తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్లు, పవర్ స్టార్ ప్రశంసలు
‘ఆహా‘ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలేకి రెడీ అవుతోంది. షో చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పలువురు కంటెస్టెంట్లను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.
Pawan Kalyan Lauds Telugu Indian Idol 3 Contestants: తెలుగు ఓటీటీ దిగ్గజం ‘ఆహా‘ అట్టహాసంగా నిర్వహిస్తున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ 3‘ చివరి దశకు చేరుకుంది. త్వరలో ఈ షో విజేత ఎవరో తేలిపోనుంది. సుమారు 15 వేల మంది ఔత్సాహిక గాయకులు ఈ పోటీలో పాల్గొనగా, ఇప్పుడు ఆరుగురు ఫైనల్స్ కు సెలెక్ట్ అయ్యారు. ఎంతో మందిని ఫిల్టర్ చేసిన తర్వాత 12 మందిని షోకు ఎంపిక చేశారు. వీరిలో భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం సెలెక్ట్ అయ్యారు. గత 24 ఎపిసోడ్ లలో పలు ఎలిమినేషన్స్ నిర్వహించగా, చివరకు ఆరుగురు ఫైనల్ కు చేరుకున్నారు. వారిలో అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, భరత్, నసీరుద్దీన్ ఉన్నారు. ‘తెలుగు ఇండియన్ ఐడల్ 3‘ ఆరుగురు ఫైనలిస్టులు సెమీస్ లో అద్భుతమైన పాటలో ఆకట్టుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోలో ఫైనలిస్టులు సంప్రదాయ దుస్తులో వినాయకుడి పాటలతో అలరించారు. సెప్టెంబర్ 6, 7న ఈ సెమీస్ ఎపిసోడ్స్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి.
నసీరుద్దీన్, భరత్ ను అభినందించిన పవర్ స్టార్
ఓవైపు ‘తెలుగు ఇండియన్ ఐడల్ 3‘ లో కంటెస్టెంట్స్ గా కొనసాగుతుండగానే నసీరుద్దీన్, భరత్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' సినిమాలో పాట పాడే అవకాశం దక్కించుకున్నారు. రీసెంట్ గానే ఆ పాటను రికార్డింగ్ చేశారు. ఈ పాటను విన్న పవన్ కల్యాణ్.. నసీరుద్దీన్, భరత్ వాయిస్ కు ఫిదా అయ్యారని ఈ షో జడ్జి, ‘OG’ సంగీత దర్శకుడు థమన్ వెల్లడించారు. వారిద్దరినీ ప్రత్యేకంగా ప్రశంసించారని చెప్పారు. తమన్ మాటలు విని నసీరుద్దీన్, భరత్ సంతోషం వ్యక్తం చేశారు. పలువురు నెటిజన్లు వీరిద్దరికి అభినందనలు చెప్తున్నారు.
View this post on Instagram
'OG' మూవీ గురించి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాల్లో 'OG' ఒకటి. ఏపీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా 'OG' కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరలో 'OG' సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also: అల్లు అర్జున్ కు మరో ఆప్షన్ లేదా? నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్ తో చేయక తప్పదా?