అన్వేషించండి

Keechurallu OTT: థియేటర్లలో విడుదలైన రెండేళ్లకు తెలుగు ఓటీటీలోకి వస్తున్న మలయాళ థ్రిల్లర్- ఎందులో, ఎప్పుడు చూడాలంటే?

Rajisha Vijayan: ర‌జిషా విజ‌య‌న్ ప్రధాన పాత్రలో నటించిన మ‌ల‌యాళం మూవీ ‘కీడం‘ తెలుగులో ‘కీచురాళ్ళు‘ పేరుతో విడుదలకు రెడీ అవుతోంది. ఈ మూవీ ఈటీవీ విన్ వేదికగా మే 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

Keedam Telugu Dubbing OTT Release: కేరళ బ్యూటీ ర‌జిషా విజ‌య‌న్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళీ చిత్రం ‘కీడం‘. రాహుల్ రిజీ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సైబ‌ర్ థ్రిల్ల‌ర్... 2022లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. మలయాళంలో థియేటర్లలో విడుదలైన రెండేళ్లకు తెలుగులో విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని ‘కీచురాళ్లు‘ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశారు. ఆ వెర్షన్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా మే 30 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ‘కీచురాళ్ళు‘ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.   

‘కీచురాళ్లు‘ సినిమా కథ ఏంటంటే?   

‘కీచురాళ్ళు‘ సినిమాలో ర‌జిషా విజ‌య‌న్‌తో పాటు శ్రీనివాస‌న్‌, విజ‌య్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రాజీషా సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిగా కనిపించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... రాధికా బాల‌న్ (ర‌జిషా విజ‌య‌న్‌) ఓ సైబ‌ర్ సెక్యూరిటీ స్టార్ట‌ప్ సంస్థను ప్రారంభిస్తుంది. సైబర్ క్రైమ్ కు సంబంధించిన కేసులను పరిష్కరించడంలో బాధితులతో పాటు పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తుంది. అనుకోకుండా ఓసారి ఆమే సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారిపోతుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంటాడు. ఇంతకీ అతడు ఎవరు? ఆమెను ఎందుకు బెదిరించాడు? తన తెలివితో అతడిని ఎలా పట్టుకుంది? అనేది ఈ సినిమాలో చూపించారు. సైబర్ మోసాల వలలో మహిళలలు ఎలా చిక్కుకుంటున్నారు? అనే విషయాన్ని దర్శకుడు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ మూవీపై పలువురు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. 

నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో మంచి గుర్తింపు

ర‌జిషా విజ‌య‌న్‌ రొటీన్ పాత్రలు కాకుండా, నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు రజిషా 20కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్‘ సినిమాలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. ‘లవ్‘, ‘మధురమనోహర మోహన్‘, ‘మ‌ల‌యాన్ కుంజు‘ సహా పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఆమె ఓ సినిమా చేసింది. రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమలో కనిపించింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తెలుగులో మరే సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు ‘కీచురాళ్ళు‘ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఆమెకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Read Also: ‘గం గం గణేశా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!

టాప్ హెడ్ లైన్స్

Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Oh Sukumari OTT : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్ - ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్ - ఈ మూవీస్ డోంట్ మిస్
Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Embed widget