Nindu Manasulu Serial Today Feb 20th: గణ మాటలకు ఏడుస్తూ సిద్ధూ వాళ్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రేరణ...మీనాన్న,వాళ్ల నాన్న ఒక్కటేనని నాకు తెలుసని ప్రేరణతో అన్న సిద్ధు
Nindu ManasuluSerial Today Episode February 20th:గణ మాటలకు ఏడుస్తూ సిద్ధూ వాళ్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రేరణ...మీనాన్న,వాళ్ల నాన్న ఒక్కటేనని నాకు తెలుసని ప్రేరణతో అన్న సిద్ధు

Nindu Manasulu Serial Today Episode: సిద్ధూ వాళ్ల ఇంట్లో ప్రేరణ వాళ్లదే తప్పు అన్నట్లు నిరూపించడానికి గణ చేసిన ప్రయత్నాలతో ఆమెకు చాలా కోపం వస్తుంది. వీళ్లు మానాన్నకు పుట్టిన అక్రమ సంతానం అని చెప్పడంతో ప్రేరణ చాలా ఏడుస్తుంది. వీడు అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని ..గణ వాళ్ల నాన్నే మా నాన్న అని ప్రేరణ చెబుతుంది. మా నాన్న ఎలాంటి వాడో వీడు చెప్పాల్సిన పనిలేదని...మా నాన్నను అడిగితే ఆయనే చెబుతాడని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెంటే సిద్ధూ కూడా వెళ్లిపోతాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని గణ మంజుల వద్ద రెచ్చిపోతాడు. మీరు చూస్తుండగానే సిద్ధూ ఆ ప్రేరణ వెనక ఎలా వెళ్లిపోయాడో చూశారుగా అంటాడు.ఇలాగా మా నాన్నను కూడా వీళ్లఅమ్మ మాయ చేసిందని అంటాడు. దీనికి సిద్ధూ వాళ్ల నాన్న అడ్డు చెబుతాడు. మా కొడుకు ఎలాంటి వాడో మాకు నువ్వు చెప్పాల్సిన పనిలేదని హెచ్చరిస్తాడు. అయితే సాహితితో నా పెళ్లి జరిపిస్తారా అత్తయ్యగారు అంటూ అడగుతాడు. వర్షను నేను మోసం చేయలేదని తేలిపోయింది కదా....ఇప్పుడు ఈ పెళ్లికి ఉన్న అభ్యంతరం ఏంటని అంటాడు. అతని మాటలు విన్న మంజుల కోపంతో రగిలిపోతుంది. నువ్వు ఎలాంటి వాడివో , నీ ఫ్యామిలీ ఎలాంటిదో తెలిసిన తర్వాత కూడా నీకు నా కూతురుని ఎలా ఇస్తానను అనుకున్నావని మండిపడుతుంది. మర్యాదగా బయటకు వెళ్లిపొమ్మని అంటుంది.
చిన్న కుమార్తెతో కలిసి భర్త ఉన్న తన అక్క ఇంటికి ప్రేరణ తల్లి వెళ్తుంది.అక్కడ భర్త గది చిందరవందరగా ఉండటాన్ని చూసి చిన్న కూతురు ఐష్ మండిపడుతుంది.అసలు ఇది ఇల్లేనా అంటూ నిలదీస్తుంది. ఇలా అయితే మా నాన్నకు ఎప్పుడు నయమవుతుందని మండిపడుతుంది.దీంతో వాళ్ల పెద్దమ్మ ఏంటే నా ఇంటికి వచ్చి నామీదే అరుస్తున్నావు అని అంటుంది. దీంతో ఐష్వాళ్ల అమ్మతో నాన్నను మన ఇంటికి తీసుకెళ్లిపోదామని గొడవ చేస్తుంది. నాన్న తనంతట తానే మన ఇంటికి వచ్చినప్పుడే తీసుకెళ్లాలని అప్పటి వరకు మనం ఇక్కడికి వచ్చి ఆయనకు సేవలు చేసుకోవాల్సిందేనని అంటుంది. ఇంతలో వాళ్ల అక్క చాలా గొడవ చేస్తుంది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందని నా దగ్గర దాచి ఆయన్ను పెళ్లి చేసుకున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో ఐశ్వర్య ఈశ్వరిపై మండిపడుతుంది. మానాన్నను ఏమైనా అంటే ఒప్పుకోనని అంటుంది. ప్రతీగా ఇందిర కూడా ఈశ్వరికి గట్టిగా క్లాస్ పీకడంతో ఆమె ఆరూమ్లో నుంచి వెళ్లిపోతుంది. తల్లీబిడ్డ కలిసి ఆ రూమ్ శుభ్రం చేస్తారు.
గణ అన్న మాటలకు ఏడ్చుకుంటూ బయటకు వెళ్లిపోయిన ప్రేరణను సిద్ధూ ఓదార్చుతాడు. నువ్వు ఏ తప్పు చేయనంత వరకు ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటాడు. చిన్నప్పటి నుంచి మేం ఈ అవమానాలు పడుతూనే ఉన్నామని ప్రేరణ ఏడుస్తుంది. మానాన్న మాతో ఎంతో ప్రేమగా ఉండేవారని...కానీ ఈ గణ వాళ్లే ఆయన్ను,మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారని...అంటుంది. ఎక్కడికక్కడ మా పరువు తీస్తున్నారని,ఆయన అసలు మానాన్నే కాదని అంటున్నారని అంటుంది. ఇలా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నానని చెబుతుంది. ఎవరు ఏం అనుకున్నా మీనాన్న లక్ష్యం నెరవేర్చడమే నీ లక్ష్యం కావాలని అంటాడు. మధ్యలో ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు. నేను నిన్ను నిజంగా నమ్ముతున్నానని నువ్వు ఎవ్వరి గురించి పట్టించుకోవద్దని అంటాడు. అయినా నీతండ్రి, గణతండ్రి ఒక్కరేనని నాకు ముందే తెలుసంటాడు. ఆ మాటలు విన్న ప్రేరణ షాక్ తింటుంది. మరి ఎందుకు అడగలేదని అంటే....చెప్పే అవసరం వస్తే నువ్వే చెబుతావు కదా అందుకే అడగలేదని చెబుతాడు. దీంతో ప్రేరణ సిద్ధూ గుండెలపై వాలిపోవడంతో ఈ రోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.























